కొందరు నాయకులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా సహకరిస్తారు. ఇది ఎక్కడైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం.. దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. తాము ఎదగడమే ముఖ్యమని భావిస్తున్న నాయకులు కొందరు టీడీపీలో చర్చకు వస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గంలో 25 ఏళ్లుగా ఒకే నాయకుడు పాతుకుపోయారు. ఆయనపై ఆరోపణలు కూడా తక్కువేమీ లేవు. అయినా.. ఆయన తప్ప ఇంకెవరూ పార్టీ కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదని షరతు విధించారు.
ఇక, విజయవాడలోని ఓ కీలక నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ వరుస విజయాలు దక్కిం చుకోకపోయినా.. గత ఎన్నికల్లో సదరు ఫైర్ బ్రాండ్ నాయకుడు విజయం దక్కించుకున్నారు. వాస్తవానికి ఇక్కడ పార్టీ పుంజుకునేందుకు భారీ స్కోప్ ఉంది. నాయకులు కూడా ఎక్కువగా ఉన్నారు. కానీ, సదరు ఎమ్మెల్యే మాత్రం లక్ష్మణ రేఖలు గీశారు. ఏం చేసినా.. తనకు తెలియాల్సిందేనని షరతు విధించారు. దీంతో నాయకులు ఎదగలేక.. ఎమ్మెల్యే చెప్పినట్టే వింటున్నారు.
ఇలాంటి చర్యల వల్ల పార్టీ పురోగతికి ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నా.. సదరు నేత మాత్రం వినిపించుకోవడం లేదు. ఇక, అనంతపురంలో ఎమ్మెల్యే ఒకరు అయితే.. చక్రం తిప్పుతోంది.. మరొకరు అనే మాట వినిపిస్తోంది. ఉమ్మడి అనంతపురంలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సమస్య జోరుగా వినిపి స్తోంది. దీంతో పార్టీలో ఔత్సాహిక యువత ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సీనియర్లు సరే.. జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వాలని పార్టీ చెబుతున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇక, ప్రతి విషయంలోనూ.. తన మాటే నెగ్గాలని నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు భీష్మిస్తున్నారు. ఇది పార్టీ నాయకులకే కాకుండా.. అధికారులకు కూడా తేల్చి చెబుతున్నారు. దీంతో ఇక్కడ కూడా పనులు ముందుకు సాగడం లేదు. పార్టీ పరంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉన్నా.. ఇలాంటి అడ్డంకుల కారణంగా.. కార్యకర్తలు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారంపై పార్టీ ఎప్పటికప్పుడు దృష్టి పెడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం మార్పు కనిపించడం లేదని అంటున్నారు.
This post was last modified on February 26, 2026 11:18 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…