టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో టీమిండియా ఎట్టకేలకు ఊపిరి పీల్చుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో భారత్ 2 పాయింట్లు నెట్ రన్ రేట్ -0.100 కు చేరి పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి ఎగబాకింది. మరోవైపు, సౌత్ ఆఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడంతో భారత్పై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఇప్పుడు మార్చి 1న వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే టీమిండియా నేరుగా సెమీస్కు చేరుకుంటుంది.
ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 256/4 వంటి భారీ స్కోరు సాధించి తమ పవర్ ఏంటో చూపించారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ (55), హార్దిక్ పాండ్యా (50*), తిలక్ వర్మ (44*) మెరుపు ఇన్నింగ్స్లతో స్టేడియంను హోరెత్తించారు. ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33) కూడా కీలక పరుగులు జోడించడంతో భారత్ ఈ వరల్డ్ కప్లోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది.
అయితే, బ్యాటింగ్ లో చూపించిన దూకుడు బౌలింగ్ లో కనిపించకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అంత భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే ఏకంగా 184 పరుగులు చేసిందంటే మన బౌలింగ్ ఎంత సాధారణంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ టోర్నీలో ఏ జట్టు మీద కొట్టనంత స్కోరును జింబాబ్వే భారత్పై సాధించడం గమనార్హం. అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ, శివం దూబే (2 ఓవర్లలో 46 పరుగులు) వంటి వారు ధారాళంగా పరుగులు ఇవ్వడం సెమీస్ చేరే జట్టుకు ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా బుమ్ర వికెట్లు తీయలేదు.
జింబాబ్వే బ్యాటర్ బ్రయన్ బెన్నెట్ (97) భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి సెంచరీకి చేరువయ్యాడు. ఒకానొక దశలో జింబాబ్వే గట్టి పోటీ ఇవ్వడం భారత బౌలింగ్ లైనప్లోని లోపాలను బయటపెట్టింది. ఫీల్డింగ్ లో కూడా కొన్ని పొరపాట్లు జరగడం చూస్తుంటే, పెద్ద జట్లతో ఆడేటప్పుడు ఇలాంటి నిర్లక్ష్యం భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికా సెమీస్కు క్వాలిఫై అవ్వగా, జింబాబ్వే టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇప్పుడు అసలైన పోరు వెస్టిండీస్తోనే. విండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు తమ వ్యూహాలను మార్చుకోవాలి. కేవలం భారీ స్కోర్లు చేస్తే సరిపోదు, ఈజీగా గెలవాలి అంటే ప్రత్యర్థులను తక్కువ స్కోరుకే కట్టడి చేయాల్సి ఉంటుంది. మరి మార్చి 1న జరిగే చావోరేవో తేల్చుకునే మ్యాచ్లో మన బౌలర్లు ఎలా పుంజుకుంటారో చూడాలి.
This post was last modified on February 26, 2026 11:10 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…