Trends

రిటైర్డు ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో దోపిడీ.. రూ.100 కోట్లకు ఎస్ఐ స్కెచ్!

రిటైర్డు ఐఆర్ఎస్ అధికారి శామ్యూల్ ప్రసాద్ ఇంట్లో జరిగిన దోపిడీ ఉదంతంలో కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్ లో పాత్రధారి రియల్టర్ సురేందర్ అయితే.. సూత్రధారి ఎస్ఐ క్రిష్ణ అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రిటైర్డు ఐఆర్ఎస్ అధికారికి చెందిన రూ.100 కోట్ల విలువైన భూముల్ని కొట్టేయాలన్న స్కెచ్ లో భాగంగా దస్తావేదుల దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

మాజీ ఐఆర్ఎస్ అధికారికి మత్తు మందుతో కూడిన ఆహారాన్ని ఇచ్చి.. అనంతరం వారింట్లో భూమి పత్రాలతో పాటు.. వెండి.. బంగారాన్ని దోచికెళ్లిన వైనం ఆలస్యంగా బయటకు రావటం తెలిసిందే. పోలీసు వర్గాల్లో పెను సంచనలనంగా మారిన ఈ ఉదంతంపై తొలుత పోలీసులు పెద్ద ఆసక్తి చూపించకున్నా.. స్వయంగా పోలీస్ బాస్ సీన్లోకి రావటంతో ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం జరిగిందేమిటన్న అంశాల్ని ఆరా తీస్తున్న అధికారులకు షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

శామ్యూల్ ప్రసాద్ కు హైదరాబద్.. వికారాబాద్.. చేవెళ్లతో పాటు ఏపీలోని విశాఖలోనూ బంధుమిత్రుల పేర్లుతో రూ.వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. శామ్యూల్ భార్య మరణించగా.. ఇద్దరు కుమారులు.. కుమార్తెలు అమెరికాలో సెటిల్ అయ్యారు. 20 ఏళ్లుగా వారు హైదరాబాద్ కు రాలేదు. శామ్యూల్ ఒంటరిగా ఉంటున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. మూడేళ్ల క్రితం వికారాబాద్ దగ్గర్లోని మద్దూరులో 8 ఎకరాల భూమిని రియల్టర్ సురేందర్ ద్వారా.. ఎస్ ఐ క్రిష్ణకు అమ్మారు శామ్యుల్ ప్రసాద్. దీనికి సంబంధించి మూడు ఎకరాలకు సంబంధించిన అంశంలో వివాదం నడుస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రిటైర్డు అధికారి శామ్యూల్ కు సంబంధించిన వివరాలు తెలుసుకున్న ఎస్ఐ క్రిష్ణ.. అయిన వారంతా ఎక్కడో దేశం కాని దేశంలో ఉండటం.. అతడి దగ్గర రూ.100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న విషయాన్ని గుర్తించి.. వాటిని కొట్టేసే స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా శామ్యుల్ కు బాగా పరిచయం ఉన్న సరేందర్ సాయం తీసుకొని.. ఎస్ఐ క్రిష్ణ సూచనలతో మత్తు మందు కలిపిన ఆహారాన్ని ఇచ్చారు. స్ప్రహ కోల్పోయిన వెంటనే.. ఇంట్లో ఉన్న ఆస్తిపత్రాలతో పాటు.. బంగారు.. వెండి ఆభరణాల్ని దొంగలించారు. ఇందులో భాగంగా రూ.5 లక్షల క్యాష్ ను కూడా దోచాడు.

ఇంట్లో దొంగతనం జరిగిందన్న భావన కలిగేలా ఇంట్లోని వస్తువుల్ని చిందరవందర చేశారు. ఆ ఆస్తుల్ని సబ్ రిజిస్ట్రార్ సాయంతో కొట్టేయాలని పథకం వేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.. ఎస్ఐ క్రిష్ణ ప్లాన్ వేసినా.. సామ్యూల్.. క్రిష్ణ.. సురేందర్ మధ్య జరిగిన ఫోన్ కాల్స్.. చాటింగ్ సంభాషణలు.. సీసీ ఫుటేజ్ లతో పోలీసులు మొత్తం విషయాల్ని వెలికితీశారు. దీంతో పాటు సురేందర్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. మొత్తం విషయాన్ని పూసగుచ్చినట్లుగా చెప్పేశారు. అతడి దగ్గర నుంచి భూమి పత్రాల్ని పోలీసు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిసింది.

ఈ ఉదంతం వెలుగు చూసిన నాటి నుంచి ఎస్ఐ క్రిష్ణ పరారీలో ఉన్నారు. అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. శామ్యూల్ కు చెందిన 40 దాకా ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ క్రిష్ణను అదుపులోకి తీసుకునేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పోలీస్ బ్రెయిన్ తో నేరం చేసిన ఎస్ఐ క్రిష్ణ.. టెక్నాలజీ పుణ్యమా అని అడ్డంగా దొరికిపోయినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on June 29, 2023 5:30 pm

Share

Recent Posts

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

38 minutes ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

2 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

2 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

5 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

6 hours ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

6 hours ago