దక్షిణాదిన పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో సూర్య ముందు వరసలో ఉంటాడు. గజిని సహా ఎన్నో సినిమాల్లో సూర్య తన పాత్రల కోసం నమ్మశక్యం కాని మేకోవర్లతో కనిపించాడు. సూర్య ప్రస్తుతం.. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియడ్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోనూ సూర్య రకరకాల అవతారాల్లో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో సూర్య లుక్ ఏదీ బయటికి రాలేదు.
తాజాగా కొడైకెనాల్లో కుటుంబంతో కలిసి పర్యటిస్తున్న సందర్భంగా సూర్య ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో గడ్డం పెంచి డిఫరెంట్ లుక్లో కనిపించాడు సూర్య. సడెన్గా చూస్తే అది సూర్యనే అని కనిపెట్టడం కష్టమయ్యేలా ఉంది తన లుక్. దీన్ని బట్టి సినిమాలో సూర్య లుక్ ఎలా ఉండబోతోందో ఒక అంచనాకు వస్తున్నారు ఫ్యాన్స్.
ఈ చిత్రానికి తమిళంలో కంగువ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇంకా తెలుగు టైటిల్ ప్రకటించలేదు. అజిత్తో వరుసగా నాలుగు చిత్రాలు (వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం) తీసిన శివ.. ఆ తర్వాత రజినీకాంత్తో ‘అన్నాత్తె’ చేశాడు. అది సరిగా ఆడకపోయినా సూర్య శివను నమ్మి ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య యోధుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి.
ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో చూడొచ్చంటున్నారు. మన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధ:లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on May 11, 2023 8:05 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…