దక్షిణాదిన పాత్ర కోసం ఎంత కష్టమైనా పడే హీరోల్లో సూర్య ముందు వరసలో ఉంటాడు. గజిని సహా ఎన్నో సినిమాల్లో సూర్య తన పాత్రల కోసం నమ్మశక్యం కాని మేకోవర్లతో కనిపించాడు. సూర్య ప్రస్తుతం.. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీరియడ్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోనూ సూర్య రకరకాల అవతారాల్లో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో సూర్య లుక్ ఏదీ బయటికి రాలేదు.
తాజాగా కొడైకెనాల్లో కుటుంబంతో కలిసి పర్యటిస్తున్న సందర్భంగా సూర్య ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో గడ్డం పెంచి డిఫరెంట్ లుక్లో కనిపించాడు సూర్య. సడెన్గా చూస్తే అది సూర్యనే అని కనిపెట్టడం కష్టమయ్యేలా ఉంది తన లుక్. దీన్ని బట్టి సినిమాలో సూర్య లుక్ ఎలా ఉండబోతోందో ఒక అంచనాకు వస్తున్నారు ఫ్యాన్స్.
ఈ చిత్రానికి తమిళంలో కంగువ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇంకా తెలుగు టైటిల్ ప్రకటించలేదు. అజిత్తో వరుసగా నాలుగు చిత్రాలు (వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం) తీసిన శివ.. ఆ తర్వాత రజినీకాంత్తో ‘అన్నాత్తె’ చేశాడు. అది సరిగా ఆడకపోయినా సూర్య శివను నమ్మి ఓ భారీ చిత్రం చేస్తున్నాడు. భారీ బడ్జెట్లో పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సూర్య యోధుడిగా కనిపించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి.
ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అని తెలుస్తోంది. భారీ యుద్ధ సన్నివేశాలు ఈ చిత్రంలో చూడొచ్చంటున్నారు. మన దేవిశ్రీ ప్రసాదే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పఠాని కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధ:లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజాతో కలిసి యువి క్రియేషన్స్ అధినేతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
This post was last modified on May 11, 2023 8:05 am
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…