కొన్నేళ్ల చిత్ర విచిత్రమైన ఉదంతాలు కొన్ని విదేశాల్లో జరిగినట్లుగా వార్తా పత్రికల్లో చదివేటోళ్లం. అలాంటప్పుడు.. ఇలాంటివి మన దగ్గర జరిగే అవకాశం లేదన్నట్లుగా అనుకునేటోళ్లు. ఇప్పుడు కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి. గతంలో ఇలాంటివి మన దగ్గర జరిగే ఛాన్సులే లేవనుకున్న ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది. దీని గురించి తెలిసిన వారంతా అవాక్కు కావటమే కాదు.. ముక్కున వేలేసుకుంటున్నారు.
చందానగర్ కు చెందిన 26 ఏళ్ల టీచర్ ఒక ప్రైవేటు స్కూల్లో పని చేస్తోంది. అదే స్కూల్ లో చదివే పదో తరగతి కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడుస్తున్న వైనం బయటకు వచ్చింది. ఇదంతా ఎలానంటే.. ఆ టీచర్ రెడు రోజులు పాటు కనిపించకుండా పోవటం.. దీంతో ఆమె తాత చందానగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అదే సమయంలో పదో తరగతి విద్యార్థి కూడా కనిపించకుండా పోయాడు. అతడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 16న వెళ్లిన వారు.. రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చారు. పిల్లాడ్ని ఎక్కడికి వెళ్లావని నిలదీయగా.. అసలు విషయం చెప్పటంతో విషయం బయటకు వచ్చింది.
దీంతో.. పోలీసులకు సమాచారాన్ని ఇవ్వటంతో ఆమెను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో టీచర్ తాత తాను ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లుగా తెలిసింది. సదరు టీచర్ కు ఈ మధ్యన పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో వారు ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అక్కడెక్కడో ప్రాశ్చత్య దేశాల్లో జరుగుతుంటాయన్న విషయాలు.. ఇప్పుడు మన దగ్గర చోటు చేసుకోవటం గమనార్హం.
This post was last modified on March 4, 2023 11:03 am
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…