Trends

అపుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం, ఇపుడు కూరగాయల కొట్టు

జపాన్ లో ఏ పాఠశాలల్లో పనివాళ్లు ఉండరు. ఎందుకో తెలుసా? పిల్లలకు పనివిలువ నేర్పడానికి ఊడ్చడం నుంచి బాత్ రూంలు కడగడం వరకు అన్నీ ఆ పిల్లలే చేసుకుంటారు. ఎందుకిలా చేస్తారంటే… పిల్లలకు పనివిలువ తెలియాలని ఒక సిద్దాంతంగా పెట్టుకున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఇంతే. ఏ మార్పు ఉండదు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగాలు పోయాయి. ఎక్కువగా టూరిజం, విమానయాన రంగాలపై ప్రభావం పడింది. ఐటీ రంగంపై కాస్త తక్కువగా ప్రభావం పడినప్పటికీ పలు సంస్థలు ఉద్యోగాల కోతను చేపట్టాయి. కరోనా కారణంగా వరంగల్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగి కూడా టెక్కీ ఉద్యోగం కోల్పోయినప్పటికీ కూరగాయల దుకాణం నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఉద్యోగం కోల్పోయినప్పటికీ ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు కూరగాయలు అమ్ముతూ యువతకు ఆదర్శంగా నిలిచారు. నామోషీ అనే మాటకు తావే లేదని, బ్రతకడానికి నిజాయితీగా ఏమైనా చేయొచ్చని ఆమె గర్వంగా చెప్పారు.

వరంగల్‌కు చెందిన శారద ఓ సాఫ్టువేర్ కంపెనీలో పర్ఫార్మెన్స్ అనలిస్ట్ విభాగంలో పని చేశారు. కొద్ది నెలల క్రితం ఉద్యోగం వచ్చింది. ట్రెయినింగ్ పూర్తయింది. ఆ తర్వాత కరోనా, లాక్ డౌన్ వచ్చింది. దీంతో ఆమెను తిప్పి పంపించారు. ప్రాజెక్టులు లేవని, కాబట్టి హాఫ్ శాలరీ కూడా ఇవ్వలేమని చెప్పారు. జీతం పోయినప్పటికీ జీవితం పోయినట్లు కాదని భావించిన ఆమె కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతున్నారు.

ఇంజినీరింగ్ చదివి, సాఫ్టువేర్ ఇంజినీర్ ఉద్యోగం చేయడానికి బదులు కూరగాయలు అమ్ముతున్నందుకు తనకు ఏమాత్రం బాధ లేదని, తన తల్లిదండ్రులకు అండగా ఉండేందుకు, తన జీవనం కోసం చేస్తున్నానని, ఉద్యోగం పోయినందుకు సాధారణంగా కాస్త బాధ ఉండటం సహజమేనని, కానీ నేను ఏ విధంగానైనా బతకగలనని, ఈ జీవనం సాగిస్తున్నందుకు బాధ మాత్రం లేదని తెలిపారు. ఉద్యోగం ఉంటేనే బతుకుతానని, ఇది చేస్తే నామోషి అనే ఆలోచన తనకు లేదన్నారు. తాను ఉద్యోగం వదిలివేయలేదని, పరిస్థితులు అలా వచ్చాయన్నారు. సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిన మూడు నెలలకే ఆ జాబ్ పోయిందన్నారు. అంతకుముందు రెండున్నరేళ్లు ఢిల్లీలోని పర్ఫార్మెన్స్ అనలిస్ట్‌గా చేసి వచ్చానని చెప్పారు.

ఉద్యోగం ఉంటేనే.. జీతం వస్తేనే లైఫ్ కాదని, కాస్త పాజిటివ్‌గా ఆలోచించాలని, దేవుడు మనకు చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని చెప్పారు. బతకాలనుకుంటే కూరగాయలు అమ్మి, పూలు అమ్మి.. ఇలా ఏం చేసైనా బతకవచ్చునన్నారు. లగ్జరీగా బతికితేనే లైఫ్ కాదన్నారు. ఇలా అమ్ముతున్నందుకు తాను ఏమాత్రం బాధపడటం లేదని, టైమ్ బ్యాడ్, దానికి ఎవరు ఏం చేస్తారన్నారు.

ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న శారద కథ ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. దీనిపై వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్పందించారు. శారద యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచారని, ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. శారద కథనాలపై ఉపరాష్ట్రపతి కార్యాలయం, వివిధ పార్టీల నాయకులు, ఎన్నారైలు స్పందించారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు కొన్ని ఐటీ సంస్థలు కూడా ముందుకు వచ్చాయి.

This post was last modified on July 27, 2020 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

3 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

4 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

5 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

6 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

7 hours ago