Trends

లాక్‌డౌన్‌తో ఇండియ‌న్స్‌కు 5 వేల కోట్లు మిగిలాయి

ఇండియాలో లాక్ డౌన్ పెట్ట‌డం వ‌ల్ల అన్ని వేల కోట్ల ఆదాయం పోయింది.. ఇన్ని ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది.. ఆ రంగం నాశ‌న‌మైంది. ఈ రంగం దెబ్బ తింది.. ఇలాంటి వార్త‌లే వింటున్నాం కొన్ని నెల‌లుగా. కానీ లాక్ డౌన్ వ‌ల్ల లాభం కూడా జ‌రిగింది.. దీని వ‌ల్ల‌ భార‌తీయులు 5 వేల కోట్ల‌కు పైగా ఆదాయం మిగుల్చుకున్నారు అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కానీ ఇది నిజం. ఈ విష‌యం బ్రిటన్‌లోని సరెక్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల అధ్య‌య‌నంలో తేల‌డం విశేషం.

లాక్ డౌన్ ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని, అకాల మరణాలను నిరోధించి వైద్య ఖర్చుల రూపంలో దాదాపు రూ. 5169 కోట్లు దేశానికి ఆదా చేసిందని వారు లెక్క కట్టారు. లాక్ డౌన్ కారణంగా దేశ‌వ్యాప్తంగా కాలుష్యం ఎంత‌గానో త‌గ్గింద‌ని.. ఢిల్లీ, ముంబ‌యి, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై స‌హా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో కాలుష్య శాతం త‌గ్గి ప్ర‌జారోగ్యం మెరుగుప‌డింద‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

గాల్లోని పీఎమ్ 2.5 అనే ధూళి కణాల సంఖ్య ఢిల్లీలో 54 శాతం, ముంబైలో 10 శాతం మేర అదుపులోకి వ‌చ్చింద‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది. ఇతర నగరాల్లో 24 నుంచి 34 శాతం మేర పీఎమ్ 2.5 స్థాయిలో కోత పడింద‌ని కూడా ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. మార్చి 25 నుంచి మే 11 వరకూ వివిధ నగరాల్లోని కాలుష్య కారకాల స్థాయిని గత ఐదేళ్లలోని పరిస్థితుల‌తో పోల్చిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.

వాయుకాలుష్యం తగ్గడంతో అకాల మరణాల సంఖ్య తగ్గి దేశానికి రూ.5 వేల కోట్లకు పైగా వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ ర‌కంగా ప్ర‌జ‌ల‌కు డ‌బ్బు మిగ‌ల‌డంతో పాటు ఆరోగ్యాలు మెరుగుప‌డ్డాయ‌ని.. ఇది లాక్ డౌన్ వ‌ల్ల జ‌రిగిన మేల‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

This post was last modified on July 19, 2020 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

10 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

2 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago