ఇండియాలో లాక్ డౌన్ పెట్టడం వల్ల అన్ని వేల కోట్ల ఆదాయం పోయింది.. ఇన్ని లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.. ఆ రంగం నాశనమైంది. ఈ రంగం దెబ్బ తింది.. ఇలాంటి వార్తలే వింటున్నాం కొన్ని నెలలుగా. కానీ లాక్ డౌన్ వల్ల లాభం కూడా జరిగింది.. దీని వల్ల భారతీయులు 5 వేల కోట్లకు పైగా ఆదాయం మిగుల్చుకున్నారు అంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. ఈ విషయం బ్రిటన్లోని సరెక్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలడం విశేషం.
లాక్ డౌన్ ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని, అకాల మరణాలను నిరోధించి వైద్య ఖర్చుల రూపంలో దాదాపు రూ. 5169 కోట్లు దేశానికి ఆదా చేసిందని వారు లెక్క కట్టారు. లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం ఎంతగానో తగ్గిందని.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై సహా అన్ని ప్రధాన నగరాల్లో కాలుష్య శాతం తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడిందని ఈ అధ్యయనం వెల్లడించింది.
గాల్లోని పీఎమ్ 2.5 అనే ధూళి కణాల సంఖ్య ఢిల్లీలో 54 శాతం, ముంబైలో 10 శాతం మేర అదుపులోకి వచ్చిందని ఈ అధ్యయనంలో తేలింది. ఇతర నగరాల్లో 24 నుంచి 34 శాతం మేర పీఎమ్ 2.5 స్థాయిలో కోత పడిందని కూడా ఈ అధ్యయనం వెల్లడించింది. మార్చి 25 నుంచి మే 11 వరకూ వివిధ నగరాల్లోని కాలుష్య కారకాల స్థాయిని గత ఐదేళ్లలోని పరిస్థితులతో పోల్చిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.
వాయుకాలుష్యం తగ్గడంతో అకాల మరణాల సంఖ్య తగ్గి దేశానికి రూ.5 వేల కోట్లకు పైగా వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రకంగా ప్రజలకు డబ్బు మిగలడంతో పాటు ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని.. ఇది లాక్ డౌన్ వల్ల జరిగిన మేలని అధ్యయనం వెల్లడించింది.
This post was last modified on July 19, 2020 11:33 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…