Trends

లాక్‌డౌన్‌తో ఇండియ‌న్స్‌కు 5 వేల కోట్లు మిగిలాయి

ఇండియాలో లాక్ డౌన్ పెట్ట‌డం వ‌ల్ల అన్ని వేల కోట్ల ఆదాయం పోయింది.. ఇన్ని ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్లింది.. ఆ రంగం నాశ‌న‌మైంది. ఈ రంగం దెబ్బ తింది.. ఇలాంటి వార్త‌లే వింటున్నాం కొన్ని నెల‌లుగా. కానీ లాక్ డౌన్ వ‌ల్ల లాభం కూడా జ‌రిగింది.. దీని వ‌ల్ల‌ భార‌తీయులు 5 వేల కోట్ల‌కు పైగా ఆదాయం మిగుల్చుకున్నారు అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కానీ ఇది నిజం. ఈ విష‌యం బ్రిటన్‌లోని సరెక్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల అధ్య‌య‌నంలో తేల‌డం విశేషం.

లాక్ డౌన్ ప్రజారోగ్యంపై సానుకూల ప్రభావం చూపిందని, అకాల మరణాలను నిరోధించి వైద్య ఖర్చుల రూపంలో దాదాపు రూ. 5169 కోట్లు దేశానికి ఆదా చేసిందని వారు లెక్క కట్టారు. లాక్ డౌన్ కారణంగా దేశ‌వ్యాప్తంగా కాలుష్యం ఎంత‌గానో త‌గ్గింద‌ని.. ఢిల్లీ, ముంబ‌యి, బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై స‌హా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో కాలుష్య శాతం త‌గ్గి ప్ర‌జారోగ్యం మెరుగుప‌డింద‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

గాల్లోని పీఎమ్ 2.5 అనే ధూళి కణాల సంఖ్య ఢిల్లీలో 54 శాతం, ముంబైలో 10 శాతం మేర అదుపులోకి వ‌చ్చింద‌ని ఈ అధ్య‌య‌నంలో తేలింది. ఇతర నగరాల్లో 24 నుంచి 34 శాతం మేర పీఎమ్ 2.5 స్థాయిలో కోత పడింద‌ని కూడా ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. మార్చి 25 నుంచి మే 11 వరకూ వివిధ నగరాల్లోని కాలుష్య కారకాల స్థాయిని గత ఐదేళ్లలోని పరిస్థితుల‌తో పోల్చిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు.

వాయుకాలుష్యం తగ్గడంతో అకాల మరణాల సంఖ్య తగ్గి దేశానికి రూ.5 వేల కోట్లకు పైగా వైద్య ఖర్చులు ఆదా అయ్యాయని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. ఈ ర‌కంగా ప్ర‌జ‌ల‌కు డ‌బ్బు మిగ‌ల‌డంతో పాటు ఆరోగ్యాలు మెరుగుప‌డ్డాయ‌ని.. ఇది లాక్ డౌన్ వ‌ల్ల జ‌రిగిన మేల‌ని అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

This post was last modified on July 19, 2020 11:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago