ప్రేమించిన యువతి ఇంటి పై దాడి చేసి ఎత్తుకెళ్లి పొయాడు

రంగారెడ్డి జిల్లాలోని తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో రాగ‌న్న‌గూడలో ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఒక డెంటిస్ట్ యువతి కిడ్నాప్ సంజనాత్మకంగా మారిన విషయం తెలిసిందే. సినీఫక్కీలో నవీన్ అనే యువకుడు ఏకంగా వందమంది యువకులంతో తను ప్రేమించిన యువతి ఇంటిపై దాడి చేసి ఆమెను ఎత్తుకెళ్లిన ఘటన అందర్నీ సంప్రమాశ్చర్యాలకు గురిచేసింది. అయితే ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకొని యువతిని రక్షించడం జరిగింది.

గత కొన్నాళ్లుగా టీ టైమ్ వ్యవస్థాపకుడు నవీన్ ప్రేమ పేరుతో ఒక యువతని వేధిస్తున్నాడు. ఈ విషయమై ఆమె గతంలో షీ టీంకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే మధ్యవర్తులతో పెళ్లికి నవీన్ సంప్రదింపులు జరగా ఆ యువత తల్లిదండ్రులు సంబంధానికి ససేమిరా అన్నారు. ఈరోజు ఆ యువతికి పెళ్లిచూపులు జరగవలసి ఉంది. ఈ విషయం తెలుసుకున్న నవీన్ దౌర్జన్యంగా దాదాపు 100 మందితో అమ్మాయి ఇంటిలోకి చొరబడి వస్తువును ద్వంసం చేసి అడ్డుకున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులపై శారీరకంగా దాడి చేసి మరీ ఆ యువతీని తనతో బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇక యువతి ఆచూకీ పోవడంతో ఆ కుటుంబం మొత్తం రోడ్డుపై ధర్నాకు దిగారు.

ఎంతో సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి ఇబ్ర‌హీంప‌ట్నం ఏసీపీ ఉమామ‌హేశ్వ‌ర్ రావు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు. పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీని కొద్ది గంటల్లోనే కనిపెట్టడం జరిగింది. ఇక కిడ్నాపర్ తో పాటు దొరికిన అతని బృందాన్ని అరెస్టు చేసిన పోలీసులు యువతని క్షేమంగా ఆమె ఇంటిలో కుటుంబ సభ్యుల వద్ద వదిలిపెట్టారు. మరి ఇంతటి ఉన్మాదానికి పాల్పడిన ఆ యువకుడు పై కేసు నమోదు చేయగా అతనికి ఎటువంటి శిక్ష పడుతుంది అన్న విషయం వేచి చూడాలి.