హైదరాబాద్లో సరైన అద్దె ఇల్లు సంపాదించడం తేలిక కాదు. ఇల్లు చూసుకున్నా.. ఏటా అద్దెలు పెంచుతూ పోతుంటారు. ఇక్కడ ఎప్పుడూ ఉండే తతంగమే ఇది. అద్దె ఇళ్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది తప్ప తగ్గట్లేదు. టు లెట్ బోర్డు పెట్టడం ఆలస్యం.. వెంటనే ఆరాలు మొదలవుతాయి. ఇల్లు ఫిల్ అయిపోతుంది.
కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఈ నగరంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుండటం.. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో జనాలు భయపడి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. వలస కార్మికులే కాదు.. మిగతా వాళ్లు కూడా హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు.
ఐతే లాక్ డౌన్ దెబ్బకు అందరి ఆదాయాలూ దెబ్బ తిన్నాయి. ఉపాధి పోయింది. దీంతో సామాను ఇక్కడే పెట్టి భారీగా అద్దె కట్టే పరిస్థితి కూడా లేదు. అలాగని సామానంతా తీసుకుని సొంతూర్లకూ వెళ్లలేరు. అదంత తేలికైన విషయం కాదు. తిరిగి సామానంతా ఇక్కడికి తెచ్చుకోవడమూ కష్టమే.
ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్లందరూ సామాను పెట్టుకోవడం కోసమే వెలసిన గోడౌన్లను ఆశ్రయిస్తున్నారు. ఇంటి సామాను పెట్టి నెలకు ఇంత అని తక్కువ మొత్తంలో అద్దె వసూలు చేసే గోడౌన్లు ఇటీవల చాలా తయారయ్యాయి.
వివిధ వ్యాపారాల కోసం ఉపయోగించే గోడౌన్లు చాలానే ఈ మధ్య ఖాళీ అయిపోయాయి. వాటిని ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థలు టేకోవర్ చేస్తున్నాయి. ఇంటి అద్దెతో పోలిస్తే తక్కువ మొత్తంతో ఇక్కడ సామాను పెట్టుకుని లాక్ చేసుకునే సౌలభ్యం కనిపిస్తుండటంతో జనాలు వాటిని ఆశ్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లో టు లెట్ బోర్డులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అద్దెలు తగ్గిస్తున్నా సరే.. జనాలు అద్దె ఇళ్లలోకి రాకపోతుండటంతో యజమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.
This post was last modified on July 15, 2020 4:16 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…