Trends

చిత్రం భళారే విచిత్రం.. కవలకు ప్రతి సబ్జెక్టులో ఒకే మార్కులు

‘హలో బ్రదర్’ సినిమాలో కవల సోదరులు ఇద్దరూ ఒకేలా ఉండటం.. ఒకరు చేసినట్లే ఇంకొకరు చేయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. నిజంగా ట్విన్స్ ఇద్దరు నిజ జీవితంలో ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఆసక్తి కలుగుతుంది.

ఐతే నోయిడాకు చెందిన ఇద్దరు కవల అమ్మాయిల విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు చూసి అందరూ షాకవుతున్నారిప్పుడు. ఇద్దరికీ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు రావడం విశేషం.

ఆ ఇద్దరూ 9 నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు. వాళ్ల పేర్లు మాన్సి, మాన్య. చూడ్డానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లిద్దరిలో మాన్సి ఎవరో, మాన్య ఎవరో తెలియక తికమక పడేంతగా ఇద్దరిలో పోలికలుంటాయి. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.

చదువులో ఇద్దరూ చురుకే. గత వార్షిక సంవత్సరంలో వీళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా.. ఇద్దరికీ సరిగ్గా 95.8 శాతం మార్కులు సాధించడం ఇప్పుడందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మొత్తం మార్కులే కాదు.. ప్రతి సబ్జెక్టులోనూ ఆ ఇద్దరూ ఒకే మార్కులు సాధించడం విస్మయానికి గురి చేస్తోంది. కవల సోదరీమణులు మరీ ఇంత ఐడెంటికల్‌గా మార్కులు ఎలా తెచ్చుకున్నారో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతున్నారు.

This post was last modified on July 15, 2020 4:14 pm

Share
Show comments
Published by
Satya
Tags: Viral News

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

1 hour ago

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…

1 hour ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

2 hours ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

5 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

7 hours ago