‘హలో బ్రదర్’ సినిమాలో కవల సోదరులు ఇద్దరూ ఒకేలా ఉండటం.. ఒకరు చేసినట్లే ఇంకొకరు చేయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. నిజంగా ట్విన్స్ ఇద్దరు నిజ జీవితంలో ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఆసక్తి కలుగుతుంది.
ఐతే నోయిడాకు చెందిన ఇద్దరు కవల అమ్మాయిల విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు చూసి అందరూ షాకవుతున్నారిప్పుడు. ఇద్దరికీ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు రావడం విశేషం.
ఆ ఇద్దరూ 9 నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు. వాళ్ల పేర్లు మాన్సి, మాన్య. చూడ్డానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లిద్దరిలో మాన్సి ఎవరో, మాన్య ఎవరో తెలియక తికమక పడేంతగా ఇద్దరిలో పోలికలుంటాయి. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.
చదువులో ఇద్దరూ చురుకే. గత వార్షిక సంవత్సరంలో వీళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా.. ఇద్దరికీ సరిగ్గా 95.8 శాతం మార్కులు సాధించడం ఇప్పుడందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మొత్తం మార్కులే కాదు.. ప్రతి సబ్జెక్టులోనూ ఆ ఇద్దరూ ఒకే మార్కులు సాధించడం విస్మయానికి గురి చేస్తోంది. కవల సోదరీమణులు మరీ ఇంత ఐడెంటికల్గా మార్కులు ఎలా తెచ్చుకున్నారో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on July 15, 2020 4:14 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…