‘హలో బ్రదర్’ సినిమాలో కవల సోదరులు ఇద్దరూ ఒకేలా ఉండటం.. ఒకరు చేసినట్లే ఇంకొకరు చేయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. నిజంగా ట్విన్స్ ఇద్దరు నిజ జీవితంలో ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఆసక్తి కలుగుతుంది.
ఐతే నోయిడాకు చెందిన ఇద్దరు కవల అమ్మాయిల విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు చూసి అందరూ షాకవుతున్నారిప్పుడు. ఇద్దరికీ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు రావడం విశేషం.
ఆ ఇద్దరూ 9 నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు. వాళ్ల పేర్లు మాన్సి, మాన్య. చూడ్డానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లిద్దరిలో మాన్సి ఎవరో, మాన్య ఎవరో తెలియక తికమక పడేంతగా ఇద్దరిలో పోలికలుంటాయి. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.
చదువులో ఇద్దరూ చురుకే. గత వార్షిక సంవత్సరంలో వీళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా.. ఇద్దరికీ సరిగ్గా 95.8 శాతం మార్కులు సాధించడం ఇప్పుడందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మొత్తం మార్కులే కాదు.. ప్రతి సబ్జెక్టులోనూ ఆ ఇద్దరూ ఒకే మార్కులు సాధించడం విస్మయానికి గురి చేస్తోంది. కవల సోదరీమణులు మరీ ఇంత ఐడెంటికల్గా మార్కులు ఎలా తెచ్చుకున్నారో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on July 15, 2020 4:14 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…
ఢిల్లీ మద్యం కేసులో తనను నిరపరాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కవిత కృతజ్ఞతలు…