‘హలో బ్రదర్’ సినిమాలో కవల సోదరులు ఇద్దరూ ఒకేలా ఉండటం.. ఒకరు చేసినట్లే ఇంకొకరు చేయడం భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. నిజంగా ట్విన్స్ ఇద్దరు నిజ జీవితంలో ఇలా ఉంటే ఎలా ఉంటుందన్న ఆసక్తి కలుగుతుంది.
ఐతే నోయిడాకు చెందిన ఇద్దరు కవల అమ్మాయిల విషయంలో ఇలాంటి చిత్రమే చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు చూసి అందరూ షాకవుతున్నారిప్పుడు. ఇద్దరికీ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు రావడం విశేషం.
ఆ ఇద్దరూ 9 నిమిషాల వ్యవధిలో పుట్టిన కవలలు. వాళ్ల పేర్లు మాన్సి, మాన్య. చూడ్డానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లిద్దరిలో మాన్సి ఎవరో, మాన్య ఎవరో తెలియక తికమక పడేంతగా ఇద్దరిలో పోలికలుంటాయి. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు.
చదువులో ఇద్దరూ చురుకే. గత వార్షిక సంవత్సరంలో వీళ్లిద్దరూ సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాయగా.. ఇద్దరికీ సరిగ్గా 95.8 శాతం మార్కులు సాధించడం ఇప్పుడందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మొత్తం మార్కులే కాదు.. ప్రతి సబ్జెక్టులోనూ ఆ ఇద్దరూ ఒకే మార్కులు సాధించడం విస్మయానికి గురి చేస్తోంది. కవల సోదరీమణులు మరీ ఇంత ఐడెంటికల్గా మార్కులు ఎలా తెచ్చుకున్నారో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతున్నారు.
This post was last modified on July 15, 2020 4:14 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…