వివాహితపై అత్యాచారం చేసి వీడియో తీశాడు ఓ వ్యక్తి. అనంతరం ఈ వీడియోను భర్తకు పంపించగా.. మనస్తాపానికి గురైన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర జల్నా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఓ మహిళపై ఒక పెట్టుబడి దారుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అంతా ఫోన్లో రికార్డు చేశాడు. తర్వాత దానిని ఆమె భర్తకు పంపించాడు. దీనిని చూసిన భర్త.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహిత తన భర్తతో కలిసి జల్నా జిల్లాలోని పింపల్గామ్ అనే గ్రామంలో నివసిస్తోంది. ఆమె భర్త చిరు వ్యాపారి. ఈ క్రమంలో ఇంటి వద్ద ఉండే ఆమెకు చుట్టు పక్కల ఉండే కొంత మంది మహిళలు పరిచయం అయ్యారు. ఈ క్రమంలో ఓ రోజు వ్యాపారానికి పెట్టుబడి పెట్టేందుకు రవి దత్తాత్రేయ అనే వ్యక్తి రెడీగా ఉన్నారని, నువ్వు మాట్లాడితే ఆయన డబ్బులు ఇస్తాడని, మీ వ్యాపారం బాగుంటుందని సలహా ఇచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వివాహిత.. ఈ మహిళలు చెప్పినట్టుగానే రవి దత్తాత్రేయ అనే వ్యక్తికి ఫోన్ చేసింది. ఈ క్రమంలో ఆయన ఓ ఇద్దరు అనుచరులను తీసుకుని ఆమె ఇంటికి వచ్చాడు. అనంతరం.. రవి దత్తాత్రేయ వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దాన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాధితురాలితో మాట్లాడిన అసభ్యకర ఫోన్ సంభాషణ రికార్డింగులను, వీడియోలను ఆమె భర్తకు పంపించాడు.
దీంతో మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో తన పరువు పోతుందని విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎవరిని బడితే వారిని నమ్మవద్దని పోలీసులు ప్రకటించడం కొసమెరుపు. కాగా, ఈ దంపతులకు పెళ్లై రెండు సంవత్సరాలే కావడం గమనార్హం.
This post was last modified on November 22, 2022 11:27 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…