కొన్ని సినిమాలు అలవోకగా అద్భుతమైన టాక్ తెచ్చుకుని మాంచి క్లాసిక్స్గా నిలిచిపోతాయ్. కాని కొన్ని సినిమాలకు టాక్ ఎలా ఉన్నా కూడా కలక్షన్లు వచ్చేస్తాయ్. ఈ రెండింటికీ మధ్యలో నిలిచింది స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ మూవీ ‘యశోద’. ఈ సినిమాతో సమంత ప్యాన్ ఇండియా హిట్ కొట్టేద్దాం అనుకుంది కాని, ఆ కోరికైతే నెరవేరలేదు. కాని మన హీరోయన్ మాత్రం కప్ నాదే అంటోంది. ఆ ఫీలింగ్లో నిజాయితీ కూడా ఉందిలే.
రిలీజైన రెండు వారాలకు గాను సమంత ‘యశోద’ సినిమా అన్ని బాషల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ₹33 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టింది. అంటే నిర్మాతలకు దాదాపు ₹18 కోట్ల షేర్ వస్తోందన్నమాట. ఆ లెక్కన అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయినట్లే. అయితే ఈ హిట్టుతో సమంత స్టాటస్ అండ్ స్టార్డమ్ ఏ రేంజులో ఉందనేది చూస్తేనే.. సమంత 33 నాటౌట్ స్కోరుతో మ్యాచ్ కొట్టిందా లేదా అనే విషయం చెప్పడం సాధ్యమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఒక సోలో హీరోయిన్ సినిమా, అది కూడా ఏమాత్రం గ్లామర్ టచ్ కాని, ఎడల్ట్ కామెడీ కాని లేని సినిమా.. అసలు ఇంతవరకు రావడమే కష్టంగా ఉన్న రోజుల్లో.. సమంత సింగిల్ హ్యాండ్తో సినిమాను 33 కోట్ల గ్రాస్ కు తెచ్చేసిందంటే.. అది పెద్ద విషయమే. కంటెంట్ పవర్ ఎంతున్నా కూడా, తన స్టార్ పవర్ మాత్రం విపరీతంగా ఉందని ప్రూవ్ చేసింది.
అసలు సమంత ఏ మాత్రం ప్రమోట్ చేయకుండా.. కేవలం ఒక్క ఇంటర్యూ మరియు ఇనస్టాగ్రామ్ స్టోరీస్తో.. ఆ కంటెంట్ను ఇక్కడవరకు లాక్కొచ్చిందంటే పెద్ద విషయమే. ఒకవేళ ఇదే యశోదను సమంత ఊరూరా తిరిగి ప్రమోట్ చేసుంటే మాత్రం.. ఈ సినిమా బాక్సాఫీస్ కలక్షన్ల రేంజ్ ఇంకొంచెం ఎక్కువగానే ఉండేది. కాబట్టి.. 33 నాటౌ స్కోర్ తో సమంత మ్యాచ్ను గెలిపించి కప్ కొట్టిందనే చెప్పాలి.
This post was last modified on November 22, 2022 9:16 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…