Trends

ఆ ట్యాబ్లెట్ల కోసం ఏపీలో అంతలా ఎగబడుతున్నారట

ఏ పుట్టలో ఏ పాము ఉందన్న రీతిలో.. మాయదారి కరోనాను అడ్డుకునేందుకు.. తమ వరకు రాకుండా ఉండాలన్న తలంపు ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కేసుల తీవ్రత ప్రజల్ని హడలెత్తిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల ప్రజల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.

గడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మాత్రం ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు కాస్త తగ్గిన పరిస్థితి. కరోనా సోకకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై సోషల్ మీడియాతో పాటు.. వాట్సాప్ మెసేజ్ లలో వస్తున్న పోస్టులకు ప్రభావితమవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.

కరోనా సోకకుండా ఉండేందుకు విటమిన్ ట్యాబ్లెట్లు.. బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడితే మంచిదన్న అభిప్రాయం పెరుగుతోంది. దీంతో.. విటమిన్ డీ3 మాత్రల్ని విపరీతంగా కొంటున్నారు. దీంతో పాటు బీ కాంప్లెక్స్ మాత్రలతో పాటు.. సీ విటమిన్ మాత్రల్ని వాడుతున్నారు. దీంతో.. వీటి డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో ఒకట్రెండు రకాల ట్యాబ్లెట్లు తప్పించి.. మిగిలిన మాత్రలు దొరుకుతున్నాయి.

ఏపీలో మాత్రం అందుకుభిన్నంగా విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం పాతిక వేల మెడికల్ షాపులు ఉంటే.. అందులో 70 శాతం షాపుల్లో విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న డిమాండ్ అసరా చేసుకొని.. ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారు లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. విటమిన్ ట్యాబ్లెట్ల వినియోగంతో పెద్దగా ప్రయోజనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. ట్యాబ్లెట్ల కంటే కూడా సహజసిద్ధంగా వచ్చే విటమిటన్లే శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. పండ్లు.. ఆకుకూరలతో అన్ని రకాల విటమిటన్లు లభిస్తాయని చెబుతున్నారు. అందరి మాదిరి విటమిన్ ట్యాబ్లెట్ల కోసం ఎగబడే కన్నా.. మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకొని తీసుకోవటం మంచిదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

This post was last modified on July 14, 2020 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

43 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago