Trends

ఆ ట్యాబ్లెట్ల కోసం ఏపీలో అంతలా ఎగబడుతున్నారట

ఏ పుట్టలో ఏ పాము ఉందన్న రీతిలో.. మాయదారి కరోనాను అడ్డుకునేందుకు.. తమ వరకు రాకుండా ఉండాలన్న తలంపు ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ అవుతోంది. దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న కేసుల తీవ్రత ప్రజల్ని హడలెత్తిస్తోంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారు. రెండు తెలుగురాష్ట్రాల ప్రజల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు.

గడిచిన కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో మాత్రం ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు కాస్త తగ్గిన పరిస్థితి. కరోనా సోకకుండా ఉండేందుకు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై సోషల్ మీడియాతో పాటు.. వాట్సాప్ మెసేజ్ లలో వస్తున్న పోస్టులకు ప్రభావితమవుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.

కరోనా సోకకుండా ఉండేందుకు విటమిన్ ట్యాబ్లెట్లు.. బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వాడితే మంచిదన్న అభిప్రాయం పెరుగుతోంది. దీంతో.. విటమిన్ డీ3 మాత్రల్ని విపరీతంగా కొంటున్నారు. దీంతో పాటు బీ కాంప్లెక్స్ మాత్రలతో పాటు.. సీ విటమిన్ మాత్రల్ని వాడుతున్నారు. దీంతో.. వీటి డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణలో ఒకట్రెండు రకాల ట్యాబ్లెట్లు తప్పించి.. మిగిలిన మాత్రలు దొరుకుతున్నాయి.

ఏపీలో మాత్రం అందుకుభిన్నంగా విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం పాతిక వేల మెడికల్ షాపులు ఉంటే.. అందులో 70 శాతం షాపుల్లో విటమిన్ ట్యాబ్లెట్ల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న డిమాండ్ అసరా చేసుకొని.. ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారు లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. విటమిన్ ట్యాబ్లెట్ల వినియోగంతో పెద్దగా ప్రయోజనం ఉండదని పలువురు వైద్యులు చెబుతున్నారు. ట్యాబ్లెట్ల కంటే కూడా సహజసిద్ధంగా వచ్చే విటమిటన్లే శరీరానికి మంచిదని చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. పండ్లు.. ఆకుకూరలతో అన్ని రకాల విటమిటన్లు లభిస్తాయని చెబుతున్నారు. అందరి మాదిరి విటమిన్ ట్యాబ్లెట్ల కోసం ఎగబడే కన్నా.. మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకొని తీసుకోవటం మంచిదన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.

This post was last modified on July 14, 2020 12:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

6 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

1 hour ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

2 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

2 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago

మద్యం కేసులో క్లీన్ చిట్.. స్పీడు పెంచనున్న కవిత

ఢిల్లీ మ‌ద్యం కేసులో త‌న‌ను నిర‌ప‌రాధిగా పేర్కొన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు.. క‌విత కృత‌జ్ఞ‌త‌లు…

4 hours ago