కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతలా విలవిలలాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఏపీలో పాత పద్దతుల్ని కొనసాగిస్తుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని తెర మీదకు తెస్తున్నారు. ఏపీలో పాజిటివ్ అయిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా రోగ లక్షణాలు తక్కువగానూ.. స్వల్పంగా ఉన్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. హోం ఐసోలేషన్ లోనే ఉండేలా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐసోలేషన్ లో ఉన్న పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి సాయంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ కొవిడ్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు ఛాతీ నొప్పితో బాధ పడుతుంటే.. అలాంటి వారంతా వెంటనే 18005994455 నెంబరుకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
టోల్ ఫ్రీనెంబరుకు ఫోన్ చేస్తే.. బాధితుల అవసరానికి తగ్గట్లు వారి ఇళ్లకు 108 అంబులెన్స్ లను పంపి.. మెరుగైన వైద్యం చేస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో పదివేలకు పైగా పాజిటివ్ రోగులు ఇళ్లలోనే ఉన్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. సూచనల్నినిత్యం అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12680 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వారిలో ఎలాంటి లక్షణాలు లేని వారు.. సూక్ష్మ లక్షణాలు ఉన్న వారు 10518 మంది ఉంటే.. మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు 1701గా ఉన్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారు 461గా చెబుతున్నారు. రోగ లక్షణాలు కనిపించని.. సూక్ష్మంగా ఉన్న వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులోకి తెచ్చారు. సో.. ఈ నెంబరు చాలా కీలకమైనది. ఎప్పుడు అవసరమవుతుందో తెలీదు. అందుకే.. వెంటనే ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on July 11, 2020 11:06 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…