కరోనా దెబ్బకు రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతలా విలవిలలాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అంతకంతకూ పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఏపీలో పాత పద్దతుల్ని కొనసాగిస్తుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఎప్పటికప్పుడు కొత్త విధానాల్ని తెర మీదకు తెస్తున్నారు. ఏపీలో పాజిటివ్ అయిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా రోగ లక్షణాలు తక్కువగానూ.. స్వల్పంగా ఉన్న వారిని ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. హోం ఐసోలేషన్ లోనే ఉండేలా చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఐసోలేషన్ లో ఉన్న పలువురు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్ లో ఉన్న వారికి సాయంగా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ కొవిడ్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్యలతో పాటు ఛాతీ నొప్పితో బాధ పడుతుంటే.. అలాంటి వారంతా వెంటనే 18005994455 నెంబరుకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
టోల్ ఫ్రీనెంబరుకు ఫోన్ చేస్తే.. బాధితుల అవసరానికి తగ్గట్లు వారి ఇళ్లకు 108 అంబులెన్స్ లను పంపి.. మెరుగైన వైద్యం చేస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో పదివేలకు పైగా పాజిటివ్ రోగులు ఇళ్లలోనే ఉన్నారు. వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు.. సూచనల్నినిత్యం అందిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 12680 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వారిలో ఎలాంటి లక్షణాలు లేని వారు.. సూక్ష్మ లక్షణాలు ఉన్న వారు 10518 మంది ఉంటే.. మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు 1701గా ఉన్నారు. తీవ్ర లక్షణాలు ఉన్న వారు 461గా చెబుతున్నారు. రోగ లక్షణాలు కనిపించని.. సూక్ష్మంగా ఉన్న వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టోల్ ఫ్రీ నెంబరును అందుబాటులోకి తెచ్చారు. సో.. ఈ నెంబరు చాలా కీలకమైనది. ఎప్పుడు అవసరమవుతుందో తెలీదు. అందుకే.. వెంటనే ఫోన్ లో సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This post was last modified on July 11, 2020 11:06 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…