లాక్ డౌన్ వేళ అన్ని కార్యకలాపాలూ ఆగిపోెయాయి. దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా మూతపడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఉండే దేవాలయం అయిన తిరుమల కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలలల పాటు మూతపడింది. చివరికి గత నెలలో ఆ ఆలయాన్ని తెరిచారు. అనేక జాగ్రత్తల మధ్య భక్తులకు దర్శన భాగ్యం కనిపిస్తున్నారు.
కొందరు భక్తులు ధైర్యం చేసి తిరుమలకు వెళ్తుంటే.. చాలామంది భయంతో ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. దర్శనాలకు అనుమతి ఉన్నా సరే.. పెద్దగా రద్దీ లేకుండా కనిపిస్తోంది తిరుమల. ఐతే ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా సరే.. తిరుమలలోనూ కరోనా విజృంభిస్తోంది. గత వారం రోజుల వ్యవధిలో అక్కడ 17 కేసులు బయటపడటం వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది.
కొన్ని రోజుల కిందటే తిరుమలలో తొలిసారి కరోనా కేసు బయటపడింది. దీంతో సిబ్బందికి పరీక్షలు చేస్తూ వెళ్లగా మొత్తం 17 మంది వైరస్ బాధితులుగా తేలారు. దీంతో మొత్తం సిబ్బంది అందరికీ పరీక్షలు జరిపించాలని నిర్ణయించారు. రోజుకు వంద మంది చొప్పున స్వాబ్ పరీక్షలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. మరి ఈ కరోనా బారిన పడ్డ సిబ్బంది నుంచి భక్తులు ఎంతమందికి కరోనా సోకిందన్నది ప్రశ్న.
భక్తులు ఎడం పాటిస్తూ దర్శనాలకు వెళ్లాలని షరతులు విధించినప్పటికీ.. క్యూ లైన్లలో అంత క్రమశిక్షణ పాటించడం కష్టమే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేవుడి మీద భారం వేసి శ్రీవారి దర్శనానికి వెళ్లడం మంచిది కాదనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ఇంకో రెండు నెలల పాటు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లడం, ప్రయాణాలు చేయడం, దైవ దర్శనాలకు వెళ్లడం ఆపితేనే మంచిదని హెచ్చరిస్తున్నారు.
This post was last modified on July 5, 2020 6:45 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…