ఇండియాలో ఫెయిర్నెస్ క్రీమ్ ప్రకటనల గురించి తరచుగా వివాదాలు, చర్చలు నడుస్తుంటాయి. తెల్లగా ఉంటేనే అందంగా ఉన్న భావన కలిగించే ఈ ప్రకటనల్ని, ఈ ఉత్పత్తుల్ని నిషేధించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. కంగనా రనౌత్ లాంటి కొందరు ఫిలిం స్టార్స్ ఇలాంటి యాడ్స్లో నటించకూడదని నియమం కూడా పెట్టుకున్నారు.
ఇలాంటి యాడ్స్ కూడా వర్ణ వివక్షలో భాగమే అన్నది చాలామంది అభిప్రాయం. ఐతే ఎవరేమన్నా ఇండియాలో ఫెయిర్నెస్ క్రీమ్ బిజినెస్ ఓ రేంజిలో సాగుతూనే ఉంది. దీని మీద కంపెనీలు వందలు, వేల కోట్లు ఆర్జిస్తున్నాయి. ఐతే ఇంతకుముందు విమర్శల్ని తట్టుకుని బండి నడిపిస్తూ వచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితులు ముందులా లేవు. అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఉదంతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకే దారి తీసింది.
‘బ్లాక్ లైవ్స్ మేటర్’ పేరుతో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. వివిధ రంగాల్లో వర్ణ వివక్ష, జాత్యహంకారం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భారత నంబర్ వన్ ఫెయిర్నెస్ క్రీమ్ ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరును మార్చాలని హిందుస్థాన్ లీవర్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీని పేరుతో ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించాలని.. దాని స్థానంలో ‘గ్లో’ పెట్టాలని నిర్ణయించింది. అంటే.. ఇకపై ఈ క్రీమ్ను ‘గ్లో అండ్ లవ్లీ’ అని పిలవాలన్నమాట.
ఐతే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరుతో దశాబ్దాలుగా పాపులర్ అయిన క్రీమ్ పేరును ఇప్పుడు మార్చేస్తే కస్టమర్లు కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇదేదో కొత్త బ్రాండ్ అనుకునే ప్రమాదమూ ఉంది. దాని వల్ల సేల్స్ తగ్గొచ్చు కూడా. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పేరు మార్పు తప్పదని హిందుస్థాన్ లీవర్ భావించింది. త్వరలోనే కొత్త పేరుతో ఉత్పత్తులు బయటికి వస్తాయి.
This post was last modified on July 4, 2020 2:01 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…