Trends

మేకలకు కరోనా పరీక్షలు.. క్వారంటైన్‌కు తరలింపు

కరోనాకు మనుషుల్లో చిన్నా, పెద్దా.. రాజూ పేదా అనే తేడాి లేదని అనుకున్నాం. మనుషులు, జంతువులనే తేడా కూడా లేదని చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. కర్ణాటకలో తాజాగా గొర్రెలు, మేకలకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించడం విశేషం.

మనుషుల నుంచి పెంపుడు జంతువులకు కూడా కరోనా సో్కే అవకాశం ఉందని.. వాటి నుంచి కూడా మనుషులకు కరోనా సోకవచ్చని అధ్యయనాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో 50కి పైగా గొర్రెలు, మేకలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఉదంతం కర్నాటక రాష్ట్రంలోని తుమకూరు ప్రాంతంలో ఉన్న చిక్కనాయకహల్లిలో జరిగింది.

ఈ గ్రామంలోని అనేక గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు అధికారులకు విషయం చేరవేశారు. దీంతో అక్కడికి చేరుకున్న వైద్యాధికారులు మేకలు, గొర్రెలతోపాటు వాటి యజమానికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. గొర్రెల యజమానికి కరోనా ఉన్నట్లు నిర్ధరించారు. గొర్రెలు, మేకల పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ లోపు ఆ యజమానికి చెందిన 50 మేకలు, గొర్రెలను ఐసోలేషన్‌లో ఉంచారు.

వైద్యాధికారులు వెళ్లినపుడు కూడా గొర్రెలు, మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం గమనించారు. ఐతే కరోనా సోకడం వల్లే మేకలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని కచ్చితంగా చెప్పలేమని.. మైకోప్లాస్మా ఇన్‌ఫెక్షన్ చేరినా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని పశు వైద్య నిపుణులు చెబుతున్నారు. జీవాల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని యానిమల్ హెల్త్ అండ్ వెటర్నరీ బయోలాజికల్స్ అండ్ వెటర్నరీ లాబొరేటరీకి పంపినట్టు అధికారులు తెలిపారు.

This post was last modified on July 3, 2020 11:55 am

Share
Show comments
Published by
Satya
Tags: Corona

Recent Posts

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

33 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago