ఆసుపత్రుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో.. అక్కడ తెలిసీ తెలియక చేసే పనులు కొన్ని ఎలాంటి విషాదాలు మిగులుస్తాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. ఒక కరోనా పేషెంట్.. కుటుంబ సభ్యులు చేసిన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ పేషెంట్ను చూసేందుకు వచ్చి ఆసుపత్రిలో ఉక్కపోతగా ఉండటంతో కూలర్ ఆన్ చేయడం అతడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది.
కూలర్ ప్లగ్ పెట్టడం కోసం పేషెంట్కు పెట్టిన వెంటిలేటర్ ప్లగ్ను తీసి పక్కన పడేశారు అతడి కుటుంబ సభ్యులు. దీంతో అతడి ప్రాణాలు పోయాయి. రాజస్థాన్లోని కోట ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 13న 40 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడి మహారావ్ భీమ్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అతడికి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది.
ఐతే ఆ వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. దీంతో అతణ్ని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చారు. కరోనా లేకపోయినప్పటికీ అతను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ అవసరమైంది. ఐతే ఐసోలేషన్ వార్డులో బాగా ఉక్కపోతగా ఉండటంతో కుటుంబ సభ్యులు కూలర్ తీసుకొచ్చారు. దాని ప్లగ్ పెట్టే సాకెట్ కోసం చూడగా ఖాళీ కనిపించలేదు. దీంతో కనిపించిన ఒక ప్లగ్ తీసి దాన్ని అమర్చారు. వాళ్లు తీసింది వెంటిలేటర్ ప్లగ్ అని తెలియలేదు. అరగంట పాటు దానికి పవర్ అందలేదు. పేషెంట్కు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. చివరికి ప్రాణాలే పోయాయి.
వైద్యులు వచ్చి పరిశీలిస్తే వెంటిలేటర్ పని చేయట్లేదని తేలింది. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు విచారణకు సహకరించడం లేదని ఆసుపత్రి సూపరిండెండెంట్ మీడియాకు తెలిపారు.
This post was last modified on June 21, 2020 1:25 pm
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…