Trends

కూలర్ కోసం వెంటిలేటర్ తీసేశారు.. పేషెంట్ డెడ్

ఆసుపత్రుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో.. అక్కడ తెలిసీ తెలియక చేసే పనులు కొన్ని ఎలాంటి విషాదాలు మిగులుస్తాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. ఒక కరోనా పేషెంట్.. కుటుంబ సభ్యులు చేసిన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ పేషెంట్‌ను చూసేందుకు వచ్చి ఆసుపత్రిలో ఉక్కపోతగా ఉండటంతో కూలర్ ఆన్ చేయడం అతడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది.

కూలర్ ప్లగ్ పెట్టడం కోసం పేషెంట్‌కు పెట్టిన వెంటిలేటర్ ప్లగ్‌‌ను తీసి పక్కన పడేశారు అతడి కుటుంబ సభ్యులు. దీంతో అతడి ప్రాణాలు పోయాయి. రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 13న 40 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడి మహారావ్ భీమ్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అతడికి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది.

ఐతే ఆ వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. దీంతో అతణ్ని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చారు. కరోనా లేకపోయినప్పటికీ అతను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ అవసరమైంది. ఐతే ఐసోలేషన్ వార్డులో బాగా ఉక్కపోతగా ఉండటంతో కుటుంబ సభ్యులు కూలర్ తీసుకొచ్చారు. దాని ప్లగ్ పెట్టే సాకెట్ కోసం చూడగా ఖాళీ కనిపించలేదు. దీంతో కనిపించిన ఒక ప్లగ్ తీసి దాన్ని అమర్చారు. వాళ్లు తీసింది వెంటిలేటర్ ప్లగ్ అని తెలియలేదు. అరగంట పాటు దానికి పవర్ అందలేదు. పేషెంట్‌‌కు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. చివరికి ప్రాణాలే పోయాయి.

వైద్యులు వచ్చి పరిశీలిస్తే వెంటిలేటర్ పని చేయట్లేదని తేలింది. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు విచారణకు సహకరించడం లేదని ఆసుపత్రి సూపరిండెండెంట్ మీడియాకు తెలిపారు.

This post was last modified on June 21, 2020 1:25 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

11 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

11 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

13 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

13 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

17 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

19 hours ago