Trends

కూలర్ కోసం వెంటిలేటర్ తీసేశారు.. పేషెంట్ డెడ్

ఆసుపత్రుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలో.. అక్కడ తెలిసీ తెలియక చేసే పనులు కొన్ని ఎలాంటి విషాదాలు మిగులుస్తాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. ఒక కరోనా పేషెంట్.. కుటుంబ సభ్యులు చేసిన తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఆ పేషెంట్‌ను చూసేందుకు వచ్చి ఆసుపత్రిలో ఉక్కపోతగా ఉండటంతో కూలర్ ఆన్ చేయడం అతడి ప్రాణాలు కోల్పోయేలా చేసింది.

కూలర్ ప్లగ్ పెట్టడం కోసం పేషెంట్‌కు పెట్టిన వెంటిలేటర్ ప్లగ్‌‌ను తీసి పక్కన పడేశారు అతడి కుటుంబ సభ్యులు. దీంతో అతడి ప్రాణాలు పోయాయి. రాజస్థాన్‌లోని కోట ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 13న 40 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడంతో అక్కడి మహారావ్ భీమ్ సింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. అతడికి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది.

ఐతే ఆ వ్యక్తికి కరోనా పరీక్ష నిర్వహించగా.. నెగెటివ్ వచ్చింది. దీంతో అతణ్ని ఐసీయూ నుంచి ఐసోలేషన్ వార్డుకు మార్చారు. కరోనా లేకపోయినప్పటికీ అతను అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్ అవసరమైంది. ఐతే ఐసోలేషన్ వార్డులో బాగా ఉక్కపోతగా ఉండటంతో కుటుంబ సభ్యులు కూలర్ తీసుకొచ్చారు. దాని ప్లగ్ పెట్టే సాకెట్ కోసం చూడగా ఖాళీ కనిపించలేదు. దీంతో కనిపించిన ఒక ప్లగ్ తీసి దాన్ని అమర్చారు. వాళ్లు తీసింది వెంటిలేటర్ ప్లగ్ అని తెలియలేదు. అరగంట పాటు దానికి పవర్ అందలేదు. పేషెంట్‌‌కు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాడు. చివరికి ప్రాణాలే పోయాయి.

వైద్యులు వచ్చి పరిశీలిస్తే వెంటిలేటర్ పని చేయట్లేదని తేలింది. దీనిపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు విచారణకు సహకరించడం లేదని ఆసుపత్రి సూపరిండెండెంట్ మీడియాకు తెలిపారు.

This post was last modified on June 21, 2020 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభుత్వ ఉద్యోగాల్లో తగ్గేదే లే అంటున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వ‌ర‌లోనే మ‌రో 40 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు.…

9 minutes ago

మళ్ళీ పాద‌యాత్ర చేసి సాధించేది ఏమన్నా ఉందా జగన్?

అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న ప‌రిస్థితిలో చెప్పడం కష్టంగా…

1 hour ago

వారికి కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…

1 hour ago

బాలయ్య హిందీ, తమిళంలోనూ ఇరగదీస్తున్నాడుగా

నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ‌-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…

2 hours ago

భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?

సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…

2 hours ago

అఖండ ప్లానింగ్… అక్క‌డ సూప‌ర్… కానీ ఇక్క‌డ‌?

పెద్ద సినిమాల‌కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆల‌స్యం కావ‌డం ఇటీవ‌ల పెద్ద స‌మ‌స్య‌గా మారుతోంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు…

2 hours ago