Trends

ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ ?

వచ్చే ఫిబ్రవరి నెలలో థర్డ్ వేవ్ ఖాయమని అంటున్నారు. కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. థర్డ్ వేవ్ ఖాయమే అయినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని కూడా భావిస్తోంది.  దేశంలో రోజువారీ కేసుల సంఖ్య సుమారుగా 8 వేల వరకు ఉంటోంది. వీటిల్లో మరణాల సంఖ్య తక్కువే అయినా నూరు శాతం మరణాలైతే ఇంకా కంట్రోల్లోకి రాలేదని కమిటీ హెడ్ డాక్టర్ విద్యాసాగర్ చెప్పారు. మనదేశంలో ఒమిక్రాన్ చాలా స్పీడుగా వ్యాపించే ప్రమాదం కూడా ఉందన్నారు.

మనదేశంలో కోవిడ్ టీకాలు దాదాపు అందరికీ వేయించిన కారణంగానే ఒమిక్రాన్ నుండి రక్షణ దొరికే అవకాశం కూడా ఉందన్నారు. ఇమ్యూనిటీ పెరగడం వల్ల మరణాల శాతం తగ్గే అవకాశాలున్నట్లు విద్యాసాగర్ అభిప్రాయపడ్డారు. ఒకసారి ఒమిక్రాన్ తీవ్రత వల్ల వైరస్ గనుక పాకడం మొదలు పెడితే చాలా స్పీడుగా పాకిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రెండు డోసులు వేసుకున్న వాళ్ళు కూడా వీలైనంతలో బయట తిరగకుండా ఉంటేనే మంచిదని డాక్టర్ స్పష్టంగా చెప్పారు.

కోవిడ్ టీకాలు వేసుకున్నాం కదాని జనాలు నిర్లక్ష్యంగా ఉంటే కరోనా వైరస్ అయినా ఒమిక్రాన్ ను అయినా మనంతట మనమే ఆహ్వానించినట్లవుతుందన్నారు. జనాల నిర్లక్ష్యం వల్లే కరోనా సెకండ్ వేవ్ లో కూడా ఎక్కువ మరణాలు సంభవించినట్లు తెలిపారు. జనాలు తమవైపు నుండి తాము జాగ్రత్తలు తీసుకుంటే రిస్కు శాతం చాలావరకు తగ్గిపోతుందన్నారు. ఒమిక్రాన్ గనుక విజృంభిస్తే రోజువారీ కేసుల సంఖ్యలో పూర్తిగా మారిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు. 95 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో అవసరమైతే కానీ జనాలు బయట తిరగద్దని స్పష్టంగా ప్రకటించింది. ఎంతో అవసరమనుకుంటే కానీ  ఫంక్షన్లకు, ఊర్లకు, మార్కెట్ల లాంటి పబ్లిక్ ప్లేసుల్లో తిరగద్దని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సిందే అని చెప్పింది. ఏమాత్రం అనారోగ్యంగా ఉందనిపించినా వెంటనే డాక్టర్ ను కలిసి అవసరమైన సూచనలు పాటించాలని పదే పదే చెబుతోంది. ఏదేమైనా థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ విజృంబిస్తుందన్న ప్రకటనలే జనాలను భయపెడుతున్నది. చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

This post was last modified on December 19, 2021 11:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago