Trends

క‌రోనా దేవికి పూజ‌లు పున‌స్కారాలు

చాలామందిలో భ‌యం నుంచి భ‌క్తి పుడుతుంది. భ‌యం వ‌ల్ల భ‌క్తి ఇంకా పెరుగుతుంది కూడా. క‌ష్టం రాగానే దేవుడిపై భారం వేసేస్తారు చాలామంది. మూఢ న‌మ్మ‌కాలున్న వాళ్ల‌యితే మ‌రీనూ. ఈ క్ర‌మంలో వాళ్లు చేసే ప‌నులు మ‌రీ త‌మాషాగా కూడా త‌యార‌వుతాయి. ఈ స్థితిలో వారి అమాయ‌క‌త్వానికి న‌వ్వుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేం.

ఉత్త‌రాదిన బాగా వెనుక‌బ‌డిన రాష్ట్రాల్లో ఒక‌టైన‌ బీహార్‌లో క‌రోనా వైర‌స్ భ‌యంతో గ్రామీణ మ‌హిళ‌లు చేస్తున్న ప‌నులు చూసి అంతా షాక‌వుతున్నారు. కొత్త‌గా క‌రోనా దేవి అనే దేవ‌త‌ను సృష్టించి.. వైర‌స్ బారి నుంచి త‌మ‌ను కాపాడాలంటూ ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్నారు అక్క‌డివాళ్లు.

న‌లంద‌, గోపాల్‌గంజ్‌, సార‌న్‌, వైశాలి, ముజ‌ఫ్ఫ‌ర్ పూర్ త‌దిత‌ర ప్రాంతాల్లో ఇప్పుడు క‌రోనా దేవి అనే దేవ‌త నామాన్ని జ‌నాలు జ‌పిస్తున్నారు. త‌మ‌ను కాపాడ‌మ‌ని వేడుకుంటున్నారు. క‌రోనా అనే దేవ‌త త‌మ‌పై ప‌గ‌బ‌ట్టింద‌ని.. అందుకే ఈ వైర‌స్ ప్ర‌బ‌లుతోంద‌ని.. ఆ దేవ‌త‌కు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తే శాంతించి.. వైర‌స్ త‌మ జోలికి రాకుండా చూస్తుంద‌ని అక్క‌డి వారు న‌మ్ముతున్నారు.

త‌మ గ్రామాల‌కు స‌మీపంలోని చెరువులు, న‌దుల ద‌గ్గ‌రికెళ్లి.. అక్క‌డ చిన్న చిన్న గుంత‌లు త‌వ్వి బెల్లం పాన‌కం, ల‌డ్డూలు, యాల‌కులు, ల‌వంగాలు లాంటి ఏడు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను దేవ‌త‌కు స‌మ‌ర్పిస్తున్నారు. ఇలా చేస్తే దేవ‌త శాంతిస్తుంద‌న్న‌ది వారి మూఢ న‌మ్మ‌కం.

ఈ ఒర‌వ‌డి రోజు రోజుకూ పెరిగి జ‌నాలు పెద్ద ఎత్తున పూజ‌ల్లో నిమ‌గ్న‌మ‌వుతుంటంతో అధికారులు రంగంలోకి దిగి వారికి అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా వారు వినిపించుకోవ‌ట్లేద‌ని మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

Satya

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

17 minutes ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

26 minutes ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

3 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

3 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

3 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

4 hours ago