చాలామందిలో భయం నుంచి భక్తి పుడుతుంది. భయం వల్ల భక్తి ఇంకా పెరుగుతుంది కూడా. కష్టం రాగానే దేవుడిపై భారం వేసేస్తారు చాలామంది. మూఢ నమ్మకాలున్న వాళ్లయితే మరీనూ. ఈ క్రమంలో వాళ్లు చేసే పనులు మరీ తమాషాగా కూడా తయారవుతాయి. ఈ స్థితిలో వారి అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం.
ఉత్తరాదిన బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో కరోనా వైరస్ భయంతో గ్రామీణ మహిళలు చేస్తున్న పనులు చూసి అంతా షాకవుతున్నారు. కొత్తగా కరోనా దేవి అనే దేవతను సృష్టించి.. వైరస్ బారి నుంచి తమను కాపాడాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు అక్కడివాళ్లు.
నలంద, గోపాల్గంజ్, సారన్, వైశాలి, ముజఫ్ఫర్ పూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు కరోనా దేవి అనే దేవత నామాన్ని జనాలు జపిస్తున్నారు. తమను కాపాడమని వేడుకుంటున్నారు. కరోనా అనే దేవత తమపై పగబట్టిందని.. అందుకే ఈ వైరస్ ప్రబలుతోందని.. ఆ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తే శాంతించి.. వైరస్ తమ జోలికి రాకుండా చూస్తుందని అక్కడి వారు నమ్ముతున్నారు.
తమ గ్రామాలకు సమీపంలోని చెరువులు, నదుల దగ్గరికెళ్లి.. అక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వి బెల్లం పానకం, లడ్డూలు, యాలకులు, లవంగాలు లాంటి ఏడు రకాల ఆహార పదార్థాలను దేవతకు సమర్పిస్తున్నారు. ఇలా చేస్తే దేవత శాంతిస్తుందన్నది వారి మూఢ నమ్మకం.
ఈ ఒరవడి రోజు రోజుకూ పెరిగి జనాలు పెద్ద ఎత్తున పూజల్లో నిమగ్నమవుతుంటంతో అధికారులు రంగంలోకి దిగి వారికి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారు వినిపించుకోవట్లేదని మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on June 6, 2020 9:49 pm
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…
తెలుగుదేశం పార్టీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాఫీ కబుర్లు' పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం కార్యకర్తల్లో…
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…