చాలామందిలో భయం నుంచి భక్తి పుడుతుంది. భయం వల్ల భక్తి ఇంకా పెరుగుతుంది కూడా. కష్టం రాగానే దేవుడిపై భారం వేసేస్తారు చాలామంది. మూఢ నమ్మకాలున్న వాళ్లయితే మరీనూ. ఈ క్రమంలో వాళ్లు చేసే పనులు మరీ తమాషాగా కూడా తయారవుతాయి. ఈ స్థితిలో వారి అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం.
ఉత్తరాదిన బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో కరోనా వైరస్ భయంతో గ్రామీణ మహిళలు చేస్తున్న పనులు చూసి అంతా షాకవుతున్నారు. కొత్తగా కరోనా దేవి అనే దేవతను సృష్టించి.. వైరస్ బారి నుంచి తమను కాపాడాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు అక్కడివాళ్లు.
నలంద, గోపాల్గంజ్, సారన్, వైశాలి, ముజఫ్ఫర్ పూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు కరోనా దేవి అనే దేవత నామాన్ని జనాలు జపిస్తున్నారు. తమను కాపాడమని వేడుకుంటున్నారు. కరోనా అనే దేవత తమపై పగబట్టిందని.. అందుకే ఈ వైరస్ ప్రబలుతోందని.. ఆ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తే శాంతించి.. వైరస్ తమ జోలికి రాకుండా చూస్తుందని అక్కడి వారు నమ్ముతున్నారు.
తమ గ్రామాలకు సమీపంలోని చెరువులు, నదుల దగ్గరికెళ్లి.. అక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వి బెల్లం పానకం, లడ్డూలు, యాలకులు, లవంగాలు లాంటి ఏడు రకాల ఆహార పదార్థాలను దేవతకు సమర్పిస్తున్నారు. ఇలా చేస్తే దేవత శాంతిస్తుందన్నది వారి మూఢ నమ్మకం.
ఈ ఒరవడి రోజు రోజుకూ పెరిగి జనాలు పెద్ద ఎత్తున పూజల్లో నిమగ్నమవుతుంటంతో అధికారులు రంగంలోకి దిగి వారికి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారు వినిపించుకోవట్లేదని మీడియాలో వార్తలొస్తున్నాయి.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…