చాలామందిలో భయం నుంచి భక్తి పుడుతుంది. భయం వల్ల భక్తి ఇంకా పెరుగుతుంది కూడా. కష్టం రాగానే దేవుడిపై భారం వేసేస్తారు చాలామంది. మూఢ నమ్మకాలున్న వాళ్లయితే మరీనూ. ఈ క్రమంలో వాళ్లు చేసే పనులు మరీ తమాషాగా కూడా తయారవుతాయి. ఈ స్థితిలో వారి అమాయకత్వానికి నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం.
ఉత్తరాదిన బాగా వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్లో కరోనా వైరస్ భయంతో గ్రామీణ మహిళలు చేస్తున్న పనులు చూసి అంతా షాకవుతున్నారు. కొత్తగా కరోనా దేవి అనే దేవతను సృష్టించి.. వైరస్ బారి నుంచి తమను కాపాడాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు అక్కడివాళ్లు.
నలంద, గోపాల్గంజ్, సారన్, వైశాలి, ముజఫ్ఫర్ పూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పుడు కరోనా దేవి అనే దేవత నామాన్ని జనాలు జపిస్తున్నారు. తమను కాపాడమని వేడుకుంటున్నారు. కరోనా అనే దేవత తమపై పగబట్టిందని.. అందుకే ఈ వైరస్ ప్రబలుతోందని.. ఆ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తే శాంతించి.. వైరస్ తమ జోలికి రాకుండా చూస్తుందని అక్కడి వారు నమ్ముతున్నారు.
తమ గ్రామాలకు సమీపంలోని చెరువులు, నదుల దగ్గరికెళ్లి.. అక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వి బెల్లం పానకం, లడ్డూలు, యాలకులు, లవంగాలు లాంటి ఏడు రకాల ఆహార పదార్థాలను దేవతకు సమర్పిస్తున్నారు. ఇలా చేస్తే దేవత శాంతిస్తుందన్నది వారి మూఢ నమ్మకం.
ఈ ఒరవడి రోజు రోజుకూ పెరిగి జనాలు పెద్ద ఎత్తున పూజల్లో నిమగ్నమవుతుంటంతో అధికారులు రంగంలోకి దిగి వారికి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారు వినిపించుకోవట్లేదని మీడియాలో వార్తలొస్తున్నాయి.
This post was last modified on June 6, 2020 9:49 pm
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…