Trends

రావణుడికి విమానం.. లంక ప్రభుత్వ పరిశోధనకు భారత్ సాయం!


రామాయణాన్ని పురాణ గ్రంధంగా భావించే వారికి కొదవ లేదు. అయితే.. ఇదంతా కల్పితమని కొందరు ప్రచారం చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవాన్ని కల్పితంగా ఎందుకు భావిస్తారన్న వాదన తెలిసిందే. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు.. పాత్రలు అన్ని నిజమైనవే అన్న వాదనే కాదు.. దాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి? ఇదిలా ఉండగా.. తాజాగా లంకాధీశుడు రావణుడి వద్ద విమానాలు (గాల్లో ఎగిరి ప్రయాణం చేసే వాహనాలు) ఉన్నాయా? అన్న పెద్ద సందేహం గడిచిన కొంతకాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని లెక్క తేల్చేందుకు లంక ప్రభుత్వం పరిశోదన చేస్తోంది.

ప్రపంచంలో అందరి కంటే ముందు గాల్లో ప్రయాణించే వాహనాన్ని వాడింది రావణుడే అన్న వాదనను లంక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఒక పరిశోధనా టీంను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఆగిన పరిశోధనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా.. తాజాగా ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.

ఈ కీలక పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలని శ్రీలంక సర్కారు భావిస్తోంది. ప్రపంచంలో తొలిసారి విమానాన్ని వినియోగించింది రావణుడే అని కొందరు నమ్ముతున్నారని.. అందునా లంక ప్రజలు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఇది కల్పితమని భావించే వారు కూడా లేకపోలేదు. అయితే..ఈ రెండు వాదనల్లో నిజమెంత? అబద్ధం ఎంతన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు నిపుణులు.. చరిత్రకారులు.. శాస్త్రవేత్తలు.. పురావస్తు శాఖకు సంబంధించిన వారితో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి.

ఈ సమావేశంలో జరిగిన చర్చ చివర్లో మాత్రం అందరూ రావణుడు విమానంలో ప్రయాణించే భారత్ కు వచ్చాడన్న మాటకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై పరిశోధనలో భాగంగా శ్రీలంక సర్కారు ఐదు మిలియన్ రూపాయిల్ని (శ్రీలంక కరెన్సీని కూడా రూపాయిలుగానే పిలుస్తారు. ప్రస్తుత మారకం ప్రకారం చూస్తే.. శ్రీలంక రూపాయికి భారత కరెన్సీ 37 పైసలు మాత్రమే ఇస్తారు) విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ పరిశోధన ముందుకు సాగలేదు.

తాజాగా.. మహమ్మారి తీవ్రత నెమ్మదించటం.. అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న వేళలో.. ఈ రీసెర్చ్ ను తిరిగి షురూ చేయాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు మొదలు కానున్నాయి. ఇందులో భారత్ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on November 16, 2021 11:08 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ !

లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…

8 mins ago

ముద్రగ‌డ ఫ్యామిలీలో క‌ల్లోలం.. ప‌వ‌న్‌కు జైకొట్టిన కుమార్తె

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్తితే.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేస్తున్న…

46 mins ago

అందమైన దెయ్యాలను పట్టించుకోవడం లేదే

ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…

2 hours ago

`పెద్దిరెడ్డి` నియోజ‌క‌వ‌ర్గం ఇంత డేంజ‌రా?

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు అంటే..అసెంబ్లీ+పార్ల‌మెంటు ఎన్నిక‌లు ఈ నెల 13న జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని…

2 hours ago

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

4 hours ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

4 hours ago