Trends

రావణుడికి విమానం.. లంక ప్రభుత్వ పరిశోధనకు భారత్ సాయం!


రామాయణాన్ని పురాణ గ్రంధంగా భావించే వారికి కొదవ లేదు. అయితే.. ఇదంతా కల్పితమని కొందరు ప్రచారం చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవాన్ని కల్పితంగా ఎందుకు భావిస్తారన్న వాదన తెలిసిందే. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు.. పాత్రలు అన్ని నిజమైనవే అన్న వాదనే కాదు.. దాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి? ఇదిలా ఉండగా.. తాజాగా లంకాధీశుడు రావణుడి వద్ద విమానాలు (గాల్లో ఎగిరి ప్రయాణం చేసే వాహనాలు) ఉన్నాయా? అన్న పెద్ద సందేహం గడిచిన కొంతకాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని లెక్క తేల్చేందుకు లంక ప్రభుత్వం పరిశోదన చేస్తోంది.

ప్రపంచంలో అందరి కంటే ముందు గాల్లో ప్రయాణించే వాహనాన్ని వాడింది రావణుడే అన్న వాదనను లంక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఒక పరిశోధనా టీంను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఆగిన పరిశోధనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా.. తాజాగా ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.

ఈ కీలక పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలని శ్రీలంక సర్కారు భావిస్తోంది. ప్రపంచంలో తొలిసారి విమానాన్ని వినియోగించింది రావణుడే అని కొందరు నమ్ముతున్నారని.. అందునా లంక ప్రజలు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఇది కల్పితమని భావించే వారు కూడా లేకపోలేదు. అయితే..ఈ రెండు వాదనల్లో నిజమెంత? అబద్ధం ఎంతన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు నిపుణులు.. చరిత్రకారులు.. శాస్త్రవేత్తలు.. పురావస్తు శాఖకు సంబంధించిన వారితో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి.

ఈ సమావేశంలో జరిగిన చర్చ చివర్లో మాత్రం అందరూ రావణుడు విమానంలో ప్రయాణించే భారత్ కు వచ్చాడన్న మాటకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై పరిశోధనలో భాగంగా శ్రీలంక సర్కారు ఐదు మిలియన్ రూపాయిల్ని (శ్రీలంక కరెన్సీని కూడా రూపాయిలుగానే పిలుస్తారు. ప్రస్తుత మారకం ప్రకారం చూస్తే.. శ్రీలంక రూపాయికి భారత కరెన్సీ 37 పైసలు మాత్రమే ఇస్తారు) విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ పరిశోధన ముందుకు సాగలేదు.

తాజాగా.. మహమ్మారి తీవ్రత నెమ్మదించటం.. అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న వేళలో.. ఈ రీసెర్చ్ ను తిరిగి షురూ చేయాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు మొదలు కానున్నాయి. ఇందులో భారత్ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

2 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

3 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

4 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

5 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

5 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

5 hours ago