రామాయణాన్ని పురాణ గ్రంధంగా భావించే వారికి కొదవ లేదు. అయితే.. ఇదంతా కల్పితమని కొందరు ప్రచారం చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవాన్ని కల్పితంగా ఎందుకు భావిస్తారన్న వాదన తెలిసిందే. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు.. పాత్రలు అన్ని నిజమైనవే అన్న వాదనే కాదు.. దాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి? ఇదిలా ఉండగా.. తాజాగా లంకాధీశుడు రావణుడి వద్ద విమానాలు (గాల్లో ఎగిరి ప్రయాణం చేసే వాహనాలు) ఉన్నాయా? అన్న పెద్ద సందేహం గడిచిన కొంతకాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని లెక్క తేల్చేందుకు లంక ప్రభుత్వం పరిశోదన చేస్తోంది.
ప్రపంచంలో అందరి కంటే ముందు గాల్లో ప్రయాణించే వాహనాన్ని వాడింది రావణుడే అన్న వాదనను లంక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఒక పరిశోధనా టీంను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఆగిన పరిశోధనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా.. తాజాగా ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.
ఈ కీలక పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలని శ్రీలంక సర్కారు భావిస్తోంది. ప్రపంచంలో తొలిసారి విమానాన్ని వినియోగించింది రావణుడే అని కొందరు నమ్ముతున్నారని.. అందునా లంక ప్రజలు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఇది కల్పితమని భావించే వారు కూడా లేకపోలేదు. అయితే..ఈ రెండు వాదనల్లో నిజమెంత? అబద్ధం ఎంతన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు నిపుణులు.. చరిత్రకారులు.. శాస్త్రవేత్తలు.. పురావస్తు శాఖకు సంబంధించిన వారితో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి.
ఈ సమావేశంలో జరిగిన చర్చ చివర్లో మాత్రం అందరూ రావణుడు విమానంలో ప్రయాణించే భారత్ కు వచ్చాడన్న మాటకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై పరిశోధనలో భాగంగా శ్రీలంక సర్కారు ఐదు మిలియన్ రూపాయిల్ని (శ్రీలంక కరెన్సీని కూడా రూపాయిలుగానే పిలుస్తారు. ప్రస్తుత మారకం ప్రకారం చూస్తే.. శ్రీలంక రూపాయికి భారత కరెన్సీ 37 పైసలు మాత్రమే ఇస్తారు) విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ పరిశోధన ముందుకు సాగలేదు.
తాజాగా.. మహమ్మారి తీవ్రత నెమ్మదించటం.. అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న వేళలో.. ఈ రీసెర్చ్ ను తిరిగి షురూ చేయాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు మొదలు కానున్నాయి. ఇందులో భారత్ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 16, 2021 11:08 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…