Trends

రావణుడికి విమానం.. లంక ప్రభుత్వ పరిశోధనకు భారత్ సాయం!


రామాయణాన్ని పురాణ గ్రంధంగా భావించే వారికి కొదవ లేదు. అయితే.. ఇదంతా కల్పితమని కొందరు ప్రచారం చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవాన్ని కల్పితంగా ఎందుకు భావిస్తారన్న వాదన తెలిసిందే. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు.. పాత్రలు అన్ని నిజమైనవే అన్న వాదనే కాదు.. దాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి? ఇదిలా ఉండగా.. తాజాగా లంకాధీశుడు రావణుడి వద్ద విమానాలు (గాల్లో ఎగిరి ప్రయాణం చేసే వాహనాలు) ఉన్నాయా? అన్న పెద్ద సందేహం గడిచిన కొంతకాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని లెక్క తేల్చేందుకు లంక ప్రభుత్వం పరిశోదన చేస్తోంది.

ప్రపంచంలో అందరి కంటే ముందు గాల్లో ప్రయాణించే వాహనాన్ని వాడింది రావణుడే అన్న వాదనను లంక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఒక పరిశోధనా టీంను ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఆగిన పరిశోధనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా.. తాజాగా ఒక అప్డేట్ ఆసక్తికరంగా మారింది.

ఈ కీలక పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలని శ్రీలంక సర్కారు భావిస్తోంది. ప్రపంచంలో తొలిసారి విమానాన్ని వినియోగించింది రావణుడే అని కొందరు నమ్ముతున్నారని.. అందునా లంక ప్రజలు ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఇది కల్పితమని భావించే వారు కూడా లేకపోలేదు. అయితే..ఈ రెండు వాదనల్లో నిజమెంత? అబద్ధం ఎంతన్న విషయాన్ని లెక్క తేల్చేందుకు నిపుణులు.. చరిత్రకారులు.. శాస్త్రవేత్తలు.. పురావస్తు శాఖకు సంబంధించిన వారితో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున చర్చలు సాగాయి.

ఈ సమావేశంలో జరిగిన చర్చ చివర్లో మాత్రం అందరూ రావణుడు విమానంలో ప్రయాణించే భారత్ కు వచ్చాడన్న మాటకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంపై పరిశోధనలో భాగంగా శ్రీలంక సర్కారు ఐదు మిలియన్ రూపాయిల్ని (శ్రీలంక కరెన్సీని కూడా రూపాయిలుగానే పిలుస్తారు. ప్రస్తుత మారకం ప్రకారం చూస్తే.. శ్రీలంక రూపాయికి భారత కరెన్సీ 37 పైసలు మాత్రమే ఇస్తారు) విడుదల చేసింది. కరోనా కారణంగా ఈ పరిశోధన ముందుకు సాగలేదు.

తాజాగా.. మహమ్మారి తీవ్రత నెమ్మదించటం.. అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్న వేళలో.. ఈ రీసెర్చ్ ను తిరిగి షురూ చేయాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు మొదలు కానున్నాయి. ఇందులో భారత్ కూడా పాలు పంచుకోవాలని కోరుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on November 16, 2021 11:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టార్గెట్ ఆరు నెలలు

ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…

7 minutes ago

పీఎం పొదుపు మంత్రం… మహానాడుపై ఎఫెక్ట్?

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్‌ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…

29 minutes ago

ఇక పెట్రోల్ బాదుడేనా?

అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…

37 minutes ago

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

3 hours ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

8 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

9 hours ago