కథల విషయంలో, సన్నివేశాల విషయంలో స్ఫూర్తి పొందడం తప్పేమీ కాదంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన సినిమాలు చాలా వాటిలో వేరే సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. ఐతే అదే సమయంలో అవేవీ కాపీలా అనిపించవు. దేన్నయితే చూసి స్ఫూర్తి పొందాడో.. దాన్ని మించిన ఔట్ పుట్తో వారెవా అనిపిస్తాడు.
‘మగధీర’లో వంద మంది యోధులతో కాల భైరవ పోరాడే సన్నివేశం హాలీవుడ్ మూవీ ‘300’ స్ఫూర్తితో తీసిందే. కానీ ఒరిజినల్ను మించిన గొప్ప అనుభూతి కలిగేలా ఆ యాక్షన్ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు జక్కన్న. ఇక ఇదే సినిమాలో ఇంకో కీలక సన్నివేశం ‘కొదమసింహం’ మూవీలోని ఓ సీన్ను గుర్తుకు తెస్తుంది. అది చరణ్ ఇసుకలో కూరుకుపోతే గుర్రం వచ్చి అతణ్ని కాపాడే సన్నివేశం అని అందరికీ తెలుసు.
‘కొదమసింహం’లో చిరును విలన్లు ఇసుకలో గొంతు వరకు పూడ్చేసి వెళ్లిపోతే.. తన గుర్రం కాపాడే సన్నివేశం ఉంటుంది. ఐతే ఈ సన్నివేశం నుంచి స్ఫూర్తి పొందడం కంటే దాన్ని చూసి అసంతృప్తి చెందడం వల్ల ‘మగధీర’లో ఆ సీన్ పెట్టినట్లు రాజమౌళి వెల్లడించడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆ సన్నివేశం గురించి గుర్తు చేసుకున్నాడు.
“నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్లో ‘కొదమసింహం’ సినిమా చూశాను. అందులో రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న ఆయన గుర్రం నోటికి తాడు ఇచ్చి కాపాడుతుంది. ఆ సీన్ చూసి ఎమోషన్ అయ్యాను. కానీ ఆ కష్టంలోంచి బయటికి వచ్చిన చిరుకు, గుర్రానికి అనుబంధం లేదనిపించింది. ప్రాణాలు కాపాడిన గుర్రానికి థ్యాంక్స్ చెప్పకపోతే ఉద్వేగం పండదు. అది నా మైండ్లో అలాగే ఉండిపోతుంది. ‘మగధీర’ ఇలాంటి సన్నివేశమే పెట్టాం. ఐతే తనను కాపాడాక చరణ్ వచ్చి గుర్రాన్ని కౌగిలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దాని పట్ల కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. ఇలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ఒక ప్రేక్షకుడిలా ఆలోచించి తీసినవే” అని రాజమౌళి చెప్పాడు.
This post was last modified on November 16, 2021 3:49 pm
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…
కేరళ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫు స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..…
2022 లెజెండ్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన తమిళ వ్యాపారవేత్త శరవణన్ ని మూవీ లవర్స్ అంత ఈజీగా మర్చిపోలేరు.…
తమిళ మలయాళ టైటిల్స్ ని ఒరిజినల్ పేర్లతో పెట్టడం సినిమాల ఓపెనింగ్స్, బజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తోందో నిర్మాతలు…
ఏపీకి ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే కూటమి సర్కారు తీసుకున్న చర్యలు విపక్ష వైసీపీని ఓ రేంజిలో కలవరపాటుకు గురి చేశాయని చెప్పక తప్పదు.…
మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా సంబరాల ఏటిగట్టు ఇప్పటికీ విడుదల తేదీ ఖరారు…