కథల విషయంలో, సన్నివేశాల విషయంలో స్ఫూర్తి పొందడం తప్పేమీ కాదంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన సినిమాలు చాలా వాటిలో వేరే సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. ఐతే అదే సమయంలో అవేవీ కాపీలా అనిపించవు. దేన్నయితే చూసి స్ఫూర్తి పొందాడో.. దాన్ని మించిన ఔట్ పుట్తో వారెవా అనిపిస్తాడు.
‘మగధీర’లో వంద మంది యోధులతో కాల భైరవ పోరాడే సన్నివేశం హాలీవుడ్ మూవీ ‘300’ స్ఫూర్తితో తీసిందే. కానీ ఒరిజినల్ను మించిన గొప్ప అనుభూతి కలిగేలా ఆ యాక్షన్ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు జక్కన్న. ఇక ఇదే సినిమాలో ఇంకో కీలక సన్నివేశం ‘కొదమసింహం’ మూవీలోని ఓ సీన్ను గుర్తుకు తెస్తుంది. అది చరణ్ ఇసుకలో కూరుకుపోతే గుర్రం వచ్చి అతణ్ని కాపాడే సన్నివేశం అని అందరికీ తెలుసు.
‘కొదమసింహం’లో చిరును విలన్లు ఇసుకలో గొంతు వరకు పూడ్చేసి వెళ్లిపోతే.. తన గుర్రం కాపాడే సన్నివేశం ఉంటుంది. ఐతే ఈ సన్నివేశం నుంచి స్ఫూర్తి పొందడం కంటే దాన్ని చూసి అసంతృప్తి చెందడం వల్ల ‘మగధీర’లో ఆ సీన్ పెట్టినట్లు రాజమౌళి వెల్లడించడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆ సన్నివేశం గురించి గుర్తు చేసుకున్నాడు.
“నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్లో ‘కొదమసింహం’ సినిమా చూశాను. అందులో రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న ఆయన గుర్రం నోటికి తాడు ఇచ్చి కాపాడుతుంది. ఆ సీన్ చూసి ఎమోషన్ అయ్యాను. కానీ ఆ కష్టంలోంచి బయటికి వచ్చిన చిరుకు, గుర్రానికి అనుబంధం లేదనిపించింది. ప్రాణాలు కాపాడిన గుర్రానికి థ్యాంక్స్ చెప్పకపోతే ఉద్వేగం పండదు. అది నా మైండ్లో అలాగే ఉండిపోతుంది. ‘మగధీర’ ఇలాంటి సన్నివేశమే పెట్టాం. ఐతే తనను కాపాడాక చరణ్ వచ్చి గుర్రాన్ని కౌగిలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దాని పట్ల కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. ఇలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ఒక ప్రేక్షకుడిలా ఆలోచించి తీసినవే” అని రాజమౌళి చెప్పాడు.
This post was last modified on November 16, 2021 3:49 pm
ఇవాళ ఎవడే సుబ్రహ్మణ్యంని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్నీమధ్యే ఈవెంట్ చేసి అభిమానులను…
అత్యంత వివాదాస్పద జ్యోతిష్కుడిగా పేరు తెచ్చుకున్న వేణు స్వామి వివిధ సందర్భాల్లో ఎంత అతి చేశాడో చూస్తూనే వచ్చాం. నాగచైతన్య,…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం మరో భారీ ఊరట లభించింది. ఇప్పటిదాకా…
జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయోగాలు.. జనసేన నాయకులకు ఇబ్బందిగా మారుతున్నాయి. సాధారణంగా పార్టీని…
ఏపీ సీఎం చంద్రబాబుకు మరో కీలకమైన వ్యవహారం కత్తిమీద సాముగా మారనుంది. ఇప్పటి వరకు పాలన వేరు.. ఆమోదించిన బిల్లులు..…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత అలిపిరికి అత్యంత సమీపంలో ఓ ప్రైవేట్ హోటల్ వెలిసేందుకు అనుమతులు జారీ…