కథల విషయంలో, సన్నివేశాల విషయంలో స్ఫూర్తి పొందడం తప్పేమీ కాదంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన సినిమాలు చాలా వాటిలో వేరే సినిమాల స్ఫూర్తి కనిపిస్తుంది. ఐతే అదే సమయంలో అవేవీ కాపీలా అనిపించవు. దేన్నయితే చూసి స్ఫూర్తి పొందాడో.. దాన్ని మించిన ఔట్ పుట్తో వారెవా అనిపిస్తాడు.
‘మగధీర’లో వంద మంది యోధులతో కాల భైరవ పోరాడే సన్నివేశం హాలీవుడ్ మూవీ ‘300’ స్ఫూర్తితో తీసిందే. కానీ ఒరిజినల్ను మించిన గొప్ప అనుభూతి కలిగేలా ఆ యాక్షన్ సన్నివేశాన్ని తీర్చిదిద్దాడు జక్కన్న. ఇక ఇదే సినిమాలో ఇంకో కీలక సన్నివేశం ‘కొదమసింహం’ మూవీలోని ఓ సీన్ను గుర్తుకు తెస్తుంది. అది చరణ్ ఇసుకలో కూరుకుపోతే గుర్రం వచ్చి అతణ్ని కాపాడే సన్నివేశం అని అందరికీ తెలుసు.
‘కొదమసింహం’లో చిరును విలన్లు ఇసుకలో గొంతు వరకు పూడ్చేసి వెళ్లిపోతే.. తన గుర్రం కాపాడే సన్నివేశం ఉంటుంది. ఐతే ఈ సన్నివేశం నుంచి స్ఫూర్తి పొందడం కంటే దాన్ని చూసి అసంతృప్తి చెందడం వల్ల ‘మగధీర’లో ఆ సీన్ పెట్టినట్లు రాజమౌళి వెల్లడించడం విశేషం. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆ సన్నివేశం గురించి గుర్తు చేసుకున్నాడు.
“నేను చిరంజీవి గారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్లో ‘కొదమసింహం’ సినిమా చూశాను. అందులో రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న ఆయన గుర్రం నోటికి తాడు ఇచ్చి కాపాడుతుంది. ఆ సీన్ చూసి ఎమోషన్ అయ్యాను. కానీ ఆ కష్టంలోంచి బయటికి వచ్చిన చిరుకు, గుర్రానికి అనుబంధం లేదనిపించింది. ప్రాణాలు కాపాడిన గుర్రానికి థ్యాంక్స్ చెప్పకపోతే ఉద్వేగం పండదు. అది నా మైండ్లో అలాగే ఉండిపోతుంది. ‘మగధీర’ ఇలాంటి సన్నివేశమే పెట్టాం. ఐతే తనను కాపాడాక చరణ్ వచ్చి గుర్రాన్ని కౌగిలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దాని పట్ల కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. ఇలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ఒక ప్రేక్షకుడిలా ఆలోచించి తీసినవే” అని రాజమౌళి చెప్పాడు.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…