గంజాయి అమ్మకాలకు అమ్మకందారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్ధ అమెజాన్ ద్వారా వ్యాపారస్తులు తమ వినియోగదారులకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. మామూలుగా అమెజాన్ లో నిత్యావసరాలు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను అమ్ముతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులరైన అమెజాన్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా గుర్తించారు.
అమెజాన్ లో డ్రై స్టీవియా అనే పేరుతో గంజాయి అమ్మకాలను యధేచ్చగా అమ్మేస్తున్నారు. డ్రై స్టీవియా అనేది గడ్డిజాతి ఆకులు. ఈ ఆకులు తీయగా ఉంటాయి. అంటే వీటిని పంచదారకు ప్రత్యామ్నాయంగా వాడుతుంటారు. ఈ ఆకులను ఉపయోగించి స్వీట్లు, టీ/కాఫీల్లో షుగర్ పేషంట్లు ఎక్కువగా వాడుతుంటారు. ఈ విషయం తెలిసిన వ్యాపారస్తులు గంజాయిని తమ వినియోగదారులకు హ్యాపీగా సరఫరా చేసేస్తున్నారు.
రాష్ట్రంలోని విశాఖపట్నం ప్రాంతం నుండి గ్వాలియర్, కోటా, భోపాల్, ఆగ్రా తదితర ప్రాంతాలకు అమెజాన్ ద్వారానే గంజాయి సరఫరా అవుతోందట. భోపాల్ పోలీసులు రెగ్యులర్ గా జరిపే సోదాల్లో భాగంగానే అమెజాన్ డెలివరీ బాయ్స్ ను చెక్ చేసినపుడు ఈ విషయం బయటపడింది. దాంతో సదరు పార్శిల్ ను ఎవరికి డెలివరీ ఇవ్వబోతున్నారనే విషయాలను తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే లోకల్ అమెజాన్ ఆఫీసు మీద కూడా దాడిచేశారు. దాంతో ఇప్పటివరకు రు. 1.10 కోట్ల బిజినెస్ జరిగినట్లు తేలింది.
తమకు దొరికిన సాక్ష్యాల ఆధారంగా డెలవరీ బాయ్స్ తో పాటు అమెజాన్ సంస్ధతో పాటు ఇద్దరు కొనుగోలుదారుల మీద కూడా పోలీసులు కేసులు నమోదుచేశారు. గంజాయి సరఫరా ద్వారా అమెజాన్ ఇప్పటివరకు సుమారు రు. 66 లక్షల కమీషన్ అందుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే విషయమై అమెజాన్ సంస్ధ స్పందిస్తు తమ ద్వారా గంజాయి సరఫరా జరిగిన విషయంపై అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధిత వస్తువులు తమ ద్వారా ఎలా సరఫరా అయ్యిందనే విషయంపై విచారణలో దృష్టిపెట్టినట్లు చెప్పింది.
ఏదేమైనా వ్యాపారస్తులు ఎప్పటికప్పుడు గంజాయి సరఫరాకు కొత్త మార్గాలను కనుక్కుంటున్న విషయం బయటపడింది. ఇపుడు బయటపడింది అమెజాన్ ద్వారా జరుగుతున్న సరఫరా మాత్రమే. అయితే బయటపడకుండానే మిగిలిన ఈ కామర్స్ సంస్దల ద్వారా గంజాయి ఇంకెంత స్ధాయిలో సరఫరా అవుతోందో ఎవరికీ తెలీదు. మొత్తానికి డ్రై స్టీవియా ఆకులను వ్యాపారస్తులు ఎంత చక్కగా వినియోగించుకుంటున్నారో బయటపడింది.
This post was last modified on November 16, 2021 1:51 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…