Trends

ఫేస్ బుక్ పై రూ.515 కోట్ల భారీ ఫైన్.. ఏమిటంత పెద్ద తప్పు?

సామాజిక మాధ్యమాల్లో తిరుగులేనిది ఉన్న ఫేస్ బుక్ కు భారీ షాకిచ్చింది బ్రిటన్. తాజాగా ఎఫ్ బీకి రూ.515 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అంత భారీ మొత్తంలో జరిమానా ఎందుకు వేశారు? దీనికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ ఈ భారీ ఫైన్ ను వేసింది. తాము అడిగిన వివరాల్ని ఇవ్వటంలో ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కంపెనీ ఏదైనా కానీ చట్టాలకు లోబడి పని చేయాలని స్పష్టం చేసింది. అందుకు తప్పుగా వ్యవహరిస్తే ఇదే తరహాలో చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఇంతకీ ఫేస్ బుక్ చేసిన తప్పేమిటంటే.. గత ఏడాది యానిమేటెడ్ కంపెనీ ‘‘జిఫీ’’ని కొనుగోలు చేసింది. దీంతో.. సోషల్ మీడియాలో పోటీని ఫేస్ బుక్ నియంత్రిస్తోందన్న ఆరోపణ బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది.

తమకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని పలుమార్లు కోరింది. అయితే.. ఫేస్ బుక్ మాత్రం ఆ వినతులను లైట్ తీసుకుంది. సమాచారాన్ని ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఫేస్ బుక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానాను విధించారు. తాము అడిగిన వివరాల్ని ఇచ్చే విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేసినట్లుగా పేర్కొంది.

భారీ జరిమానాను విధించిన నేపథ్యంలో ఫేస్ బుక్ స్పందించింది. తామీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. సీఎంఏ నిర్ణయాన్ని సమీక్షించి తదుపరి ఉన్న అవకాశాలు ఏమిటన్నది పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. వివరాలు అడిగిన వెంటనే తగిన సమాచారాన్ని ఇచ్చి ఉంటే సరిపోయేదానికి.. ఈ భారీ జరిమానా పడిన తర్వాత కానీ రియాక్టు కాకపోవటం చూస్తే.. ఫేస్ బుక్ కు ఆ మాత్రం శాస్తి జరగాలని ఫీలయ్యే వారు లేకపోలేదు. ఫేస్ బుక్ వాదనకు బ్రిటన్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on October 21, 2021 4:18 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

46 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

1 hour ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

1 hour ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago