Trends

ఫేస్ బుక్ పై రూ.515 కోట్ల భారీ ఫైన్.. ఏమిటంత పెద్ద తప్పు?

సామాజిక మాధ్యమాల్లో తిరుగులేనిది ఉన్న ఫేస్ బుక్ కు భారీ షాకిచ్చింది బ్రిటన్. తాజాగా ఎఫ్ బీకి రూ.515 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అంత భారీ మొత్తంలో జరిమానా ఎందుకు వేశారు? దీనికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ ఈ భారీ ఫైన్ ను వేసింది. తాము అడిగిన వివరాల్ని ఇవ్వటంలో ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కంపెనీ ఏదైనా కానీ చట్టాలకు లోబడి పని చేయాలని స్పష్టం చేసింది. అందుకు తప్పుగా వ్యవహరిస్తే ఇదే తరహాలో చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఇంతకీ ఫేస్ బుక్ చేసిన తప్పేమిటంటే.. గత ఏడాది యానిమేటెడ్ కంపెనీ ‘‘జిఫీ’’ని కొనుగోలు చేసింది. దీంతో.. సోషల్ మీడియాలో పోటీని ఫేస్ బుక్ నియంత్రిస్తోందన్న ఆరోపణ బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది.

తమకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని పలుమార్లు కోరింది. అయితే.. ఫేస్ బుక్ మాత్రం ఆ వినతులను లైట్ తీసుకుంది. సమాచారాన్ని ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఫేస్ బుక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానాను విధించారు. తాము అడిగిన వివరాల్ని ఇచ్చే విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేసినట్లుగా పేర్కొంది.

భారీ జరిమానాను విధించిన నేపథ్యంలో ఫేస్ బుక్ స్పందించింది. తామీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. సీఎంఏ నిర్ణయాన్ని సమీక్షించి తదుపరి ఉన్న అవకాశాలు ఏమిటన్నది పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. వివరాలు అడిగిన వెంటనే తగిన సమాచారాన్ని ఇచ్చి ఉంటే సరిపోయేదానికి.. ఈ భారీ జరిమానా పడిన తర్వాత కానీ రియాక్టు కాకపోవటం చూస్తే.. ఫేస్ బుక్ కు ఆ మాత్రం శాస్తి జరగాలని ఫీలయ్యే వారు లేకపోలేదు. ఫేస్ బుక్ వాదనకు బ్రిటన్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on October 21, 2021 4:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: Facebook

Recent Posts

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

35 minutes ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

2 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

4 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

4 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

7 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

9 hours ago