సామాజిక మాధ్యమాల్లో తిరుగులేనిది ఉన్న ఫేస్ బుక్ కు భారీ షాకిచ్చింది బ్రిటన్. తాజాగా ఎఫ్ బీకి రూ.515 కోట్ల భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకూ అంత భారీ మొత్తంలో జరిమానా ఎందుకు వేశారు? దీనికి కారణం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ ఈ భారీ ఫైన్ ను వేసింది. తాము అడిగిన వివరాల్ని ఇవ్వటంలో ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ప్రతిఫలంగా ఈ భారీ మొత్తాన్ని చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
కంపెనీ ఏదైనా కానీ చట్టాలకు లోబడి పని చేయాలని స్పష్టం చేసింది. అందుకు తప్పుగా వ్యవహరిస్తే ఇదే తరహాలో చర్యలు ఉంటాయని వెల్లడించింది. ఇంతకీ ఫేస్ బుక్ చేసిన తప్పేమిటంటే.. గత ఏడాది యానిమేటెడ్ కంపెనీ ‘‘జిఫీ’’ని కొనుగోలు చేసింది. దీంతో.. సోషల్ మీడియాలో పోటీని ఫేస్ బుక్ నియంత్రిస్తోందన్న ఆరోపణ బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ విచారణ చేపట్టింది.
తమకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని పలుమార్లు కోరింది. అయితే.. ఫేస్ బుక్ మాత్రం ఆ వినతులను లైట్ తీసుకుంది. సమాచారాన్ని ఇవ్వకుండా మొండిగా వ్యవహరిస్తున్న ఫేస్ బుక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భారీ జరిమానాను విధించారు. తాము అడిగిన వివరాల్ని ఇచ్చే విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేసినట్లుగా పేర్కొంది.
భారీ జరిమానాను విధించిన నేపథ్యంలో ఫేస్ బుక్ స్పందించింది. తామీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. సీఎంఏ నిర్ణయాన్ని సమీక్షించి తదుపరి ఉన్న అవకాశాలు ఏమిటన్నది పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. వివరాలు అడిగిన వెంటనే తగిన సమాచారాన్ని ఇచ్చి ఉంటే సరిపోయేదానికి.. ఈ భారీ జరిమానా పడిన తర్వాత కానీ రియాక్టు కాకపోవటం చూస్తే.. ఫేస్ బుక్ కు ఆ మాత్రం శాస్తి జరగాలని ఫీలయ్యే వారు లేకపోలేదు. ఫేస్ బుక్ వాదనకు బ్రిటన్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
This post was last modified on October 21, 2021 4:18 pm
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…
ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని…
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…