టోక్యో పారా ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత మహిళా షూటర్ అవనీ లేఖరా మరోసారి అదరగొట్టారు.
ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అవని లేఖరా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ సోమవారం షూటింగ్ విభాగంలో అవని లేఖరా బంగారు పతకం సాధించడం తెలిసిందే. అయితే, పారాలింపిక్స్లో ఓ భారత మహిళ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సోమవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్లో అవని లేఖరా బంగారు పతకం గెలిచి పారాలింపిక్స్లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పారు.
తాజాగా 50 మీటర్ల విభాగంలో కాంస్యం నెగ్గడం ద్వారా ఈ పారాలింపిక్స్ ద్వారా జైపూర్కు చెందిన అవని లేఖరా రెండు రికార్డులు తన పేరిట లిఖించుకున్నారు. ఇలా ఒకే ఒలంపిక్స్ లో.. రెండు పతకాలను సాధించి.. అరుదైన ఘనతను అవనీ సాధించారు. దీంతో.. ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
This post was last modified on September 3, 2021 12:12 pm
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో…
న్యాచురల్ స్టార్ నాని డిమాండ్ మాములుగా లేదు. ఊర మాస్ దసరా చేసినా, ఎమోషనల్ హాయ్ నాన్నగా వచ్చినా హిట్టుకు…