కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో కొన్ని దేశాలు టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్, రష్యా దేశాలతో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పోటీపడుతోంది. అంతా బాగానే ఉంది కానీ చైనా ఉత్పత్తి చేసిన టీకాలను వేసుకున్న వాళ్ళల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ వస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది.
నిజానికి టీకా వేసుకున్నంత మాత్రాన కరోనా సోకదని ఏమిలేదు. అయితే తీవ్రత బాగా తగ్గిపోతుందని మాత్రమే నిపుణులు చెబుతున్నారు. రష్యా తయారీ టీకా స్పుత్నిక్, భారత్ తయారీ కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్, అమెరికా తయారీ ఫైజర్, మోడెర్నా టీకాలు వేసుకున్న వాళ్ళకు కూడా కరోనా సోకినా వాళ్ళపై దాని ప్రభావం నామమాత్రంగానే ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అదే చైనా తయారుచేసిన టీకాలు వేసుకున్న వాళ్ళలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పనితీరు, నాణ్యత తదితర అంశాల్లో అనుమానం కారణంగానే చైనా ఉత్పత్తి చేసిన సైనోఫార్మ్, సైనో వాక్ టీకాలు కొనటానికి చాలా దేశాలు వెనకాడాయి. అయితే మంగోలియా, చిలీ, సెషల్స్, బహ్రెయిన్ లాంటి 90 దేశాలు మాత్రం అవసరార్ధం చైనా టీకాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయట. తమ దేశాల్లో చైనా టీకాలతోనే వ్యాక్సినేషన్ ప్రోగ్రాములను నిర్వహిస్తున్నాయి. అయితే టీకాలు వేసుకున్న వాళ్ళల్లో కూడా కరోనా వైరస్ తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపుతోందని పై దేశాల్లోని వైద్య నిపుణులు, ఆసుపత్రుల్లో ఆసుపత్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.
అంటే చైనా టీకాలు వేసుకున్నా ఎలాంటి ఉపయోగం కబడటం లేదని పై దేశాల్లో నిర్వహించిన అద్యయనంలో స్పష్టమవుతోంది. దీంతో పై దేశాల్లోని అధ్యయనం ఫలితాలు చూసిన తర్వాత ఇప్పటికే టీకాల కోసం చైనాకు ఆర్డర్లు ఇచ్చిన దేశాలు వాటిని రద్దు చేసుకోవటానికి రెడీ అయిపోతున్నట్లు సమాచారం. మొత్తానికి టీకాల ఉత్పత్తికి సంబంధించి చైనా టీకాల మీద మాత్రమే నెగిటివ్ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి దీనిపై డ్రాగన్ ఏమంటుందో చూడాలి.
This post was last modified on June 24, 2021 2:06 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…