Trends

చైనా వ్యాక్సిన్ మరీ ఇంత అన్యాయమా ?

కరోనా వైరస్ ను ఎదుర్కోవటంలో కొన్ని దేశాలు టీకాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా, ఇండియా, ఇంగ్లాండ్, రష్యా దేశాలతో పాటు చైనా కూడా వ్యాక్సిన్ ఉత్పత్తిలో పోటీపడుతోంది. అంతా బాగానే ఉంది కానీ చైనా ఉత్పత్తి చేసిన టీకాలను వేసుకున్న వాళ్ళల్లో కరోనా వైరస్ మహమ్మారి మళ్ళీ వస్తోందనే ప్రచారం పెరిగిపోతోంది.

నిజానికి టీకా వేసుకున్నంత మాత్రాన కరోనా సోకదని ఏమిలేదు. అయితే తీవ్రత బాగా తగ్గిపోతుందని మాత్రమే నిపుణులు చెబుతున్నారు. రష్యా తయారీ టీకా స్పుత్నిక్, భారత్ తయారీ కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్, అమెరికా తయారీ ఫైజర్, మోడెర్నా టీకాలు వేసుకున్న వాళ్ళకు కూడా కరోనా సోకినా వాళ్ళపై దాని ప్రభావం నామమాత్రంగానే ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అదే చైనా తయారుచేసిన టీకాలు వేసుకున్న వాళ్ళలో కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

పనితీరు, నాణ్యత తదితర అంశాల్లో అనుమానం కారణంగానే చైనా ఉత్పత్తి చేసిన సైనోఫార్మ్, సైనో వాక్ టీకాలు కొనటానికి చాలా దేశాలు వెనకాడాయి. అయితే మంగోలియా, చిలీ, సెషల్స్, బహ్రెయిన్ లాంటి 90 దేశాలు మాత్రం అవసరార్ధం చైనా టీకాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయట. తమ దేశాల్లో చైనా టీకాలతోనే వ్యాక్సినేషన్ ప్రోగ్రాములను నిర్వహిస్తున్నాయి. అయితే టీకాలు వేసుకున్న వాళ్ళల్లో కూడా కరోనా వైరస్ తన ప్రభావాన్ని తీవ్రంగానే చూపుతోందని పై దేశాల్లోని వైద్య నిపుణులు, ఆసుపత్రుల్లో ఆసుపత్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

అంటే చైనా టీకాలు వేసుకున్నా ఎలాంటి ఉపయోగం కబడటం లేదని పై దేశాల్లో నిర్వహించిన అద్యయనంలో స్పష్టమవుతోంది. దీంతో పై దేశాల్లోని అధ్యయనం ఫలితాలు చూసిన తర్వాత ఇప్పటికే టీకాల కోసం చైనాకు ఆర్డర్లు ఇచ్చిన దేశాలు వాటిని రద్దు చేసుకోవటానికి రెడీ అయిపోతున్నట్లు సమాచారం. మొత్తానికి టీకాల ఉత్పత్తికి సంబంధించి చైనా టీకాల మీద మాత్రమే నెగిటివ్ ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి దీనిపై డ్రాగన్ ఏమంటుందో చూడాలి.

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

3 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

3 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

3 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

3 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

3 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

4 hours ago