గడిచిన మూడు రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో.. చానళ్లలో.. యూట్యూబ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు పబ్జీ కఫుల్. తమిళనాడుకు చెందిన ఈ యూత్ జంట చేసే మోసాలు.. వారి ఆరాచకాల్ని వింటే నోరెళ్లబెట్టాల్సిందే. పబ్జి గేమ్ ఆడుతూ.. మహిళలు.. చిన్నారుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం.. దానికి సంబంధించిన ఆడియోల్ని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి కోట్లాదిరూపాయిల్ని కొల్లగొట్టే ఈ కఫుల్ ను ఈ మధ్యనే పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
పోలీసుల విచారణలో సదరు దంపతులు చెప్పిన మాటల ఆధారంగా సంచలన అంశాల్ని గుర్తించారు. పబ్జీ మదన్.. ఆయన సతీమణి కృత్తిక బ్యాంకు ఖాతాల్లో రూ.4 కోట్ల మేర నగదు నిల్వల్ని గుర్తించారు. దీంతో.. విస్మయానికి గురైన పోలీసులు.. వీరి గురించి మరింత ఫోకస్ పెట్టారు. దీంతో.. వీరికి సంబంధించిన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
అడ్డదిడ్డంగా వ్యవహరించిన ఈ జంట గడిచిన మూడేళ్లలో రూ.75 కోట్ల మొత్తాన్ని సంపాదించినట్లు గుర్తించారు. తామింత భారీగా ఆదాయాన్ని కళ్ల జూస్తున్నా.. అందులో నుంచి పన్ను మొత్తాన్ని చెల్లించే విషయంలోనూ వారు తప్పులు చేసిట్లుగా గుర్తించారు. దీంతో.. వీరు మరే ఇతర కార్యకలాపాలు చేసేవారన్న విషయాల్ని తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఆన్ లైన్ లో బూతు ఆడియోలు.. వీడియోపోస్టులకు ఇంత భారీగా సంపాదించిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయంపై మరింత లోతుగా విచారిస్తున్నారు.
This post was last modified on June 22, 2021 11:29 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…