గడిచిన మూడు రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో.. చానళ్లలో.. యూట్యూబ్ లోనూ హాట్ టాపిక్ గా మారారు పబ్జీ కఫుల్. తమిళనాడుకు చెందిన ఈ యూత్ జంట చేసే మోసాలు.. వారి ఆరాచకాల్ని వింటే నోరెళ్లబెట్టాల్సిందే. పబ్జి గేమ్ ఆడుతూ.. మహిళలు.. చిన్నారుల వద్ద అసభ్యకరంగా మాట్లాడటం.. దానికి సంబంధించిన ఆడియోల్ని యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసి కోట్లాదిరూపాయిల్ని కొల్లగొట్టే ఈ కఫుల్ ను ఈ మధ్యనే పోలీసులు అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
పోలీసుల విచారణలో సదరు దంపతులు చెప్పిన మాటల ఆధారంగా సంచలన అంశాల్ని గుర్తించారు. పబ్జీ మదన్.. ఆయన సతీమణి కృత్తిక బ్యాంకు ఖాతాల్లో రూ.4 కోట్ల మేర నగదు నిల్వల్ని గుర్తించారు. దీంతో.. విస్మయానికి గురైన పోలీసులు.. వీరి గురించి మరింత ఫోకస్ పెట్టారు. దీంతో.. వీరికి సంబంధించిన సంచలన నిజాలు బయటకు వచ్చాయి.
అడ్డదిడ్డంగా వ్యవహరించిన ఈ జంట గడిచిన మూడేళ్లలో రూ.75 కోట్ల మొత్తాన్ని సంపాదించినట్లు గుర్తించారు. తామింత భారీగా ఆదాయాన్ని కళ్ల జూస్తున్నా.. అందులో నుంచి పన్ను మొత్తాన్ని చెల్లించే విషయంలోనూ వారు తప్పులు చేసిట్లుగా గుర్తించారు. దీంతో.. వీరు మరే ఇతర కార్యకలాపాలు చేసేవారన్న విషయాల్ని తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఆన్ లైన్ లో బూతు ఆడియోలు.. వీడియోపోస్టులకు ఇంత భారీగా సంపాదించిన వారి బ్యాక్ గ్రౌండ్ ఏమిటన్న విషయంపై మరింత లోతుగా విచారిస్తున్నారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…