Trends

ఫేక్ వీడియోలు.. ట్విట్టర్ కి హైదరాబాద్ పోలీసుల షాక్

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కి చిక్కులు మొదలయ్యాయి. ఇప్పటికే నూతన ఐటీ నిబంధనలను అమలు చేయని కారణంగా భారత్ లో ఉన్న చట్టపరమైన రక్షణ( మధ్యవర్తి హోదా)ను ట్విట్టర్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వరసగా ట్విట్టర్ పై కేసులు నమోదౌతున్నాయి.

నిన్నటికి నిన్న ఉత్తరప్రదేశ్ లో ట్విట్టర్ పై తొలి కేసు నమోదు కాగా.. తాజాగా రెండో కేసు నమోదైంది. ఈ రెండు కేసు హైదరాబాద్ పోలీసులు పెట్టడం గమనార్హం. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నందుకుగాను ఈ కేసును నమోదు చేశారు. అంతేకాక, కేసు పెట్టి.. ట్విటర్ ఇండియా యాజమాన్యానికి పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు.

ఫేక్ వీడియోపై వస్తున్న అనుచిత కామెంట్లకు ట్విటర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. నటి మీరా చోప్రా చేసిన ఫిర్యాదుపై కూడా ట్విటర్ వెంటనే స్పందించాలని నోటీసులో కోరారు. నోటీసుతోపాటు ట్విటర్‌ మరో ఇద్దరి వివరాలు కావాలంటూ కోరారు. పోలీసులను కించపరిచేలా ఓ వీడియోను పోస్ట్ చేసిన ఇద్దరూ యువకుల వివరాలను కూడా తమకు అందించాలని పోలీసులు ట్విటర్‌కు రాసిన లేఖలో కోరారు.

అయితే, కేంద్ర ప్రభుత్వానికి, ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగాను ట్విటర్‌కు ఇప్పటివరకూ లభిస్తున్న జవాబుదారీతనం నుంచి మినహాయింపును కోల్పోయింది.

This post was last modified on June 17, 2021 5:39 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

11 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

12 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

15 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

16 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

16 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

17 hours ago