ఫ్లాట్ ఫామ్ టికెట్ లేకుండా రైల్వే స్టేషన్లో అడుగు పెట్టడానికి వీలుండదు. అలాగే ప్రయాణ టికెట్ లేకుండా రైల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. మరి ఫ్లాట్ ఫామ్ టికెట్ మాత్రమే తీసుకుని రైలెక్కేస్తే..? టికెట్ కలెక్టర్ పట్టుకుని ఫైన్ వేయడం ఖాయం. కానీ ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. ఫ్లాట్ ఫామ్ టికెట్తోనే రైలు ఎక్కేయొచ్చు. కానీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మాత్రం టీసీ దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని.. అలాగే అత్యవసర స్థితిలో ప్రయాణాలు చేసేవాళ్లకు ఇబ్బంది రాకుండా ఈ కొత్త వెసులుబాటును రైల్వే శాఖ అందిస్తోంది.
మామూలుగా ముందు టికెట్ రిజర్వ్ చేసుకున్న వాళ్లకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు కానీ.. అప్పటికప్పుడు రైల్వే స్టేషన్కు వచ్చి టికెట్ కొనాలనుకునే వాళ్లకు సమస్యలు తలెత్తుతుంటాయి. భారీ క్యూలైన్లు ఉంటే టికెట్ తీసుకోవడం కష్టమవుతుంది. అలాంటపుడు టికెట్ వెండింగ్ మిషన్లో ఈజీగా ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కేయొచ్చు. తర్వాత టీసీ దగ్గర టికెట్ తీసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రయాణికులు ఫ్లాట్ఫామ్ టికెట్తో ట్రైన్ ఎక్కాక గార్డ్ పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అలా ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందో వివరించాలి. ఒకవేళ గార్డ్ అందుబాటులో లేకపోతే.. రైల్వే స్టాఫ్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. గార్డ్ సర్టిఫికేట్ తర్వాత టీటీఈ నుంచి ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఐతే ఎవరైనా ప్యాసింజర్ రైలు ఎక్కాక కూడా టికెట్ తీసుకోకుండా కావాలనే ఫ్లాట్ఫామ్ టికెట్తో జర్నీ చేస్తున్నాడని టీటీకి తెలిస్తే మాత్రం.. ఏకంగా రూ.1000కి పైగా జరిమానా విధించే అవకాశముంది. అలాగే.. ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండించటికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు.
This post was last modified on June 17, 2021 3:47 pm
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…