Trends

ఫ్లాట్ ఫామ్ టికెట్‌తో రైలు ఎక్కేయొచ్చు

ఫ్లాట్ ఫామ్ టికెట్ లేకుండా రైల్వే స్టేషన్లో అడుగు పెట్టడానికి వీలుండదు. అలాగే ప్రయాణ టికెట్ లేకుండా రైల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. మరి ఫ్లాట్ ఫామ్ టికెట్ మాత్రమే తీసుకుని రైలెక్కేస్తే..? టికెట్ కలెక్టర్ పట్టుకుని ఫైన్ వేయడం ఖాయం. కానీ ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. ఫ్లాట్ ఫామ్ టికెట్‌తోనే రైలు ఎక్కేయొచ్చు. కానీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మాత్రం టీసీ దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని.. అలాగే అత్యవసర స్థితిలో ప్రయాణాలు చేసేవాళ్లకు ఇబ్బంది రాకుండా ఈ కొత్త వెసులుబాటును రైల్వే శాఖ అందిస్తోంది.

మామూలుగా ముందు టికెట్ రిజర్వ్ చేసుకున్న వాళ్లకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు కానీ.. అప్పటికప్పుడు రైల్వే స్టేషన్‌కు వచ్చి టికెట్ కొనాలనుకునే వాళ్లకు సమస్యలు తలెత్తుతుంటాయి. భారీ క్యూలైన్లు ఉంటే టికెట్ తీసుకోవడం కష్టమవుతుంది. అలాంటపుడు టికెట్ వెండింగ్ మిషన్లో ఈజీగా ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కేయొచ్చు. తర్వాత టీసీ దగ్గర టికెట్ తీసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రయాణికులు ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తో ట్రైన్ ఎక్కాక గార్డ్ పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అలా ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందో వివరించాలి. ఒకవేళ గార్డ్ అందుబాటులో లేకపోతే.. రైల్వే స్టాఫ్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. గార్డ్ సర్టిఫికేట్ తర్వాత టీటీఈ నుంచి ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఐతే ఎవరైనా ప్యాసింజర్ రైలు ఎక్కాక కూడా టికెట్ తీసుకోకుండా కావాలనే ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తో జర్నీ చేస్తున్నాడని టీటీకి తెలిస్తే మాత్రం.. ఏకంగా రూ.1000కి పైగా జరిమానా విధించే అవకాశముంది. అలాగే.. ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండించటికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు.

This post was last modified on June 17, 2021 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

53 minutes ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

3 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

4 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

4 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

6 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

6 hours ago