Trends

ఫ్లాట్ ఫామ్ టికెట్‌తో రైలు ఎక్కేయొచ్చు

ఫ్లాట్ ఫామ్ టికెట్ లేకుండా రైల్వే స్టేషన్లో అడుగు పెట్టడానికి వీలుండదు. అలాగే ప్రయాణ టికెట్ లేకుండా రైల్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు. మరి ఫ్లాట్ ఫామ్ టికెట్ మాత్రమే తీసుకుని రైలెక్కేస్తే..? టికెట్ కలెక్టర్ పట్టుకుని ఫైన్ వేయడం ఖాయం. కానీ ఇకపై ఈ ఇబ్బంది ఉండదు. ఫ్లాట్ ఫామ్ టికెట్‌తోనే రైలు ఎక్కేయొచ్చు. కానీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే మాత్రం టీసీ దగ్గర టికెట్ తీసుకోవాల్సిందే. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని.. అలాగే అత్యవసర స్థితిలో ప్రయాణాలు చేసేవాళ్లకు ఇబ్బంది రాకుండా ఈ కొత్త వెసులుబాటును రైల్వే శాఖ అందిస్తోంది.

మామూలుగా ముందు టికెట్ రిజర్వ్ చేసుకున్న వాళ్లకు ఎప్పుడూ ఇబ్బంది ఉండదు కానీ.. అప్పటికప్పుడు రైల్వే స్టేషన్‌కు వచ్చి టికెట్ కొనాలనుకునే వాళ్లకు సమస్యలు తలెత్తుతుంటాయి. భారీ క్యూలైన్లు ఉంటే టికెట్ తీసుకోవడం కష్టమవుతుంది. అలాంటపుడు టికెట్ వెండింగ్ మిషన్లో ఈజీగా ఫ్లాట్ ఫామ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కేయొచ్చు. తర్వాత టీసీ దగ్గర టికెట్ తీసుకోవచ్చు. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

ప్రయాణికులు ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తో ట్రైన్ ఎక్కాక గార్డ్ పర్మిషన్ కచ్చితంగా తీసుకోవాలి. ఏ పరిస్థితుల్లో అలా ట్రైన్ ఎక్కాల్సి వచ్చిందో వివరించాలి. ఒకవేళ గార్డ్ అందుబాటులో లేకపోతే.. రైల్వే స్టాఫ్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు. గార్డ్ సర్టిఫికేట్ తర్వాత టీటీఈ నుంచి ట్రైన్ టికెట్ పొందవచ్చు. ఐతే ఎవరైనా ప్యాసింజర్ రైలు ఎక్కాక కూడా టికెట్ తీసుకోకుండా కావాలనే ఫ్లాట్‌ఫామ్ టికెట్‌తో జర్నీ చేస్తున్నాడని టీటీకి తెలిస్తే మాత్రం.. ఏకంగా రూ.1000కి పైగా జరిమానా విధించే అవకాశముంది. అలాగే.. ఆరు నెలల జైలు శిక్ష కూడా పడొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండించటికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేయకూడదు.

This post was last modified on June 17, 2021 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

47 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago