సీబీఐ.. భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఆ సంస్థకు సంబంధించిన దర్యాప్తు ఓ రేంజ్లో వార్తల్లో నిలుస్తుంది. అయితే, ఇప్పుడు సీబీఐ వార్తల్లో నిలిచింది. ఎందుకంటే, ఆ సంస్థ కొత్త బాస్ ఆర్డర్తో. సీబీఐ డైరెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సుబోధ్ కుమార్ సీబీఐలో ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూస్ వేసుకోకూడదు. ఫార్మల్ వేర్స్, ఫార్మల్ షూస్ మాత్రమే ధరించాలి అంటూ సంచలన ఆదేశాలు వెలువరించారు.
సీబీఐ కొత్త బాస్ ఆర్డర్ ప్రకారం, సీబీఐలో పనిచేసే ఉద్యోగులు జీన్స్, టీషర్ట్స్ ధరించకూడదు. ఇందులో ఆడా, మగ ఎవరికీ మినహాయింపు లేదు. ఇక పురుషులు అయితే, గడ్డాలు, మీసాలు కూడా పెంచుకోకుండా క్లీన్ షేవ్ చేసుకోవాలి. షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్స్, ఫార్మల్ షూస్ మాత్రమే వేసుకోవాలి. మహిళా సీబీఐ అధికారులు చీరలు, షూట్లు, ఫార్మల్ షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు మాత్రమే ధరించాలని సీబీఐ నూతన బాస్ ఆదేశించారు. అయితే, ఈ ఆదేశాల వెనుక పెద్ద ఎత్తున కసరత్తు జరిగినట్లు సమాచారం.
సీబీఐలో డ్రెస్ కోడ్ ఎప్పటి నుంచో అమల్లో ఉంది. కొంత కాలం క్రిందటి వరకు సీబీఐ అధికారులంతా ఫార్మల్ దుస్తుల్లోనే కనిపించేవారు. కానీ ఇటీవల కొందరు క్యాజువల్స్ ధరించి విధులకు హాజరవుతున్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన డైరెక్టర్ సుబోధ్ కుమార్ డ్రెస్ కోడ్ అంశంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. కొత్తగా ఫార్మల్స్ డ్రెస్ కోడ్ అమల్లోకి తెస్తున్నట్లు ఆయన ప్రకటించగా కనీసం కాలర్ టీషర్ట్స్ ధరించే అనుమతి ఇవ్వాలని కొందరు కోరినట్లు తెలుస్తోంది. అయితే, కేవలం ఫార్మల్స్ మాత్రమే ధరించేలా డైరెక్టర్ డ్రెస్ కోడ్ అమల్లోకి తెచ్చినట్లుగా సమాచారం. తాజా ఆదేశాలు వెంటనే అమల్లోకి రానుండగా ఇకపై సీబీఐ అధికారులంతా ఈ ఆదేశాలను తప్పక పాటించాలని డైరెక్టర్ సుబోధ్ కుమార్ స్పష్టం చేశారు. మరి సీబీఐలోని యువ అధికారులు ఈ ఆదేశాలను ఎలా స్వీకరిస్తారో.
This post was last modified on June 4, 2021 10:22 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…