తనకు తోడ బుట్టిన చెల్లెలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తనకు పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాల్సిన అన్నలే ఆ బాధ్యతను మరిచిపోయి సొంత చెల్లెలి పై అత్యాచారానికి పాల్పడిన ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సొంత చెల్లెలినే శారీరకంగా లోబర్చుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ నరకం చూపిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మణుగూరుకు చెందిన ఓ వ్యక్తి కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు చిన్నప్పుడే తండ్రి వదిలి వెళ్లిపోవడంతో తల్లి, చెల్లి బాధ్యత తానే చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన చెల్లి పై కన్నువేసిన అన్న శారీరకంగా తనను లోబర్చుకొని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తనపై తన అన్న చేస్తున్న అఘాయిత్యాన్ని తన తల్లికి చెప్పిన పట్టించుకోకపోవడంతో తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళింది.
పెద్దమ్మ ఇంటికి వెళ్లినప్పటికీ ఆమెకు ఈ నరకం తప్పలేదు. అక్కడా ఆమె కొడుకు నరకం చూపిస్తున్నాడు.ఈ విషయాన్ని తల్లికి, పెద్దమ్మకు చెప్పిన పట్టించుకోకపోవడంతో ఆమె తన స్నేహితులకు, ఉపాధ్యాయులకు చెప్పి పోలీసులను ఆశ్రయించి అసలు విషయం బయట పెట్టింది. ఈ విషయం బయట చెబితే చంపుతామని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలియజేసింది. ఈ క్రమంలోనే ఆమె తల్లి, పెద్దమ్మ, ఆమె భర్త కుమారుల పై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…