వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక అనుచరులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిన ముని తుకారాం, మరో కీలక అనుచరుడు మాధవరెడ్డిని తిరుపతి జిల్లా మదనపల్లెలో అరెస్టు చేశారు. అనంతరం వారిని విజయవాడకు తరలించారు.
ఏంటి కేసు?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూలై 21న మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కీలకమైన ఫైళ్లు తగలబడ్డాయి. దీనిపై అనుమానాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్గా తీసుకుంది. అప్పటి డీజీపీ ద్వారకాతిరుమల రావు స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా ఘటన స్థలాన్ని సందర్శించారు.
వైసీపీ హయాంలో మదనపల్లె ప్రాంతంలోని డీకేటీ, అసైన్డ్ భూములను పరిధి నుంచి తొలగించి పెద్దిరెడ్డి తన బినామీలకు కట్టబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారం బయటపడే అవకాశం ఉండటంతోనే అగ్నిప్రమాదం సృష్టించారని అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటనపై చర్యగా రెవెన్యూ అధికారులు సహా డిప్యూటీ కలెక్టర్ను సస్పెండ్ చేశారు.
ఈ కేసులో పెద్దిరెడ్డి సహా ఆయన కుటుంబాన్ని పలుమార్లు విచారించారు. పెద్దిరెడ్డి అనుచరులైన ముని తుకారాం, మాధవరెడ్డిపై ఏ3, ఏ4 కింద కేసులు నమోదు అయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా విఫలమయ్యారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
This post was last modified on March 19, 2026 11:02 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…