తియ్యగా మాట్లాడతారు. ఇష్టాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తారు. అంతిమంగా తిరుగులేని వలపు వల విసురుతారు. అప్పటికే మైకం కమ్మి.. విచక్షణ కోల్పోతారు. అంతిమంగా వల విసిరిన వారికి చిక్కి విలవిలలాడతారు. అయినప్పటికి వేధింపులకు గురి చేసే వారి దెబ్బకు హడలిపోతూ వారు కోరుకున్న డబ్బును అప్పు చేసైనా ఇచ్చి.. ఆ ఉచ్చులో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వారి చేతికి చిక్కిన ఒక విద్యార్థి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. తాను ఒంటరి మహిళనని.. ఛాట్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి.. తన ఫోన్ నెంబర్ ను షేర్ చేసింది. దానికి స్పందించిన యువకుడు.. ఫోన్ చేయగా.. కవ్విస్తూ మాట్లాడింది. అనంతరం చాట్ చేస్తూ.. వీడియో కాల్ చేయాలని చెప్పింది.
నగ్నంగా కనిపిస్తూ చాటి చేస్తూ.. తాను నగ్నంగా చూడాలనుకుంటున్నట్లుగా తన ఇష్టాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మైకంలో పడిన ఆ యువకుడు వెనుకా ముందు చూసుకోకుండా.. నగ్నంగా తయారై చాటింగ్ చేశాడు. ఆ వెంటనే.. ఆ యువకుడి వీడియోను పంపిన సదరు యువతి.. డబ్బుల్ని డిమాండ్ చేసింది. దీంతో.. షాక్ తిన్న యువకుడు అప్పు చేసి రూ.24వేలు చెల్లించాడు.
అయినప్పటికీ ఆ ముఠా వేధింపులు తగ్గలేదు. తాము కోరిన డబ్బులు ఇవ్వకుంటే.. వీడియోల్ని యూట్యూబ్ లో పెడతామంటూ ముఠా సభ్యులతో కలిసి బెదిరించింది. దీంతో తట్టుకోలేని ఆ కుర్రాడు హైదరాబాద్ విడిచి పెట్టి ఊరికి వెళ్లాడు. పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని తొలుత ప్రైవేటు ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాజాగా ఆ యువకుడు మరణించాడు. వలపు వల విసిరిన వారు.. అడ్డంగా బుక్ చేయటమే కాదు.. నిలువు దోపిడీ చేస్తారన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.
This post was last modified on April 1, 2021 9:55 am
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…