తియ్యగా మాట్లాడతారు. ఇష్టాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తారు. అంతిమంగా తిరుగులేని వలపు వల విసురుతారు. అప్పటికే మైకం కమ్మి.. విచక్షణ కోల్పోతారు. అంతిమంగా వల విసిరిన వారికి చిక్కి విలవిలలాడతారు. అయినప్పటికి వేధింపులకు గురి చేసే వారి దెబ్బకు హడలిపోతూ వారు కోరుకున్న డబ్బును అప్పు చేసైనా ఇచ్చి.. ఆ ఉచ్చులో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వారి చేతికి చిక్కిన ఒక విద్యార్థి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. తాను ఒంటరి మహిళనని.. ఛాట్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి.. తన ఫోన్ నెంబర్ ను షేర్ చేసింది. దానికి స్పందించిన యువకుడు.. ఫోన్ చేయగా.. కవ్విస్తూ మాట్లాడింది. అనంతరం చాట్ చేస్తూ.. వీడియో కాల్ చేయాలని చెప్పింది.
నగ్నంగా కనిపిస్తూ చాటి చేస్తూ.. తాను నగ్నంగా చూడాలనుకుంటున్నట్లుగా తన ఇష్టాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మైకంలో పడిన ఆ యువకుడు వెనుకా ముందు చూసుకోకుండా.. నగ్నంగా తయారై చాటింగ్ చేశాడు. ఆ వెంటనే.. ఆ యువకుడి వీడియోను పంపిన సదరు యువతి.. డబ్బుల్ని డిమాండ్ చేసింది. దీంతో.. షాక్ తిన్న యువకుడు అప్పు చేసి రూ.24వేలు చెల్లించాడు.
అయినప్పటికీ ఆ ముఠా వేధింపులు తగ్గలేదు. తాము కోరిన డబ్బులు ఇవ్వకుంటే.. వీడియోల్ని యూట్యూబ్ లో పెడతామంటూ ముఠా సభ్యులతో కలిసి బెదిరించింది. దీంతో తట్టుకోలేని ఆ కుర్రాడు హైదరాబాద్ విడిచి పెట్టి ఊరికి వెళ్లాడు. పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని తొలుత ప్రైవేటు ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాజాగా ఆ యువకుడు మరణించాడు. వలపు వల విసిరిన వారు.. అడ్డంగా బుక్ చేయటమే కాదు.. నిలువు దోపిడీ చేస్తారన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.
This post was last modified on April 1, 2021 9:55 am
రోమ్లో ఉన్నపుడు రోమన్లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…