తియ్యగా మాట్లాడతారు. ఇష్టాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తారు. అంతిమంగా తిరుగులేని వలపు వల విసురుతారు. అప్పటికే మైకం కమ్మి.. విచక్షణ కోల్పోతారు. అంతిమంగా వల విసిరిన వారికి చిక్కి విలవిలలాడతారు. అయినప్పటికి వేధింపులకు గురి చేసే వారి దెబ్బకు హడలిపోతూ వారు కోరుకున్న డబ్బును అప్పు చేసైనా ఇచ్చి.. ఆ ఉచ్చులో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వారి చేతికి చిక్కిన ఒక విద్యార్థి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. తాను ఒంటరి మహిళనని.. ఛాట్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి.. తన ఫోన్ నెంబర్ ను షేర్ చేసింది. దానికి స్పందించిన యువకుడు.. ఫోన్ చేయగా.. కవ్విస్తూ మాట్లాడింది. అనంతరం చాట్ చేస్తూ.. వీడియో కాల్ చేయాలని చెప్పింది.
నగ్నంగా కనిపిస్తూ చాటి చేస్తూ.. తాను నగ్నంగా చూడాలనుకుంటున్నట్లుగా తన ఇష్టాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మైకంలో పడిన ఆ యువకుడు వెనుకా ముందు చూసుకోకుండా.. నగ్నంగా తయారై చాటింగ్ చేశాడు. ఆ వెంటనే.. ఆ యువకుడి వీడియోను పంపిన సదరు యువతి.. డబ్బుల్ని డిమాండ్ చేసింది. దీంతో.. షాక్ తిన్న యువకుడు అప్పు చేసి రూ.24వేలు చెల్లించాడు.
అయినప్పటికీ ఆ ముఠా వేధింపులు తగ్గలేదు. తాము కోరిన డబ్బులు ఇవ్వకుంటే.. వీడియోల్ని యూట్యూబ్ లో పెడతామంటూ ముఠా సభ్యులతో కలిసి బెదిరించింది. దీంతో తట్టుకోలేని ఆ కుర్రాడు హైదరాబాద్ విడిచి పెట్టి ఊరికి వెళ్లాడు. పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని తొలుత ప్రైవేటు ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాజాగా ఆ యువకుడు మరణించాడు. వలపు వల విసిరిన వారు.. అడ్డంగా బుక్ చేయటమే కాదు.. నిలువు దోపిడీ చేస్తారన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.
This post was last modified on April 1, 2021 9:55 am
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…