తియ్యగా మాట్లాడతారు. ఇష్టాన్ని.. ప్రేమను ప్రదర్శిస్తారు. అంతిమంగా తిరుగులేని వలపు వల విసురుతారు. అప్పటికే మైకం కమ్మి.. విచక్షణ కోల్పోతారు. అంతిమంగా వల విసిరిన వారికి చిక్కి విలవిలలాడతారు. అయినప్పటికి వేధింపులకు గురి చేసే వారి దెబ్బకు హడలిపోతూ వారు కోరుకున్న డబ్బును అప్పు చేసైనా ఇచ్చి.. ఆ ఉచ్చులో నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి వారి చేతికి చిక్కిన ఒక విద్యార్థి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హాస్టల్ లో ఉంటూ చదువుతున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. తాను ఒంటరి మహిళనని.. ఛాట్ చేయాలనుకుంటున్నట్లుగా చెప్పి.. తన ఫోన్ నెంబర్ ను షేర్ చేసింది. దానికి స్పందించిన యువకుడు.. ఫోన్ చేయగా.. కవ్విస్తూ మాట్లాడింది. అనంతరం చాట్ చేస్తూ.. వీడియో కాల్ చేయాలని చెప్పింది.
నగ్నంగా కనిపిస్తూ చాటి చేస్తూ.. తాను నగ్నంగా చూడాలనుకుంటున్నట్లుగా తన ఇష్టాన్ని చెప్పింది. అప్పటికే ఆమె మైకంలో పడిన ఆ యువకుడు వెనుకా ముందు చూసుకోకుండా.. నగ్నంగా తయారై చాటింగ్ చేశాడు. ఆ వెంటనే.. ఆ యువకుడి వీడియోను పంపిన సదరు యువతి.. డబ్బుల్ని డిమాండ్ చేసింది. దీంతో.. షాక్ తిన్న యువకుడు అప్పు చేసి రూ.24వేలు చెల్లించాడు.
అయినప్పటికీ ఆ ముఠా వేధింపులు తగ్గలేదు. తాము కోరిన డబ్బులు ఇవ్వకుంటే.. వీడియోల్ని యూట్యూబ్ లో పెడతామంటూ ముఠా సభ్యులతో కలిసి బెదిరించింది. దీంతో తట్టుకోలేని ఆ కుర్రాడు హైదరాబాద్ విడిచి పెట్టి ఊరికి వెళ్లాడు. పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని తొలుత ప్రైవేటు ఆసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. తాజాగా ఆ యువకుడు మరణించాడు. వలపు వల విసిరిన వారు.. అడ్డంగా బుక్ చేయటమే కాదు.. నిలువు దోపిడీ చేస్తారన్న విషయాన్ని అస్సలు మరవకూడదు.
This post was last modified on April 1, 2021 9:55 am
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…