ఐకాన్.. ఎప్పుడో మూడేళ్ల ముందు తెరపైకి వచ్చిన సినిమా. అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా చేస్తున్న సమయంలో ఈ చిత్రం గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. ‘ఎంసీఏ’తో హిట్టు కొట్టిన ఊపులో ఉన్న వేణు శ్రీరామ్తో ఈ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు బన్నీ. నేరుగా టైటిల్తో ఒక పోస్టర్ వదలడంతో బన్నీ తర్వాతి సినిమా ఇదే అనుకున్నారంతా. కానీ దీన్ని కాకుండా ‘అల వైకుంఠపురములో’ను మొదలుపెట్టాడు స్టైలిష్ స్టార్. ఆ తర్వాత ‘పుష్ప’ లైన్లోకి వచ్చింది. ఇది పూర్తయ్యాక కొరటాల శివ సినిమా ఉంది. ఆపై ప్రశాంత్ నీల్ అంటున్నారు.
మరి ‘ఐకాన్’ సంగతేంటన్నదే అర్థం కావడం లేదు. ఈ సినిమా అటకెక్కేసిందా అంటే అలాంటిదేమీ లేదన్న సంకేతాలే వస్తున్నాయి. బన్నీ మిత్రుడు వాసు సైతం ఈ ప్రాజెక్టు ఉంటుందని.. తనకు కుదిరిన సమయంలో ఈ చిత్రం చేస్తాడని అన్నాడు. ఐతే బన్నీకి కుదిరేది ఎప్పుడన్నదే తెలియడం లేదు.
‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన వేణు శ్రీరామ్కు అనుకున్నట్లే మీడియా నుంచి ‘ఐకాన్’ గురించి ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా ఆగిపోలేదని మాత్రం వేణు స్పష్టం చేశాడు. కానీ ఆ సినిమా ఎప్పుడో మొదలవుతుందో తనకు కూడా తెలియదని అనేశాడు. అంతకుమించి ఈ ప్రాజెక్టు గురించి ఏమీ మాట్లాడలేదు. ఇంతకీ ‘వకీల్ సాబ్’ తర్వాత సినిమా ఏంటి అని అడిగితే.. ప్రస్తుతానికి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఏమీ ఆలోచించట్లేదని.. తన దృష్టంతా ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు.
ఇక ‘వకీల్ సాబ్’ కోసం పవన్తో కలిసి పని చేయడం ఒక లైఫ్ టైం మెమొరీ అన్న వేణు.. ఈ సినిమా స్క్రిప్టు ఆషామాషీగా చేయలేదని.. చాలా సమయం పట్టిందని.. నాలుగు వెర్షన్స్ రాస్తే కానీ.. ఇప్పుడు తెరమీద చూడబోతున్నట్లుగా స్క్రిప్టు రాలేదని చెప్పాడు. ఒరిజినల్ కంటెంట్ దెబ్బ తినకుండా దీనికి కొత్త అంశాలు కలిపినట్లు వేణు తెలిపాడు.
This post was last modified on April 1, 2021 8:48 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…