Trends

600 మంది చనిపోయారా ?

మయున్మార్ సైన్యం కాల్పుల్లో ఇప్పటిదాకా సుమారు 600 మందికిపైగా చనిపోయినట్లు అంచనా. మయున్మార్ లోని సైనిక పాలనపై జనాలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్యాన్ని కాలరాచి సైన్యం చేతిలో యావత్ దేశాన్ని గుప్పిట్లో పెట్టుకునేశారు సైన్యాధికారులు. వీరి చెరనుండి పరిపాలనను విడిపించుకునేందుకు దేశంలోని నలుమూలల్లోని జనాలు స్వచ్చంధంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఆందోళనలు తారాస్ధాయికి చేరుకోవటంతో మూడురోజుల క్రితం సైన్యం మొదటిసారి జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అప్పటి కాల్పుల్లో 114 మంది చనిపోయినట్లు లెక్కలు తేల్చారు. మగ, ఆడ తేడాలేకుండా చివరకు చిన్న పిల్లలను కూడా సైన్యం కాల్చిచంపేసింది. దాంతో అంతర్జాతీయ సమాజం+మానవ హక్కుల సంఘాలు గోల మొదలుపెట్టేశాయి. అమెరికాతో సహా చాలా దేశాలు మయున్మార్ తో వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.

ఇంత జరుగుతున్నా సైన్యం మాత్రం తాను అనుకున్నట్లే చేస్తోందట. గడచిన రెండు రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో సైన్యం జనాలపై కాల్పులు జరుపుతునే ఉంది. మొదటిరోజు జరిగిన కాల్పుల్లోనే 114 మంది కాదని ఇంకా ఎక్కువమందే చనిపోయారనే ఆరోపణలు బాగా పెరిగిపోతున్నాయి. చనిపోయిన వారి సంఖ్యకన్నా రెట్టింపు తీవ్ర గాయాలైన వారున్నారని కూడా అంటున్నారు.

ఇదే విషయమై మయున్మార్ లోని అసిస్టెంట్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ ( ఏఏపీపీ) మాట్లాడుతూ ఇఫ్పటికి సుమారుగా 600 మందికి పైగా చనిపోయినట్లు ప్రకటించింది. ఇంతకు రెట్టింపు మంది ఆందోళనకారులు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చేరినట్లు కూడా చెప్పింది. బుల్లెట్ గాయాలైన వారిలో బార్డర్ దాటి మనదేశంలోకి కూడా వచ్చేశారు. అయితే వారి లెక్కంతని తేలలేదు. మొత్తానికి అంతర్జాతీయ సమాజాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా సైన్యం తాను అనుకున్నది అనుకున్నట్లే చేసుకుపోతోంది.

This post was last modified on March 31, 2021 10:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

12 minutes ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

4 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

5 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

5 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

7 hours ago