ఊహకు అందని ఉదంతాలు.. దారుణాలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. గతంలోనూ ఇలాంటివి అక్కడక్కడా చోటు చేసుకున్నా పెద్దగా బయటకు వచ్చేవి కావు. సమాచార విప్లవంతో పాటు.. సోషల్ మీడియా కారణంగా ఇప్పుడు ఎక్కడేం జరిగినా.. వెంటనే అందరికి తెలిసిపోయే పరిస్థితి. దీంతో దాచేస్తే దాగని ఉదంతాలెన్నో. తాజాగా అలాంటి షాకింగ్ ఉదంతం పంజాబ్ లో చోటు చేసుకుంది.
ఆ రాష్ట్రంలోని జలంధర్ పట్టణంలో ట్యూషన్ కు వచ్చే పదమూడేళ్ల పిల్లాడ్ని పెళ్లాడిందో టీచర్. ఈ ఉదంతంలోకి వెళితే.. ఇలా కూడా చేస్తారా? అన్న విస్మయానికి గురి కావటం ఖాయం. 28 ఏళ్ల టీచర్ కు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా.. వర్కువుట్ కావట్లేదు. ఆ యువతి జాతక నక్షత్రంలో మాంగల్య దోషం ఉందని పండితులు తెలిపారు. దీంతో.. ఆమెకు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదు. ఒకవేళ పెళ్లైనా.. కొద్దిరోజులకే భర్త మరణిస్తాడన్న మాటతో హడలిపోతున్నారు.
నిజానికి ఇలాంటి దోషాలు ఉన్న వారికి అరటిచెట్టుతో పెళ్లి జరిపి.. అనంతరం దాన్ని కొట్టేస్తుంటారు. మరి.. ఇలాంటి ఉపాయాలు వేయకుండా.. అతి తెలివితో వేసిన ప్లాన్ ఇప్పుడు అట్టర్ ప్లాప్ కావటమే కాదు.. పోలీసు కేసును ఎదుర్కొంటున్నారు. తన వద్దకు ట్యూషన్ కు వచ్చే బాలుడి మీద కన్నేసిన ఈ టీచర్.. వారి తల్లిదండ్రులకు తమ ఇంట్లోనే వారం పాటు ఉంచుకుంటామని అడిగింది. ట్యూషన్ చెప్పే టీచర్ అడగటంతో.. పిల్లాడి పేరెంట్స్ ఓకే అనేశారు. అక్కడ నుంచి మొదలైంది అసలు కత.
ఈ వారంలో మైనర్ అయిన పిల్లాడ్ని పెళ్లి చేసుకోవటం.. శోభనం లాంటి సంప్రదాయాలతో పాటు.. గాజులు పగుల కొట్టించి విధవను కూడా చేసేశారు. చెప్పినట్లే వారం పూర్తి అయిన వెంటనే ఆ బాలుడ్ని ఇంటికి పంపారు. ఇంటికి వచ్చిన బాలుడు.. వారంలో జరిగిన విశేషాల్ని చెప్పి.. తనను ఏ విధంగా వాడేసింది చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన పిల్లాడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం పెద్దల నుంచి ఒత్తిడి..పిల్లాడి తల్లిదండ్రులతో టీచర్ మాట్లాడటంతో కంప్లైంట్ ను వాపస్ తీసుకున్నారు. అయితే.. ఈ విషయం మీడియాలో రావటం సంచలనంగా మారటంతో..జలందర్ డీజీపీ గుర్ మీత్ సింగ్ రంగంలోకి దిగారు. బాలుడు మైనర్ కావటంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని.. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. పాడు కాలంలో ట్యూషన్ కు పంపేందుకు సైతం తల్లిదండ్రులు వెనకాడాల్సిన దుస్థితి తప్పదన్నట్లుగా ఈ ఉదంతం ఉంది కదా?
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…