తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన షర్మిల రాజకీయ ప్రయాణం.. ఆద్యంతం వ్యూహాత్మకంగా సాగుతోంది. ఒక అడుగు తర్వాత మరో అడుగు అన్నట్లుగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నేతల్ని ఆకర్షించే కన్నా.. తెలంగాణలోని వివిధ వర్గాల మద్దతు తనకుందున్న విషయాన్ని రోజువారీ నిర్వహించే కార్యక్రమాలతో ఆమె స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు బోలెడంత సమయం ఉండటం.. తన రాజకీయాన్ని భారీ హైప్ తీసుకొచ్చే కన్నా.. మెట్టు తర్వాత మెట్టు అన్నట్లుగా సాగుతోంది.
ఏప్రిల్ 9న ఖమ్మంలో నిర్వహించే భారీ సభ ద్వారా తాను పెట్టనున్న రాజకీయ పార్టీ పేరును.. జెండా.. ఎజెండాను సిద్ధం చేస్తున్న ఆమె.. తర్వాత ఏం చేస్తారన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లా తర్వాత ఆమె ఫోకస్ పెట్టే జిల్లా ఏమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆమె.. తన తదుపరి ఫోకస్ పెట్టేది మహబూబ్ నగర్ జిల్లా మీదనే అని చెబుతున్నారు.
దీనికి రెండు కారణాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో.. ఆ జిల్లాలో పార్టీ బలాన్ని పెంచుకోవటం మంచిదన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు.. తన రాజకీయ రంగ ప్రవేశం పై చాలామంది నేతలు మౌనంగా ఉంటే.. అందుకు భిన్నంగా ఘాటు వ్యాఖ్యలు చేసిన వారిలో రేవంత్ ఉన్నారు. ఆయన జిల్లాల పార్టీని బలోపేతం చేయటం ద్వారా లెక్క తేల్చాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఖమ్మం తర్వాత మహబూబ్ నగర్ అని.. ఆ తర్వాత నల్గొండ మీద ఆమె ఫోకస్ ఉంటుందని.. తర్వాత రంగారెడ్డి.. హైదరాబాద్ మీదనే ద్రష్టి పెడతారని చెబుతున్నారు. అదిలాబాద్.. నిజామాబాద్.. కరీంనగర్.. వరంగల్ జాల్లాల మీద కాస్త ఆలస్యంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉందంటున్నారు.
This post was last modified on March 19, 2021 3:15 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…