పోయింది.. వెళ్లిపోయిందనుకున్న కరోనా తిరిగి వచ్చేసింది. వెళ్లేటప్పుడు ఎంత బలహీనంగా వెళ్లిందో.. తిరిగి వచ్చేటప్పుడు మరింత బలంగా విరుచుకుపడుతోంది. ఇటీవల కాలంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే కావటం గమానార్హం. ఒకరోజులో ఇంత భారీగా కేసులు విరుచుకుపడుతున్న వైనం చూస్తే.. ఇతర రాష్ట్రాల వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి.
ఈ ఏడాది ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదైన పరిస్థితి లేదు. ఇదే తొలిసారి కావటం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క నాగపూర్ జిల్లాలోనే 3796 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సెప్టెంబరులో కరోనా కేసుల ఈస్థాయిలో నమోదు కాగా.. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది.
ఇదంతా చూస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ఇలాంటి ఇబ్బందులు తప్పవన్న హెచ్చరిక పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జిల్లాలతో పోలిస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కేసులు నమోదు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. నాగపూర్ తర్వాత అత్యధిక కేసులు ముంబయిలోనే నమోదయ్యాయి. ఒక్కరోజులో 2877కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో ఫూణె నిలిచింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో సంతోషించే అంశం ఏమైనా ఉందంటే రికవరీ రేటుగా చెబుతున్నారు. కేసుల నమోదు కంటే కూడా రికవరీ రేటు ఎక్కువగా ఉండటం మహారాష్ట్ర సర్కారుకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఇంతలా కేసులు నమోదవుతున్నా.. పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదన్న మాట రాష్ట్ర మంత్రుల నోట వినిపిస్తోంది. కాకుంటే.. కొన్నిచోట్ల మాత్రం రాత్రి వేళలో కర్ఫ్యూను విధించారు.
This post was last modified on March 19, 2021 3:17 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…