Trends

ఒక్క రోజు.. ఒక్క రాష్ట్రం.. 25వేలకు పైగా కేసులు

పోయింది.. వెళ్లిపోయిందనుకున్న కరోనా తిరిగి వచ్చేసింది. వెళ్లేటప్పుడు ఎంత బలహీనంగా వెళ్లిందో.. తిరిగి వచ్చేటప్పుడు మరింత బలంగా విరుచుకుపడుతోంది. ఇటీవల కాలంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలోనే కావటం గమానార్హం. ఒకరోజులో ఇంత భారీగా కేసులు విరుచుకుపడుతున్న వైనం చూస్తే.. ఇతర రాష్ట్రాల వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి.

ఈ ఏడాది ఇప్పటివరకు ఎప్పుడూ లేని రీతిలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదైన పరిస్థితి లేదు. ఇదే తొలిసారి కావటం గమనార్హం. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క నాగపూర్ జిల్లాలోనే 3796 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సెప్టెంబరులో కరోనా కేసుల ఈస్థాయిలో నమోదు కాగా.. మళ్లీ ఇప్పుడు అదే స్థాయిలో నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది.

ఇదంతా చూస్తే.. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. ఇలాంటి ఇబ్బందులు తప్పవన్న హెచ్చరిక పలువురి నోటి నుంచి వినిపిస్తోంది.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జిల్లాలతో పోలిస్తే.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కేసులు నమోదు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. నాగపూర్ తర్వాత అత్యధిక కేసులు ముంబయిలోనే నమోదయ్యాయి. ఒక్కరోజులో 2877కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో ఫూణె నిలిచింది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో సంతోషించే అంశం ఏమైనా ఉందంటే రికవరీ రేటుగా చెబుతున్నారు. కేసుల నమోదు కంటే కూడా రికవరీ రేటు ఎక్కువగా ఉండటం మహారాష్ట్ర సర్కారుకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు. ఇంతలా కేసులు నమోదవుతున్నా.. పూర్తిస్థాయిలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదన్న మాట రాష్ట్ర మంత్రుల నోట వినిపిస్తోంది. కాకుంటే.. కొన్నిచోట్ల మాత్రం రాత్రి వేళలో కర్ఫ్యూను విధించారు.

This post was last modified on March 19, 2021 3:17 pm

Share

Recent Posts

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

12 minutes ago

సంక్రాంతికి సంబరాలు… ఏటిగట్టుకి సవాళ్లు

గత ఏడాది విడుదల కావాల్సిన సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు కొత్త…

1 hour ago

ఫౌజీ నిజాల మీద గాలి పుకార్లు

ప్రభాస్ ఫౌజీ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ఆ…

2 hours ago

గవర్నర్ విందుకు హాజరు కాలేని పవన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…

2 hours ago

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…

3 hours ago

ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడింది

బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…

4 hours ago