Trends

దేశంలో రూ.7 కోట్ల కనీస ఆస్తి ఉన్న కుటుంబాలు ఎన్నో తెలుసా?

మినిమం రూ.7కోట్ల సంపద ఉన్న కుటుంబాలు దేశంలో ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. డాలర్ మిలియనీర్ లో భాగంగా ఈ లెక్కింపును చేపట్టారు. హురున్ ఇండియావెల్త్ రిపోర్టు 2020 ప్రకారం.. దేశంలో రూ.7కోట్లు కనీసం ఆసక్తి ఉన్న కుటుంబాలు ఏకంగా 4.12 లక్షలు ఉన్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. ఈ సంపన్న కుటుంబాల్లో 70 శాతం దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. ఈ తరహా సంపన్న కుటుంబాల్లో మహారాష్ట్ర ముందున్నట్లుగా చెబుతున్నారు.

ఆ రాష్ట్రంలో డాలర్ మిలియనీర్ కుటుంబాలు ఏకంగా 56వేలు ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. అందులో 16,933 కుటుంబాలు ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో నివసిస్తున్నట్లుగా తేల్చారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో 16వేల కుటుంబాలు ఉంటే.. కోల్ కతాలో 10వేలకుటుంబాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. బెంగళూరులో 7500 కుటుంబాలు.. చెన్నైలో4700 కుటుంబాలు ఉన్నాయి. టాప్ టెన్ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చోటు లభించింది.

అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న ముంబయి.. దేశ జీడీపీకి 6.16 శాతం.. ఢిల్లీ 4.94 శాతం వాటా అందిస్తున్నాయి. దేశంలో 5.64 శాతం మధ్య తరగతి కుటుంబాలు ఉంటే.. రూ.7 కోట్ల కంటే తక్కువ ఆస్తి కలిగి.. ఏటా 2.5 లక్షలకుపైగ ఆదాయం ఆర్జిస్తున్న వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. అంతేకాదు.. దేశంలో సరికొత్త మధ్యతరగతిని కూడా హురున్ గుర్తించింది. ఏటా సగటున రూ.20లక్షలు పొదుపు చేస్తున్న కుటుంబాలు 6.33లక్షలు ఉన్నట్లుగా తేల్చింది. ఈ లెక్కలన్నింటిని ఒకవైపు.. వాస్తవ కోణంలో చూస్తే.. హురూన్ పేర్కొన్న కుటుంబాల కంటే ఎక్కువగా.. దేశంలో సంపన్నులు ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

This post was last modified on March 17, 2021 11:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

11 minutes ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

30 minutes ago

జ‌గ‌న్‌ను మ‌రోసారి ఏకేసిన‌ ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్.. లండ‌న్ నుంచి ఇలా వ‌చ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు,…

1 hour ago

జూనియర్ అభిమానులు ఎందుకు ఫీలయ్యారు

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…

2 hours ago

దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..

బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…

2 hours ago

బాప‌ట్ల త‌మ్ముళ్ల మ‌ధ్య ‘ఎన్టీఆర్’ వివాదం

కూట‌మి ప్ర‌భుత్వంలో క‌లిసి మెలిసి ఉండాల‌ని.. నాయ‌కులు ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే…

2 hours ago