మినిమం రూ.7కోట్ల సంపద ఉన్న కుటుంబాలు దేశంలో ఎన్ని ఉన్నాయన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. డాలర్ మిలియనీర్ లో భాగంగా ఈ లెక్కింపును చేపట్టారు. హురున్ ఇండియావెల్త్ రిపోర్టు 2020 ప్రకారం.. దేశంలో రూ.7కోట్లు కనీసం ఆసక్తి ఉన్న కుటుంబాలు ఏకంగా 4.12 లక్షలు ఉన్నట్లుగా తేల్చారు. అంతేకాదు.. ఈ సంపన్న కుటుంబాల్లో 70 శాతం దేశంలోని టాప్ 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. ఈ తరహా సంపన్న కుటుంబాల్లో మహారాష్ట్ర ముందున్నట్లుగా చెబుతున్నారు.
ఆ రాష్ట్రంలో డాలర్ మిలియనీర్ కుటుంబాలు ఏకంగా 56వేలు ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. అందులో 16,933 కుటుంబాలు ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో నివసిస్తున్నట్లుగా తేల్చారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో 16వేల కుటుంబాలు ఉంటే.. కోల్ కతాలో 10వేలకుటుంబాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. బెంగళూరులో 7500 కుటుంబాలు.. చెన్నైలో4700 కుటుంబాలు ఉన్నాయి. టాప్ టెన్ రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చోటు లభించింది.
అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న ముంబయి.. దేశ జీడీపీకి 6.16 శాతం.. ఢిల్లీ 4.94 శాతం వాటా అందిస్తున్నాయి. దేశంలో 5.64 శాతం మధ్య తరగతి కుటుంబాలు ఉంటే.. రూ.7 కోట్ల కంటే తక్కువ ఆస్తి కలిగి.. ఏటా 2.5 లక్షలకుపైగ ఆదాయం ఆర్జిస్తున్న వారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. అంతేకాదు.. దేశంలో సరికొత్త మధ్యతరగతిని కూడా హురున్ గుర్తించింది. ఏటా సగటున రూ.20లక్షలు పొదుపు చేస్తున్న కుటుంబాలు 6.33లక్షలు ఉన్నట్లుగా తేల్చింది. ఈ లెక్కలన్నింటిని ఒకవైపు.. వాస్తవ కోణంలో చూస్తే.. హురూన్ పేర్కొన్న కుటుంబాల కంటే ఎక్కువగా.. దేశంలో సంపన్నులు ఉండే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on March 17, 2021 11:32 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…