భారత క్రికెట్ను అనుసరిస్తూ సోషల్ మీడియాను కూడా ఫాలో అయ్యేవారికి టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి పై వచ్చే జోకుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద తాగుబోతు అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది. దీని మీద తరచుగా మీమ్స్, జోక్స్ పేలుతుంటాయి. రవితేజ కొన్ని సందర్భాల్లో మత్తులో ఉన్నట్లుగా ఉన్న ఫొటోలను ఈ మీమ్స్ కోసం వాడుతుంటారు. అవి కడుపుబ్బ నవ్విస్తుంటాయి. ఐతే తన మీద వచ్చే జోకులు, మీమ్స్ విషయంలో రవిశాస్త్రి మరీ సీరియస్గా ఏమీ ఉండడు అనడానికి రుజువు తాజాగా ఆయన వేసిన ఒక ట్వీట్.
మొన్న మొతేరా మైదానంలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోవడం, కోహ్లీ సేన ఘనవిజయం సాధించడం తెలిసిందే. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. మీమ్స్ లెక్కే లేవు. ఐతే రవిశాస్త్రికి ముడిపెడుతూ ఒక మీమ్ను ప్రముఖ రచయిత శోభా డే షేర్ చేసింది. నాకు ఐదు రోజుల పాటు డ్రై డే అనుకున్నారు కదా అని రవిశాస్త్రి అంటున్నట్లు ఉంది ఆ మీమ్. అంటే మ్యాచ్ ఐదు రోజులు జరిగితే ఆ ఐదు రోజులూ రవిశాస్త్రి తాగడని, ఇప్పుడు రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది కాబట్టి ఆయన మద్యం మత్తులో జోగుతాడని ఆ మీమ్ అర్థమన్నమాట.
తమపై ఇలాంటి జోక్ వేస్తే అందరూ సరదాగా తీసుకోలేరు. కానీ రవిశాస్త్రి మాత్రం లైట్ తీసుకున్నాడు. ఈ ట్వీట్ మీద ఫన్నీగా స్పందించాడు. నా వల్ల మీ ముఖాల్లో నవ్వు వస్తుందంటే రానివ్వండి అంటూ ట్వీట్ వేశాడు. ముందు శోభా డే షేర్ చేసిన మీమ్ ఎంత వైరల్ అయిందో.. దానికి రవిశాస్త్రి స్పందన కూడా అంతే వైరల్ అయింది. రవిశాస్త్రి స్పోర్టివ్నెస్ను మెచ్చుకుంటూ ఆయన మీద వచ్చిన మరిన్ని మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. వాటిని కూడా రవిశాస్త్రి బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుంది.
This post was last modified on February 27, 2021 9:44 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…