భారత క్రికెట్ను అనుసరిస్తూ సోషల్ మీడియాను కూడా ఫాలో అయ్యేవారికి టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి పై వచ్చే జోకుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద తాగుబోతు అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది. దీని మీద తరచుగా మీమ్స్, జోక్స్ పేలుతుంటాయి. రవితేజ కొన్ని సందర్భాల్లో మత్తులో ఉన్నట్లుగా ఉన్న ఫొటోలను ఈ మీమ్స్ కోసం వాడుతుంటారు. అవి కడుపుబ్బ నవ్విస్తుంటాయి. ఐతే తన మీద వచ్చే జోకులు, మీమ్స్ విషయంలో రవిశాస్త్రి మరీ సీరియస్గా ఏమీ ఉండడు అనడానికి రుజువు తాజాగా ఆయన వేసిన ఒక ట్వీట్.
మొన్న మొతేరా మైదానంలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోవడం, కోహ్లీ సేన ఘనవిజయం సాధించడం తెలిసిందే. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. మీమ్స్ లెక్కే లేవు. ఐతే రవిశాస్త్రికి ముడిపెడుతూ ఒక మీమ్ను ప్రముఖ రచయిత శోభా డే షేర్ చేసింది. నాకు ఐదు రోజుల పాటు డ్రై డే అనుకున్నారు కదా అని రవిశాస్త్రి అంటున్నట్లు ఉంది ఆ మీమ్. అంటే మ్యాచ్ ఐదు రోజులు జరిగితే ఆ ఐదు రోజులూ రవిశాస్త్రి తాగడని, ఇప్పుడు రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది కాబట్టి ఆయన మద్యం మత్తులో జోగుతాడని ఆ మీమ్ అర్థమన్నమాట.
తమపై ఇలాంటి జోక్ వేస్తే అందరూ సరదాగా తీసుకోలేరు. కానీ రవిశాస్త్రి మాత్రం లైట్ తీసుకున్నాడు. ఈ ట్వీట్ మీద ఫన్నీగా స్పందించాడు. నా వల్ల మీ ముఖాల్లో నవ్వు వస్తుందంటే రానివ్వండి అంటూ ట్వీట్ వేశాడు. ముందు శోభా డే షేర్ చేసిన మీమ్ ఎంత వైరల్ అయిందో.. దానికి రవిశాస్త్రి స్పందన కూడా అంతే వైరల్ అయింది. రవిశాస్త్రి స్పోర్టివ్నెస్ను మెచ్చుకుంటూ ఆయన మీద వచ్చిన మరిన్ని మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. వాటిని కూడా రవిశాస్త్రి బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుంది.
This post was last modified on February 27, 2021 9:44 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…