భారత క్రికెట్ను అనుసరిస్తూ సోషల్ మీడియాను కూడా ఫాలో అయ్యేవారికి టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి పై వచ్చే జోకుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెద్ద తాగుబోతు అనే అభిప్రాయం చాలా మంది లో ఉంది. దీని మీద తరచుగా మీమ్స్, జోక్స్ పేలుతుంటాయి. రవితేజ కొన్ని సందర్భాల్లో మత్తులో ఉన్నట్లుగా ఉన్న ఫొటోలను ఈ మీమ్స్ కోసం వాడుతుంటారు. అవి కడుపుబ్బ నవ్విస్తుంటాయి. ఐతే తన మీద వచ్చే జోకులు, మీమ్స్ విషయంలో రవిశాస్త్రి మరీ సీరియస్గా ఏమీ ఉండడు అనడానికి రుజువు తాజాగా ఆయన వేసిన ఒక ట్వీట్.
మొన్న మొతేరా మైదానంలో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోవడం, కోహ్లీ సేన ఘనవిజయం సాధించడం తెలిసిందే. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. మీమ్స్ లెక్కే లేవు. ఐతే రవిశాస్త్రికి ముడిపెడుతూ ఒక మీమ్ను ప్రముఖ రచయిత శోభా డే షేర్ చేసింది. నాకు ఐదు రోజుల పాటు డ్రై డే అనుకున్నారు కదా అని రవిశాస్త్రి అంటున్నట్లు ఉంది ఆ మీమ్. అంటే మ్యాచ్ ఐదు రోజులు జరిగితే ఆ ఐదు రోజులూ రవిశాస్త్రి తాగడని, ఇప్పుడు రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది కాబట్టి ఆయన మద్యం మత్తులో జోగుతాడని ఆ మీమ్ అర్థమన్నమాట.
తమపై ఇలాంటి జోక్ వేస్తే అందరూ సరదాగా తీసుకోలేరు. కానీ రవిశాస్త్రి మాత్రం లైట్ తీసుకున్నాడు. ఈ ట్వీట్ మీద ఫన్నీగా స్పందించాడు. నా వల్ల మీ ముఖాల్లో నవ్వు వస్తుందంటే రానివ్వండి అంటూ ట్వీట్ వేశాడు. ముందు శోభా డే షేర్ చేసిన మీమ్ ఎంత వైరల్ అయిందో.. దానికి రవిశాస్త్రి స్పందన కూడా అంతే వైరల్ అయింది. రవిశాస్త్రి స్పోర్టివ్నెస్ను మెచ్చుకుంటూ ఆయన మీద వచ్చిన మరిన్ని మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. వాటిని కూడా రవిశాస్త్రి బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లుంది.
This post was last modified on February 27, 2021 9:44 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…