ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఇండియన్ సూపర్ స్టార్లకు దీటుగా ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ను ఒక విదేశీయుడిలా చూడరు మన అభిమానులు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్కు మారాక ఐపీఎల్తో అతడి అనుబంధం ఎంతగానో బలపడింది. అతణ్ని మన తెలుగు అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ఆటతో అలరిస్తూ, జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు వార్నర్.
ఇప్పటికే తన జట్టుకు ఒక టైటిల్ కూడా అందించిన వార్నర్.. ప్రతి సీజన్లోనూ శక్తివంచన లేకుండా జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. కేవలం ఆటతోనే కాక మైదానం అవతల వార్నర్ విన్యాసాలు కూడా అభిమానులను అలరిస్తుంటాయి. తెలుగు పాటల టిక్ టాక్ వీడియోలతో అతను మరింతగా మనోళ్ల మనసుల్లోకి చొచ్చుకెళ్లాడు. ఐతే మధ్యలో ఒక ఏడాది బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ఐపీఎల్ ఆడలేకపోయిన వార్నర్.. ఈసారి గాయం కారణంగా లీగ్కు దూరమవుతాడన్న ప్రచారం జరిగింది.
స్వయంగా వార్నరే తన గజ్జల్లో గాయం తీవ్రత గురించి వివరించాడు. తన గాయం మానడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని చెప్పాడు. కొన్ని వారాల కిందటే వార్నర్ ఈ మాట చెప్పడంతో ఈసారి అతను ఐపీఎల్ ఆడకపోవచ్చని ప్రచారం సాగింది. వార్నర్ లేదంటే సన్రైజర్స్కు అది మామూలు దెబ్బ కాదు. జట్టులో కళే పోతుంది. అభిమానుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఐతే తన గురించి టెన్షన్ పడుతున్న అభిమానులకు వార్నర్ ఊరటనిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
సన్రైజర్స్ జట్టుకు నాయకత్వం వహించడం తనకెంతో ఇష్టమైన పని అని, ఈ సీజన్లోనూ జట్టును నడిపించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అతను పేర్కొన్నాడు. ఈ పోస్టు తాలూకు స్క్రీన్ షాట్ను సన్రైజర్స్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టి అభిమానుల ఆందోళనను తొలగించింది. దీంతో వార్నర్ ఈ సీజన్లో యధావిధిగా పాల్గొనబోతున్నాడని, అతను లీగ్కు దూరమవుతాడని బాధ పడాల్సిన పని లేదని అభిమానులు ఊరట చెందుతున్నారు.
This post was last modified on February 27, 2021 3:51 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…