ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఇండియన్ సూపర్ స్టార్లకు దీటుగా ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ను ఒక విదేశీయుడిలా చూడరు మన అభిమానులు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్కు మారాక ఐపీఎల్తో అతడి అనుబంధం ఎంతగానో బలపడింది. అతణ్ని మన తెలుగు అభిమానులు బాగా ఓన్ చేసుకున్నారు. ప్రతి సీజన్లోనూ అద్భుతమైన ఆటతో అలరిస్తూ, జట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించాడు వార్నర్.
ఇప్పటికే తన జట్టుకు ఒక టైటిల్ కూడా అందించిన వార్నర్.. ప్రతి సీజన్లోనూ శక్తివంచన లేకుండా జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాడు. కేవలం ఆటతోనే కాక మైదానం అవతల వార్నర్ విన్యాసాలు కూడా అభిమానులను అలరిస్తుంటాయి. తెలుగు పాటల టిక్ టాక్ వీడియోలతో అతను మరింతగా మనోళ్ల మనసుల్లోకి చొచ్చుకెళ్లాడు. ఐతే మధ్యలో ఒక ఏడాది బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ఐపీఎల్ ఆడలేకపోయిన వార్నర్.. ఈసారి గాయం కారణంగా లీగ్కు దూరమవుతాడన్న ప్రచారం జరిగింది.
స్వయంగా వార్నరే తన గజ్జల్లో గాయం తీవ్రత గురించి వివరించాడు. తన గాయం మానడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుందని చెప్పాడు. కొన్ని వారాల కిందటే వార్నర్ ఈ మాట చెప్పడంతో ఈసారి అతను ఐపీఎల్ ఆడకపోవచ్చని ప్రచారం సాగింది. వార్నర్ లేదంటే సన్రైజర్స్కు అది మామూలు దెబ్బ కాదు. జట్టులో కళే పోతుంది. అభిమానుల అసంతృప్తి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఐతే తన గురించి టెన్షన్ పడుతున్న అభిమానులకు వార్నర్ ఊరటనిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
సన్రైజర్స్ జట్టుకు నాయకత్వం వహించడం తనకెంతో ఇష్టమైన పని అని, ఈ సీజన్లోనూ జట్టును నడిపించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని అతను పేర్కొన్నాడు. ఈ పోస్టు తాలూకు స్క్రీన్ షాట్ను సన్రైజర్స్ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టి అభిమానుల ఆందోళనను తొలగించింది. దీంతో వార్నర్ ఈ సీజన్లో యధావిధిగా పాల్గొనబోతున్నాడని, అతను లీగ్కు దూరమవుతాడని బాధ పడాల్సిన పని లేదని అభిమానులు ఊరట చెందుతున్నారు.
This post was last modified on February 27, 2021 3:51 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…