Trends

మిస్టరీ వీడింది.. చెక్కపెట్టెలో ఆస్థిపంజరం అసలు కథ ఇదే


హైదరాబాద్ లోని బోరబండ సాయిబాబా ఆలయం సెల్లార్ లో ఒక గదిలోని పెట్టెలో ఆస్థిపంజరం బయట పడటం పెను సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేధించారు. పదమూడు నెలలుగా మిస్ అయిన వ్యక్తిని గుర్తించటంలో విఫలమైన పోలీసులు.. ఆస్థిపంజరం బయట పడిన తర్వాత దాని మిస్టరీని గంటల వ్యవధిలోనే తేల్చేయటం గమనార్హం. ఇంతకూ అసలేం జరిగిందన్నది చూస్తే..

బోరబండలోని ఇందిరానగర్ ఫేజ్ 2 బస్తీలోని సాయిబాబా దేవస్థానం సెల్లార్ గదికి అద్దె ఇచ్చారు. అద్డె చెల్లించలేదంటూ దేవస్థానం ఛైర్మన్ యాదయ్య కొద్దిరోజులక్రితం ఎస్ ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. 2017లో పలాష్ పాల్ అనే వ్యక్తికి గది అద్దెకు తీసుకున్నాడు. కార్పెంటర్ గా పని చేసే అతడు.. మొదట్లో అద్దెను సక్రమంగా చెల్లించేవాడని.. తర్వాత మాత్రం అద్దెను చెల్లించటం మానేశాడు. తర్వాత తాళం వేసుకొని వెళ్లాడే కానీ.. కనీసం స్పందించని పరిస్థితి. దీంతో.. పోలీసుల సమక్షంలో గదిని ఖాళీ చేయించే క్రమంలో.. ఒక చెక్క పెట్టెలో ఆస్థిపంజరం కనిపించటంతో షాక్ తిన్నారు.

దీంతో.. వెంటనే అద్దెకు తీసుకున్న పాల్ కు ఫోన్ చేయగా.. తాను పశ్చిమబెంగాల్ లో ఉన్నట్లు చెప్పాడు. కాల్ డేటాను చూస్తే.. అతను హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అలెర్టు అయి.. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిసిందే. విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడైనట్లుగా చెబుతున్నారు. తాను అద్దెకు తీసుకున్న గదిలో తన వస్తువుల్ని దాచేవాడు. ఈ క్రమంలో అతడికి స్థానిక మహిళతో వివాహేతర సంబంధం చోటు చేసుకుంది. అది ఆమె భర్త కమల్ కు తెలిసిపోయింది. దీంతో.. ఆమెను హెచ్చరించేవారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. దీంతో..ఆమె పాల్ కు దూరంగా ఉండటం మొదలు పెట్టింది.

ఇదిలా ఉంటే.. కమల్ కొత్త ఇంటికి కడుతున్నాడు. దానికి అవసరమయ్యే ద్వారబంధానని కొనుగోలు చేయటానికి పాల్ వద్దకు వచ్చాడు. అతడ్ని మాటల్లో పెట్టి గదిలోకి తీసుకొచ్చి.. అదును చూసి చెక్కతో బలంగా నెత్తి మీద కొట్టటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. డెడ్ బాడీని తరలించటానికి కుదరక.. తన దగ్గరున్న చెక్కపెట్టెలో పెట్టేసి గదికి తాళం వేసి వెళ్లిపోయాడు.

గత ఏడాది జనవరిలో ఈ ఘటన జరగ్గా.. తన భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదమూడు నెలలుగా కనిపించని భర్త.. చివరకు ఆస్థిపంజరంగా కనిపించటంతో ఆమె బోరుమంటున్నారు. ఇందుకు కారణమైన పాల్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

Satya

Recent Posts

గీతాంజలి… ఇలాంటివి కదా చూడాలి

గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…

3 hours ago

పవన్ మాటంటే మాటే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…

4 hours ago

దృశ్యం 3 తెలుగు అభిమానులకు షాక్

రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…

5 hours ago

ఈ రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…

5 hours ago

కన్నప్ప పునఃదర్శనం ఇంత త్వరగానా

మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…

5 hours ago

సాయికృష్ణ ఘటనపై చంద్రబాబు సీరియస్

విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…

6 hours ago