Trends

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే అక్కడ ఓ మైనర్ బాలికను రేప్ చేశారు. నిండా పదహారేళ్లు లేని బాలికకు మత్తు చాకోలెట్లు ఇచ్చి రేప్ చేయడం కలకలం సృష్టిస్తుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువత చట్టాలకు భయపడటం లేదు. పోలీసులకు భయపడటం లేదు. నామమాత్రంగా విధించే శిక్షలంటే భయం లేదు. దాంతో అమ్మాయిలు కనబడితే చాలు ఎగబడుతున్నారు. అత్యాచారమో, హత్యాచారమో చేసేస్తున్నారు. హైదరాబాద్ లో ఏమి జరిగిందంటే…

నగరంలోని మచ్చ బొల్లారంకు చెందిన ఓ బాలిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుంది. ఆమెకు పదవ తరగతి చదువుతున్నప్పుడు జెర్రీ వరుణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొన్ని నెలల క్రితం అతడు మాయమాటలు చెప్పి బాలికను తన కారులో తీసుకెళ్లాడు. మత్తు చాక్లెట్ ఇచ్చి రేప్ చేశాడు. జెర్రీ వరుణ్ ద్వారా రోమల వరుణ్ పరిచయమయ్యాడు. అతడికి జెర్రీ రేప్ చేసిన విషయం తెలిసీ ఆ బాలిక మీద కన్నేశాడు. ఆ బాలికతో స్నేహం నటిస్తూ మద్యం, సిగరెట్లు, గంజాయి అలవాటు చేశాడు. కొంపల్లికి తీసుకెళ్లి రేప్ చేశాడు.

ఈ క్రమంలో ఇన్ స్టా లో ఆ బాలికకు డేవిడ్ వరుణ్ పరిచయమయ్యాడు. వాడు కూడా ఆ బాలికకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో నిండా మునిగిపోయాక కూతురి ప్రవర్తన మీద తలిదండ్రులకు అనుమానం వచ్చింది. పద్దతి మార్చుకొని బాగా చదువుకోమంటూ మందలించారు. దాంతో ఆ బాలిక ఇల్లొదిలి వెళ్లి పోయింది. బొల్లారం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఒంటరిగా తిరుగుతున్న బాలిక మీద నీరజ్ అనే వ్యక్తి కన్నేశాడు.

నీరజ్ తన స్నేహితుడు విక్కీని పిలిచాడు. ఇద్దరూ కలిసి బాలికను తీసుకెళ్లి మత్తులోకి దించారు. ఒకరి తర్వాత మరొకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అక్కడ నుంచి నీరజ్ వెళ్ళిపోయాడు. విక్కీ మాత్రం వెళ్లకుండా తన మిత్రుడు నిఖిల్ ని పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఆ బాలికను దూలపల్లి తీసుకెళ్లారు. అక్కడకు మరో ఇద్దరు వచ్చారు. ఓయో రూం తీసుకొని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు.

ఆ తర్వాత కూడా విక్కీ ఆ బాలికను వదిలిపెట్టలేదు. బొల్లారంలోని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ నుంచి ఆ బాలిక తప్పించుకొని రైల్వే స్టేషన్ కు పారిపోయింది. విక్కీ, తన స్నేహితుడు గణేష్ తో కలిసి ఆమెను వెంబడించాడు. ఆ బాలికను మేడ్చల్ రైల్వే స్టేషన్ కు తీసుకోచ్చి రైల్లోనే రేప్ చేశారు. మల్కాజ్ గిరి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. జరిగిన విషయం తలిదండ్రులకు చెప్పింది. అల్వాల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎనిమిది మంది మీద పొక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

This post was last modified on September 14, 2026 11:18 am

Share

Recent Posts

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

50 minutes ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

1 hour ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

4 hours ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

10 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

13 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

15 hours ago