ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టులో ఫిక్సింగ్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మూడో టెస్టుకు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పంపించేయడం, ఇద్దరు కోచ్లను తప్పించడం వెనుక అసలు కారణం ఆటతీరు కాదని, ఫిక్సింగ్ వ్యవహారమేనని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ వివాదంలో ప్రధానంగా వెటరన్ ప్లేయర్లు మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ పేర్లు వినిపిస్తున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత, జట్టు భద్రతా అధికారి ఈ ఇద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల నుంచి డేటాను వేరే డివైజ్లోకి బదిలీ చేసుకున్న తర్వాతే తిరిగి వారికి ఇచ్చారని సమాచారం.
పాక్ మీడియా కథనాల నేపథ్యంలో పీసీబీ డైరెక్టర్ అఫ్ మీడియా అమీర్ మీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆటగాళ్ల క్రమశిక్షణ, ప్రవర్తనపై వస్తున్న వార్తల ఆధారంగా అంతర్గత విచారణ ప్రారంభించామని ఆయన క్లారిటీ చేశారు. ఈ ఇద్దరే కాకుండా మరికొంత మంది ఆటగాళ్ల డివైజ్లను కూడా బోర్డు సీజ్ చేసిందని, చివరి టెస్టు పూర్తయ్యే వరకు వాటిని తిరిగి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
జట్టు ప్రక్షాళనలో భాగంగా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్ ఇద్దరినీ పీసీబీ బాధ్యతల నుంచి తప్పించింది. స్వదేశానికి పంపిన ఏడుగురు ఆటగాళ్ల స్థానంలో కొత్తగా మరో ఏడుగురిని ఎంపిక చేసింది. వీరిలో ఐదుగురు అంతర్జాతీయ అరంగేట్రం చేయని వారు కాగా, సయీమ్ అయూబ్, అబ్దుల్లా ఫజల్ మాత్రమే సీనియర్లు.
లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో గాయం కారణంగా ఇమామ్ ఉల్ హక్ బ్యాటింగ్కు రాకపోవడంపై పీసీబీ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఆటగాళ్లు ప్లాస్టర్లు వేసుకుని మరీ ఆడేవారని, కేవలం కండరాలు పట్టేయడం వల్ల రెండు ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇమామ్ కావాలనే గాయం నాటకం ఆడాడని చెప్పలేను కానీ, దీనిపై కచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆకిబ్ తేల్చి చెప్పారు.
This post was last modified on September 8, 2026 10:51 am
హైదరాబాద్కు చెందిన ఓ దంపతులు ఐదు నెలలు అమెరికాలో ఉండాలని ప్లాన్ చేసుకుని మయామీ వెళ్లారు. ఐదు నెలల తర్వాత…
సినిమా చూడాలంటే బుక్మైషోలో టికెట్ తీసుకోవడం కామన్. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా…
ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో రాజమౌళి తర్వాతి స్థానం ఎవరిది అంటే మరో మాట లేకుండా సుకుమార్ పేరు చెప్పేయొచ్చు. టాలీవుడ్లోనే…
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…
ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…
తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…