ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి మృతి చెందగా ఇవాళ అనంతపురం జిల్లాలో హాస్టల్ గోడ కూలి 8 వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. వరస ఘటనలతో విద్యార్థుల తలిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చదువుకొని తమను ఉద్దరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తలిదండ్రులు కడుపుకొతతో కన్నీరుమున్నీరవుతున్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ లో ఆదివారం ఉదయం హాస్టల్ గోడ కూలి 8 వ తరగతి చదువుతున్న హర్ష వర్ధన్ అనే 12 ఏళ్ళ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మృతి గురించి రెండు రకాల కథనాలు ప్రచారంలో వున్నాయి.
ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితుడు అక్షయ్ తో కలిసి హర్ష వర్ధన్ గ్రౌండ్లో ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రహరి గోడ కూలిపోయింది. శిధిలాలకింద చిక్కుకొన్న హర్ష వర్ధన్ క్షణాల్లోనే ఊపిరి వదిలాడు. అక్షయ్ కు తీవ్రంగా గాయలయ్యాయి. కల్యాణ దుర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అతడి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అక్షయ్ పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తుంది.
ఇదిలావుండగా మరో ప్రచారం కూడా వినిపిస్తుంది. హర్ష వర్ధన్, అక్షయ్ ఇద్దరూ కలిసి బహిర్భూమికి వెళ్లారు. అప్పటికే శిధిలావస్థకు చేరుకొని వున్న పాత గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో హర్ష వర్ధన్ చనిపోయాడు. అక్షయ్ గాయాల పాలై ఆసుపత్రికి చేరాడు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఒక విద్యార్థి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోడ చాలా రోజులుగా శిధిలావస్థకు చేరుకొని వుంది. దీన్ని మరమ్మత్తులు చేయించాల్సిందిగా విద్యార్థి సంఘాలు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ హాస్టల్ లో 3 నుంచి 10 వ తరగతి చదుకుంటున్న నిరుపేద దళిత విద్యార్థులు వున్నారు. ఆర్ధిక స్థోమత లేకపోవడంతో తల్లీదండ్రులు హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. చేజేతులా బిడ్డను పోగొట్టుకున్నానంటూ హర్ష వర్ధన్ రోదిస్తున్న తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో భయపడి పోయిన విద్యార్థుల తల్లీదండ్రులు హాస్టల్ కు చేరుకొని పిల్లలను ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది.
This post was last modified on August 24, 2026 6:36 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…