జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం శుక్రవారం తిరుపతిలోని అలిపిరి నుంచి కాలి బాటన బయలుదేరిన అన్న.. శుక్రవారం రాత్రికే తిరుమల చేరుకున్నారు. అనంతరం శనివారం ఉదయం సుప్రభాత సేవలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదికారులు ప్రొటోకాల్ మేరకు ఆమెకు స్వామి వారి దర్శనాన్ని కల్పించారు.
గతంలోనూ అన్నా కొణిదల శ్రీవారి దర్శనార్థం తిరుమల వెళ్లిన సంగతి తెలిసిందే. నాడు తన కుమారుడు అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్న నేపథ్యంలో తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అన్నా… ఆ సందర్భంగా స్వామి వారికి తలనీలాలు కూడా సమర్పించారు. తాజాగా తన భర్త పవన్ కల్యాణ్ కు శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఆమె తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. తిరుమలలో అన్నాను చూసిన వారంతా… నాడు కుమారుడి క్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమల వచ్చిన తాను… ఇప్పుడు తన భర్తకు ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో శ్రీవారి వద్దకు వచ్చారంటూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
శ్రీవారి దర్శనం సందర్భంగా అన్నా సంప్రదాయబద్ధంగా స్వామి వారికి పూజలు చేశారు. రంగనాయకుల మండపంలో ఆమె వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. అక్కడే టీటీడీ అదికారులు ఆమెకు స్వామివారి ప్రసాదాన్ని అందించారు. తన భర్తకు జరిగిన సర్జరీ విజయవంతంగా ముగిసిన నేపథ్యాన్ని తలచుకుని మరీ ఆమె స్వామి వారి సేవలో పాలుపంచుకున్నారు. గతంలో తన కుమారుడిని, ఇప్పుడు తన భర్తను స్వామి వారే కాపాడారన్న భావన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది.
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం నుంచి ప్రమోషనల్ కంటెంట్ మొత్తం దాదాపుగా బయటికి వచ్చేసింది. ట్రైలర్,…
‘రా ఎన్టీఆర్’ పేరుతో ఒక ఎన్జీవో చేపట్టబోతున్న ‘ఊరు వాడ’ కార్యక్రమం మీద ఇటీవల పెను దుమారం రేగిన సంగతి…