తెలుగు అగ్ర నిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తమ నిర్మాణ సంస్థలను విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్న ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ఈ ఇద్దరూ బహు భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో నంబర్ వన్ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రి గత రెండేళ్లలో తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అడుగు పెట్టింది.
తమిళంలో ఆ సంస్థకు బాగా కలిసొస్తోంది కూడా. కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా తీసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బ్లాక్ బస్టర్ కాగా.. ప్రదీప్ రంగనాథన్తో తెరకెక్కించిన ‘డ్యూడ్’ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తమిళంలో మైత్రి అధినేతలు ఇంకో సినిమాను మొదలుపెట్టారు. ఆ చిత్రం గురువారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.
తమిళ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ప్రధాన పాత్రలో మైత్రి సంస్థ కొత్త సినిమా గురించి కొన్ని నెలల ముందే వార్తలు రాగా.. ఇప్పుడా చిత్రం అధికారికం అయింది. ఈ చిత్రంతో కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొన్నేళ్ల ముందు ధ్రువ్ విక్రమ్ అరంగేట్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్గా లెజెండరీ డైరెక్టర్ బాల మొదట తీసిన ‘వర్మ’ ఔట్ పుట్ సరిగా లేక పక్కన పెట్టేశారు.
ఆపై సందీప్ రెడ్డి వంగ శిష్యుడు గిరీశయ్య అదే చిత్రాన్ని ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేస్తే అది ఒక మాదిరిగా ఆడింది. ఆపై ఓటీటీకే పరిమితమైన విక్రమ్ సినిమా ‘మహాన్’లో కీలక పాత్ర చేశాడు ధ్రువ్. ఇది థియేటర్లలో రిలీజ్ కాకపోవడం అతడికి నిరాశ కలిగించింది. ఐతే గత ఏడాది మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ నటించిన ‘బైసన్’ కమర్షియల్ సక్సెస్ కావడంతో పాటు నటుడిగానూ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మైత్రీ సంస్థలో చేస్తున్న సినిమాతో అతను తమిళ, తెలుగు భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నాడు.
This post was last modified on July 2, 2026 8:31 pm
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…