Trends

తమిళ హీరో కొడుకుతో మైత్రి సినిమా

తెలుగు అగ్ర నిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి తమ నిర్మాణ సంస్థలను విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ విషయంలో చాలా దూకుడుగా వెళ్తున్న ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ఈ ఇద్దరూ బహు భాషల్లో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో నంబర్ వన్ నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రి గత రెండేళ్లలో తమిళం, మలయాళం, హిందీ భాషల్లోకి అడుగు పెట్టింది.

తమిళంలో ఆ సంస్థకు బాగా కలిసొస్తోంది కూడా. కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అజిత్ కుమార్ హీరోగా తీసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ బ్లాక్ బస్టర్ కాగా.. ప్రదీప్ రంగనాథన్‌తో తెరకెక్కించిన ‘డ్యూడ్’ కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తమిళంలో మైత్రి అధినేతలు ఇంకో సినిమాను మొదలుపెట్టారు. ఆ చిత్రం గురువారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.

తమిళ సీనియర్ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ ప్రధాన పాత్రలో మైత్రి సంస్థ కొత్త సినిమా గురించి కొన్ని నెలల ముందే వార్తలు రాగా.. ఇప్పుడా చిత్రం అధికారికం అయింది. ఈ చిత్రంతో కరణ్ అరవింద్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొన్నేళ్ల ముందు ధ్రువ్ విక్రమ్ అరంగేట్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌గా లెజెండరీ డైరెక్టర్ బాల మొదట తీసిన ‘వర్మ’ ఔట్ పుట్ సరిగా లేక పక్కన పెట్టేశారు.

ఆపై సందీప్ రెడ్డి వంగ శిష్యుడు గిరీశయ్య అదే చిత్రాన్ని ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేస్తే అది ఒక మాదిరిగా ఆడింది. ఆపై ఓటీటీకే పరిమితమైన విక్రమ్ సినిమా ‘మహాన్’లో కీలక పాత్ర చేశాడు ధ్రువ్. ఇది థియేటర్లలో రిలీజ్ కాకపోవడం అతడికి నిరాశ కలిగించింది. ఐతే గత ఏడాది మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ నటించిన ‘బైసన్’ కమర్షియల్ సక్సెస్ కావడంతో పాటు నటుడిగానూ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు మైత్రీ సంస్థలో చేస్తున్న సినిమాతో అతను తమిళ, తెలుగు భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నాడు.

This post was last modified on July 2, 2026 8:31 pm

Share

Recent Posts

చెన్నై లవ్ స్టోరీకి లైన్ క్లియర్

సంక్రాంతి సినిమాల తర్వాత నాలుగైదు నెలల పాటు బాక్సాఫీస్ దగ్గర పెద్ద స్లంప్ చూసింది టాలీవుడ్. కానీ గత నెలలో…

15 minutes ago

బాలయ్యని మ్యాచ్ చేయడం ఈజీ కాదు

ఏదైనా రీమేక్ సినిమాకు వచ్చే అతి పెద్ద సమస్య పోలిక. ఒరిజినల్ కంటే మెరుగ్గా తీశారా, నటీనటుల్లో ఎవరు బాగా…

17 minutes ago

బండ్ల గణేష్‌కు అక్కడా షాకే

ప్రముఖ తెలుగు నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌‌కు సంబంధించిన ఆస్తి వివాదం ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. గణేష్‌కు చెందిన…

20 minutes ago

లోకేష్ సహనానికి బాబు ప్రశంసల జల్లు

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఏక‌బిగిన ఏడున్న‌ర గంట‌ల పాటు నిల‌బ‌డి.. ప్ర‌జ‌ల‌కు…

1 hour ago

నాని మీద ఒత్తిడి పెరుగుతోంది

ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం…

1 hour ago

మంగాపురంకు చిక్కు వచ్చేలా ఉందే

ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం…

2 hours ago