Trends

నిన్న నీట్… నేడు సీబీఎస్సీ ఫలితాలు

దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం పెను సంచలనం రేపింది. ఫలితంగా నీట్ పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తిరిగి మళ్లీ పరీక్షను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

తాజాగా ఈ నెల ప్రథమార్థంలో విడుదలైన సీబీఎస్సీ ఇంటర్ ఫలితాలు కూడా విమర్శల సుడిలో చిక్కుకున్నాయి. పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సీబీఎస్సీ ఇంటర్ ఫేపర్ల రీ వాల్యూయేషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ గురువారం సంచలన ప్రకటన చేశారు. సీబీఎస్సీ ఇంటర్ ఫలితాల్లో గందరగోళం నెలకొందని ఒప్పుకున్న ప్రదాన్… పరీక్షా పేపర్ల రీ వాల్యూయేషన్ కు ఆదేశాలు జారీ చేసినట్టుగా ప్రకటించారు.

అయితే ఈ వ్యవహారంపై విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జవాబు పత్రాల మార్పిడి, ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) వంటి వాటిలో తప్పులు జరిగాయని ఆయన ప్రకటించారు. వీటిని సరిదిద్దేందుకే రీ వాల్యూయేషన్ కు ప్రకటన జారీ చేసినట్లు చెప్పారు.

ఇప్పటిదాకా జాతీయ స్థాయి విద్యా విధానంలో ఈ ఏడాది ఎదురైన చేదు అనుభవాలు చోటుచేసుకోలేదనే చెప్పాలి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షల్లో ఓ మోస్తరు అవకతవకలు జరిగినా… జాతీయ స్థాయి పరీక్షలో ఇలాంటివి ఇప్పటిదాకా జరగలేదనే చెప్పాలి.

నీట్ కు సంబందించి గడచిన కొంతకాలంగా ప్రశ్నాపత్రాల లీకేజీలు వేధిస్తున్నా… దానిని అధిగమించే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. అయితే ఈ ఏడాది అటు నీట్ పేపర్ లీక్, ఇటు సీబీఎస్సీ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

This post was last modified on May 30, 2026 8:14 am

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

1 hour ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

2 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

3 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

4 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

7 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

7 hours ago