Trends

నీట్ పరీక్షపై సంచలన నిర్ణయం!

నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ కొందరు పేపర్ లీక్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ జూన్ 21న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది.

అయితే ఈ పరీక్షా విధానంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్ష రద్దు చేశామని అన్నారు. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడమే తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. రీ టెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు ఇస్తున్నామని తెలిపారు.

జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, నీట్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో నీట్ పరీక్షపై రకరకాల ఊహాగానాలు, పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, వాటిని విద్యార్థులు నమ్మవద్దని ధర్మేంద్ర ప్రదాన్ కోరారు. కేవలం పరీక్ష రాయడంపైనే దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.

Kumar

Recent Posts

దూత మీద నమ్మకం నిర్మాతను చేసింది

హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…

4 minutes ago

1500 కోట్ల స్కాం… వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు

వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం…

58 minutes ago

జ‌గ‌న్‌పై ఈడీ క‌న్ను… విచార‌ణేనా? అరెస్టా?!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఇప్ప‌టికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న స‌మ‌యంలో…

2 hours ago

అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?

అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…

2 hours ago

కొత్త నిప్పు రాజేసిన వీరభద్రుడు

ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…

3 hours ago

పార్ల‌మెంటు వారీగా జ‌న‌సేన వ్యూహం!

రాష్ట్రంలో ఎద‌గాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుస‌రిస్తోంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా…

3 hours ago