Political News

ఇలాగైతే కష్టమంటున్న కేసీఆర్

తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ పార్టీ బొక్కబోర్లా పడిపోయింది. అయితే మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.

అందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ ముఖ్య నేతలతో తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతల్లో సీరియస్ నెస్ తగ్గిపోయిందని చెప్పిన కేసీఆర్.. ఇకనైనా మేల్కోవాలని, లేకుంటే నష్టపోతారని వారిని హెచ్చరించారు.

రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఈ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్… తన మనసులోని మాటను, తన చెవినపడిన విషయాలను నేతల ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఒకింత ఘాటుగానే స్పందించిన కేసీఆర్.. సీరియస్ నెస్ లేని రాజకీయం చేయడం అవసరం లేదని తేల్చి చెప్పారు.

ప్రజల్లోకి వెళ్లని నేతలు విజయం సాధించినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదని ఆయన ఒకింత కఠువుగానే స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతే,… ప్రజల పక్షాన నిలిచి పోరాడాల్సిన విపక్ష బాధ్యతను నేతలు అటకెక్కించారని కేసీఆర్ మండిపడ్డారు.

పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే తప్పించి నేతలు కదలడం లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. అన్నీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే జరిగితే…ఇక నియోజకవర్గాల్లో ప్రత్యేకించి పార్టీకి ఇంచార్జీలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు.

ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయన్న కేసీఆర్… ఆయా పరిస్థితులను బట్టి అక్కడి స్థానిక నేతలు ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదన్న కేసీఆర్.. రెండేళ్లంటే కళ్లు మూసి తెరిచేలోగానే ఇట్టే సమయం గడిచిపోతుందన్నారు.

ఈ విషయాన్ని గ్రహించి పార్టీ నేతలు మసలుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా జాగరూకతతో వ్యవహరించాలని, మీరు నష్టపోవద్దు, పార్టీని నష్టపోనివ్వద్దు అని కేసీఆర్ వారికి సూచించారు.

This post was last modified on May 15, 2026 11:44 am

Share

Recent Posts

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

9 minutes ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

29 minutes ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

1 hour ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

3 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

4 hours ago