తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ పార్టీ బొక్కబోర్లా పడిపోయింది. అయితే మరో రెండేళ్లలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటాలని ఆ పార్టీ సమాయత్తం అవుతోంది.
అందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పార్టీ ముఖ్య నేతలతో తన ఫామ్ హౌస్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతల్లో సీరియస్ నెస్ తగ్గిపోయిందని చెప్పిన కేసీఆర్.. ఇకనైనా మేల్కోవాలని, లేకుంటే నష్టపోతారని వారిని హెచ్చరించారు.
రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించేందుకు గురువారం ఈ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్… తన మనసులోని మాటను, తన చెవినపడిన విషయాలను నేతల ముందు పెట్టారు. ఈ సందర్భంగా ఒకింత ఘాటుగానే స్పందించిన కేసీఆర్.. సీరియస్ నెస్ లేని రాజకీయం చేయడం అవసరం లేదని తేల్చి చెప్పారు.
ప్రజల్లోకి వెళ్లని నేతలు విజయం సాధించినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదని ఆయన ఒకింత కఠువుగానే స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోతే,… ప్రజల పక్షాన నిలిచి పోరాడాల్సిన విపక్ష బాధ్యతను నేతలు అటకెక్కించారని కేసీఆర్ మండిపడ్డారు.
పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే తప్పించి నేతలు కదలడం లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. అన్నీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే జరిగితే…ఇక నియోజకవర్గాల్లో ప్రత్యేకించి పార్టీకి ఇంచార్జీలు ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు.
ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయన్న కేసీఆర్… ఆయా పరిస్థితులను బట్టి అక్కడి స్థానిక నేతలు ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదన్న కేసీఆర్.. రెండేళ్లంటే కళ్లు మూసి తెరిచేలోగానే ఇట్టే సమయం గడిచిపోతుందన్నారు.
ఈ విషయాన్ని గ్రహించి పార్టీ నేతలు మసలుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా జాగరూకతతో వ్యవహరించాలని, మీరు నష్టపోవద్దు, పార్టీని నష్టపోనివ్వద్దు అని కేసీఆర్ వారికి సూచించారు.
This post was last modified on May 15, 2026 11:44 am
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…